Yashaswi Jaiswal: భారత యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యంగ్ క్రికెటర్ తనదైన బ్యాటింగ్తో అదరగొడుతున్నారు. ఇప్పుడు మరో ఘనత సాధించాడు. ఇంగ్లండ్ సిరీస్లో ఈ యువ ఆటగాడి ప్రతాపం చూశాము. అందుకే ఈ అవార్డు దక్కించుకున్నాడు. ఫిబ్రవరి నెలకుగానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్(Player Of The Month) అవార్డు దక్కించుకున్నాడు. మహిళ క్రికెట్ విభాగంలో ఆస్ట్రేలియా క్రికెటర్ అనాబెల్ సథర్లాండ్(Annabel Sathurland) విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికా టీమ్తో జరిగిన టెస్టులో సథర్లాండ్ డబుల్ సెంచరీ చేసింది. దీంతో ఆమె యూఏఈ క్రికెటర్లను దాటేసి అవార్డు అందుకుంది.
అంతర్జాతీయ క్రికెట్ కమిటీ అందించిన ఈ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రావడంపై భారత్ క్రికెట్ బోర్డు సంతోషం వ్యక్తం చేసింది. ఇంగ్లండ్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో యశస్వీ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఫలితంగా భారీగా పరుగులు సాధించాడు. రెండు డబుల్ సెంచరీలతో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఓటింగ్లో కేన్ విలియమ్సన్, శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంకలను వెనక్కి నెట్టి మరీ యశస్వీ విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. అలాగే టీమిండియా క్రికెటర్లు సైతం ఆయనకు విషేస్ చెబుతున్నారు.