కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. దేశంలోనే అవినీతి అంతా ఇక్కడే ఉందని భూపాలపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ బస్సు యాత్రలో రాహుల్ ఆరోపించారు. ఇంకా కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన త్వరలోనే అంతమవుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా తయారైందని పేర్కొన్నారు. మరోవైపు యువతకు ఉద్యోగాలు లేవు, రైతులకు రుణమాఫీ లేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఎవరూ బాగుపడింది లేదని వ్యాఖ్యానించారు.
తెలంగాణలోని ములుగు జిల్లాలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో రోడ్షో జరిగింది. చారిత్రాత్మక రామప్ప ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఈ మేరకు ప్రారంభించారు. మరోవైపు ములుగులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే నేడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించి కాంగ్రెస్ వియజభేరి బస్సు యాత్రను ప్రారంభించారు.
తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ పరిధిలో ఓ లారీ నిండా చీరలు తీసుకెళ్తుండగా పట్టుబడ్డాయి.
ధర్మపురి అర్వింద్ తనపై చేసిన వ్యాఖ్యలను మీ ఇంట్లో వారిపై చేస్తే భరించగలరా అని తెలంగాణ ప్రజలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అడిగారు. ఉమ్మడి రాష్ట్రంలో.. ఆంధ్ర పాలకులపై ఇలాంటి భాష ఉపయోగించలేదని చెప్పారు.
మేనల్లుడు హరీశ్ రావుపై సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ఏ పథకం అయినా సరే సిద్దిపేటలో తప్పకుండా అమలు కావాల్సిందేనని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ పదవీ కోరుకోవడం లేదని.. పదవులే తన వద్దకు వస్తాయన్నారు.
తెలంగాణలో నిరుద్యోగ యువత ముందుకు రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అనేక హామీలను పెంచిన కేసీఆర్..ఉద్యోగాల విషయంలో మాత్రం అలా చేయలేదన్నారు. అంతేకాదు వాటి ప్రస్తావనే లేదన్నారు. ఈ అంశాన్ని రాష్ట్రంలో నిరుద్యోగులు గుర్తుంచుకోవాలని రేవంత్ కోరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గరవుతున్న వేళ పార్టీ నేతలు బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.