JGL: రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్కు పెద్దపీట వేస్తూ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. ఏటీసీలో శిక్షణ పొందిన విద్యార్థులు చెక్కపై రూపొందించిన తన చిత్రాన్ని ఆయనకు అందజేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 15 రోజుల్లో 6 బ్యాచ్లకు కోర్సులు అందిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.