భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ జరుగుతోన్న విషయం తెలిసిందే. తొలి టీ20లో భారత్ విజయం సాధించి ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. తిరువనంతపురం వేదికగా రెండో టీ20 జరుగుతోంది.
ఐపీఎల్ 2024 లీగ్ కోసం జట్లు తమ ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడం, వేలంలోకి వదిలేసే ప్రక్రియ ఈ సాయంత్రంతో ముగిసింది. దీంతో ఏ జట్లో ఎవరు ఉన్నారో క్లారిటీ వచ్చింది. సన్ రైజర్స్ భారీగా ఆటగాళ్లను విడుదల చేసింది. అందులో ఖరీదైన ఆటగాడు కూడా ఉండడం విశేషం.
నేడు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ టీ20 మ్యాచ్ సాగనుంది.
రోహిత్ శర్మ 2024 టీ20 ప్రపంచకప్లో ఆడాలంటే కోహ్లీలా ఫిట్నెస్ కాపాడుకోవాలని శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పేర్కొన్నారు. ఆయనకు నెక్ట్స్ వరల్డ్ కప్ కూడా ఆడే సత్తా ఉందన్నారు.
వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్ల తీరుపై క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్ ప్రపంచకప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి బీరు తాగడం కలకలం రేపుతోంది.
విశాఖలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి 20 మ్యాచ్లో భారత్ ఉత్కంఠభరిత విజయం సాధించింది. చివరి బాల్ను రింకూ సింగ్ సిక్సర్గా మలచడంతో విక్టరీ కొట్టింది. ఆ సిక్సర్ను అంపైర్లు పరిగణలోకి తీసుకోలేదు.
భారత క్రికెట్ హెడ్ కోచ్గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిసింది. తననే కొనసాగించడానికి బీసీసీఐ సుముఖత చూపినా, ద్రావిడ్ ఆసక్తి కనబరుస్తలేడు. ఆయన ప్లేస్లో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక బాధ్యతలు చేపట్టనున్నారు.
విశాఖపట్నం వేదికగా ఈరోజు ఆస్ట్రేలియాతో భారత్ తొలి టీ20 ఆడనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందనే గెలుపు అంచనాలను ఇప్పుడు చుద్దాం.
గౌతమ్ గంభీర్(gautam gambhir) లక్నో సూపర్ జెయింట్స్ (LSG) నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ (KKR)లో చేరుతున్నట్లు ప్రకటించారు.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు ప్రధాని మోడీ వెళ్లకపోయి ఉంటే.. భారత్ కప్ గెలిచేందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్లను బీజేపీ నేతలు తప్పు పట్టారు.
క్రికెట్ ఆటలో మరో కొత్త రూల్ వచ్చింది. స్టాప్ క్లాక్ విధానంలో ఈ రూల్ను ఐసీసీ ప్రవేశపెట్టింది. బౌలింగ్ వేసే సమయంలో ఒక ఓవర్కు మరో ఓవర్ మధ్య 60 సెకన్లలోపే సమయం ఉండాలి. అలా 60 సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే 5 పరుగులు పెనాల్టీ వేయనున్నట్లు ఐసీసీ కొత్త నిబంధనను తీసుకొచ్చింది.
వరల్డ్ కప్ ఓడిన తర్వాత టీమిండియా ప్లేయర్స్ అంతా బోరుమని ఏడ్చేశారు. రోహిత్ శర్మ ఏడ్చిన వీడియో వైరల్ అయ్యింది. మీరు చక్కగా ఆడారు.. టఫ్ ఇచ్చారని ప్రముఖులు చెబుతున్నారు. ధైర్యంగా ఉండు రోహిత్ అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు.