భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. అత్యధికంగా 18* వరుస T20ల్లో కనీసం ఓ వికెట్ పడగొట్టిన భారత ఆటగాడిగా అవతరించాడు. గతంలో ఈ రికార్డ్ అర్ష్దీప్(2024-25 మధ్యకాలంలో 17 T20లు) పేరిట ఉండేది. ఆశిష్ నెహ్రా(2016లో 13), వాషింగ్టన్ సుందర్(2024-25లో 11) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచులో భారత్ ఘోరంగా ఓడింది. 188 పరుగుల లక్ష్యఛేదనలో దూబే(42) మినహా ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో 111 పరుగులకే పరిమితమై 76 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. ప్రత్యర్థి బౌలర్లలో యాన్సెన్ 4, మహారాజ్ 3, బాష్ 2 వికెట్లు పడగొట్టారు. కాగా గత టోర్నీ మొదలు చివరి 14 T20 WC మ్యాచుల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్కు ఇదే తొలి ఓటమి.
T20 WC: సౌతాఫ్రికాతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో భారత్ ఓటమి అంచున నిలిచింది. ప్రొటీస్ విసిరిన 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా.. తొలి నుంచి బ్యాటర్లు తడబడ్డారు. ఈ క్రమంలో మహారాజ్ వేసిన 15 ఓవర్లో హార్దిక్(18), రింకూ(0), ఆర్ష్దీప్(10) వెంటవెంటనే వెనుదిరిగారు. 16 ఓవర్ల ఆట ముగిసే సరికి స్కోర్ 88/8 కాగా దూబే(19), వరుణ్(0) క్రీజులో ఉన్నారు.
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లోనూ విఫలమైన అతడు.. కేవలం 15 పరుగులు మాత్రమే చేసి భారీ షాట్కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ సూర్య(10), వాషింగ్టన్ సుందర్(2) క్రీజులో ఉన్నారు.
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లోనూ విఫలమైన అతడు.. కేవలం 15 పరుగులు మాత్రమే చేసి భారీ షాట్కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ సూర్య(10), వాషింగ్టన్ సుందర్(2) క్రీజులో ఉన్నారు.
188 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 4 బంతుల్లోకే డకౌట్గా వెనుదిరిగాడు. మార్క్రమ్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి రికల్టన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అభిషేక్ తన తొలి బంతికే ఫోర్ బాదాడు. తిలక్ వర్మ కూడా 2 పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
సౌతాఫ్రికాతో మ్యాచ్లో బుమ్రా మూడు వికెట్లతో చెలరేగి అరుదైన రికార్డు సృష్టించాడు. T20 WC చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా బుమ్రా (33) అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు అశ్విన్ (32) పేరిట ఉండగా, బుమ్రా దానిని అధిగమించాడు. మరోవైపు, ఈ మ్యాచ్లో రెండు వికెట్లు తీసిన అర్ష్దీప్ (32) కూడా రెండో స్థానంలో నిలిచాడు.
అహ్మదాబాద్లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్తో కలిసి ఆయన T20 ప్రపంచకప్ ట్రోఫీని స్టేడియంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న పిచాయ్.. ఈ విధంగా క్రికెట్పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
టీమిండియాతో మ్యాచ్లో సౌతాఫ్రికా 187/7 పరుగులు చేసింది. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ SAను బ్రెవిస్(45), మిల్లర్(63) ఆదుకున్నారు. స్టబ్స్ 44 పరుగులు చేశాడు. ఒక దశలో 12 ఓవర్లలో 117/4 పరుగులతో భారీ స్కోరు చేసేలా కనిపించినా, డెత్ ఓవర్లలో భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో అడ్డుకున్నారు. బుమ్రా 3, అర్ష్దీప్ 2 వికెట్లు పడగొట్టారు. టార్గెట్: 188
20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ దక్షిణాఫ్రికా జట్టును బ్రెవిస్, మిల్లర్ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు కేవలం 50 బంతుల్లోనే 97 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ధాటిగా ఆడుతున్న బ్రెవిస్ (45)ను దూబే పెవిలియన్ పంపాడు. ప్రస్తుతం మిల్లర్ (52*)కు తోడుగా స్టబ్స్ (1*) క్రీజులో ఉన్నాడు. SA స్కోరు 13 ఓవర్లలో 128/4.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెకండ్ సింగిల్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు హరీశ్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘గబ్బర్ సింగ్’ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్తో యాడ్స్ చేయించడానికి కార్పొరేట్ కంపెనీలు క్యూ కట్టి.. రూ.కోట్లు ఆఫర్ చేశాయని తెలిపాడు. అయితే, ఆ ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచిది కావనే ఉద్దేశంతో పవన్ వాటిని తిరస్కరించారని చెప్పాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా జట్టుకు భారత బౌలర్లు భారీ షాక్ ఇచ్చారు. ఓపెనర్ డికాక్ను(6) బుమ్రా పెవిలియన్ పంపగా, మార్క్క్రమ్(4)ను అర్ష్దీప్ ఔట్ చేశాడు. దీంతో సఫారీ జట్టు 12 పరుగులకే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం 3 ఓవర్లలో 19/2 పరుగులు చేసింది. రికల్టన్(7), బ్రెవిస్(1) క్రీజులో ఉన్నారు.
అహ్మదాబాద్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య T20 WC సూపర్-8 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన 7 T20 WC మ్యాచ్ల్లో భారత్ 5 విజయాలు సాధించి ఆధిపత్యం చాటుకుంది. ఇదే రికార్డును ఈ మ్యాచ్లోనూ కొనసాగించాలని భారత్ పట్టుదలగా ఉంది. మరోవైపు SA కూడా పటిష్టంగా ఉండటంతో ఈ పోరు ఉత్కంఠగా మారింది.
సూపర్-8 గ్రూప్-2 మ్యాచ్లో శ్రీలంకపై ఇంగ్లండ్ 51 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 146 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 95 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటర్లలో షనక (30) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్స్ 3 వికెట్లు తీయగా.. ఆర్చర్, డాసన్, ఆదిల్ రషీద్ తలో రెండు వికెట్లతో లంక పతనాన్ని శాసించారు.