వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కోసం అంత సిద్ధం అయింది. ఈ ఉత్కంఠ పోరులో భారత్ గెలవాలని ఎంతో పట్టుదలతో ఉంది. ఆస్ట్రేలియాతో ఆడే మ్యాచ్లో ఈ మిడిల్ ఆర్డర్ ఎంతో కీలకం కానున్నాడని గౌతమ్ గంభీర్ జోస్యం చెప్పారు.
అమితాబ్ బచ్చన్ ఫైనల్ మ్యాచ్ చూడొద్దు అంటూ నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. ఆయన చూడపోతేనే కివీస్ భారత్ ఘన విజయం సాధించిందని, అందుకే ఈ ఒక్క మ్యాచ్కు దూరంగా ఉండండి అని అభ్యర్ధిస్తున్నారు. దీనిపై బిగ్ బీ సైతం స్పందించడం విశేషం.
ఎస్ఎల్సీని బీసీసీఐ కార్యదర్శి జై షా నియంత్రిస్తున్నారని మాజీ క్రికెటర్ అర్జున రణతుంగా చేసిన ఆరోపణలపై శ్రీలంక ప్రభుత్వం స్పందించింది. జై షాపై రణతుంగ వ్యాఖ్యలు పై శ్రీలంక ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది.10 జట్లు పాల్గొన్న వరల్డ్ కప్ లో లంక జట్టు పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఆడిన 9 మ్యాచ్ ల్లో 7 ఓటములు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డును క్రీడల మంత్రి రద్దు చేశారు.
ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ 2023 భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో నవంబర్ 19న లైవ్ కార్యక్రమాలు ఉదయం నుంచే ప్రారంభమవుతాయని స్టార్ స్పోర్ట్ ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
అహ్మదాబాద్లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత వాయుసేన ప్రేక్షకులను అచ్చెరవొందేలా ఓ ఎయిర్ షో సిద్దం చేసింది. ఎయిర్ ఫోర్స్కు చెందిన సూర్యకిరణ్ అక్రోబాటిక్ టీం యుద్ధవిమానలతో స్టేడియం గగనతలంపై విన్యాసాలు చేయనున్నారు.
ప్రపంచ కప్ 2023లో లీగ్ దశలో అద్భుతంగా ఆడిన దక్షిణాఫ్రికా జట్టు రెండో సెమీస్లో మాత్రం ఆస్ట్రేలియా జట్టుపై తడబడింది. దీంతో కంగారూల చేతిలో కేవలం మూడు వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఇక ఫైనల్ పోరులో నవంబర్ 19న భారత జట్టుతో ఆసీస్ తలపడనుంది.
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అహ్మదాబాద్లో విమాన టిక్కెట్ల రేట్లతోపాటు హోటళ్లలో రూముల ధరలు(hotel rates) కూడా అమాంతం 100 నుంచి 200 రెట్లు పెరిగిపోయాయని అక్కడి జనం అంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కరాత్రికి స్టార్ హోటళ్లలో ఎంత ధరలు పెరిగాయి? ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ముంబాయి వాంఖడే వేదికగా జరిగిన ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ కోసం భారతీయులు ఎంతో ఆత్రంగా ఎదురుచూశారు. అందులో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల కూడా ఉన్నారట. ఆట కోసం రాత్రంతా మేల్కొనే ఉన్నారని తెలిపారు.
నిన్న జరిగిన మ్యాచ్లో షమీ 7 వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే షమీ 7 వికెట్లు తీస్తాడని ముందు రోజే ఓ నెటిజన్ చెప్పేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టుకు క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వరల్డ్ కప్ సెమీస్లో నేడు భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్పై 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మహ్మద్ షమీ 7 వికెట్లు పడగొట్టి రికార్డు నెలకొల్పాడు. కివీస్తో జరిగిన ఈ మ్యాచ్లో విజయం సాధించడంతో భారత్ ఫైనల్స్కు చేరింది.
వన్డేల్లో 50 సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ ఘనత సాధించడం పట్ల సచిన్ టెండూల్కర్ స్పందించారు. ఈ నేపథ్యంలో కోహ్లీతో తనకు జరిగిన మొదటి భేటీని గుర్తు చేసుకున్నారు. ఇంకా ఏం అన్నారో ఇప్పుడు చుద్దాం.
వరల్డ్ కప్ సెమీస్లో టీమిండియా చెలరేగింది. 397 పరుగులు చేసి విజృంభించింది. ఈ మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రికెటర్గా రోహిత్ శర్మ, వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా కోహ్లి రికార్డులు క్రియేట్ చేశారు. సిక్సులు, ఫోర్ల మోతతో న్యూజిలాండ్ ముందు 398 పరుగుల టార్గెట్ నిలిచింది.
వన్డే వరల్డ్ కప్లో ఇండియా జోరు కొనసాగుతుండగా.. విరాట్ వీర లెవ్లో విరుచుకు పడుతున్నాడు. రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్పై సెంచరీ చేసి మరో ఘనతను సాధించాడు. అంతేకాదు సచిన్ రికార్డును చిత్తు చిత్తు చేశాడు.