T20 WC సెమీఫైనల్స్కు టీమిండియా అర్హత సాధించడంపై సందిగ్ధత నెలకొంది. భారత జట్టు రన్ రేట్ మైనస్లో ఉండటం ప్రధాన కారణం. సెమీస్కు చేరాలంటే రేపు జరగనున్న మ్యాచ్లో సౌతాఫ్రికా, వెస్టిండీస్ను ఓడించాలి. అలాగే వర్షం కూడా టీమిండియాకు అనుకూలంగా మారవచ్చు. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. భారత్ సెమీఫైనల్స్కు సులభంగా వెళ్తుంది.
T20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో భాగంగా టీమిండియా సెమీస్ అవకాశాలు కఠినంగా మారాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా రేపు భారత్, జింబాబ్వే మ్యాచ్ జరగనుంది. దీనికోసం తాజా పిచ్ను వినియోగించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉందని సమాచారం. దీంతో భారత్ భారీ స్కోర్ చేసే ఛాన్స్ ఉందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షాహీన్ అఫ్రిది కోచ్ మైక్ హెస్సన్పై పరోక్ష విమర్శలు చేశాడు. ‘నమీబియా మ్యాచ్లో నన్ను తొలగించారు. కానీ, నా దృష్టి నా బౌలింగ్పై పని చేయడం, తిరిగి ఎలా జట్టులోకి రావాలి అనేది ఆలోచించాను. నేను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నాకు అవకాశం వచ్చినప్పుడల్లా నేను వెళ్లి నా జట్టుకు 100 శాతం ఇస్తాను’ అని పేర్కొన్నాడు.
T20 WCలో సూపర్-8లో భాగంగా ఇవాళ శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. శ్రీలంక సెమీస్కు చేరాలంటే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సిందే. కాస్త తడబడతున్న శ్రీలంక జట్టు న్యూజిలాండ్ స్పిన్నర్ల ధాటికి తట్టుకుని నిలబడుతందా? అనేది వేచి చూడాలి. అలాగే వర్షం కారణంగా పాక్తో మ్యాచ్ రద్దయ్యి ఒక పాయింట్తో ఉన్న న్యూజిలాండ్కు కూడా ఈ మ్యాచ్ కీలకమే.
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్కు ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు భారీ ఊరట లభించింది. భరణంగా ధావన్ ఇచ్చిన దాదాపు రూ. 5.72 కోట్ల తిరిగి ఇచ్చేయాలని ఆయన మాజీ భార్య ఆయేషా ముఖర్జీని కోర్టు ఆదేశించింది. ప్రాపర్టీ సెటిల్మెంట్ కింద ఆ మొత్తం చెల్లించాలని ఆస్ట్రేలియాలోని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. అది భారతీయ చట్టాలకు విరుద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
T20 WCలో సౌతాఫ్రికాపై భారత్ భారీ తేడాతో ఓటమిపాలవడంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. వరుస విజయాల తర్వాత ఇలాంటి ఓటమి ఎదురవడం సహజమని, ఇది జట్టుకు అలర్ట్ లాంటిదని అభిప్రాయపడ్డాడు. సెమీఫైనల్స్ వంటి కీలక స్టేజ్లో కాకుండా ఇప్పుడే ఓటమి ఎదురైనందుకు సంతోషిస్తున్నా అని అన్నాడు. ఈ ఓటమితో జట్టు తన గేమ్ ప్లానింగ్ చేసుకుని విజయం సాధించే ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నాడు.
ప్రస్తుత T20 వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సారి టోర్నీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆటగాళ్లు సెంచరీలతో రాణిస్తున్నారు. 2010, 2014, 2016 ఎడిషన్స్లో అత్యధికంగా రెండేసి సెంచరీలు నమోదు కాగా.. ప్రస్తుత టోర్నీలో ఇప్పటికే 4* నమోదయ్యాయి. ఇంకా 10 మ్యాచులు మిగిలి ఉండటంతో ఈ సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ లేకపోలేదు.
పాక్తో జరిగిన సూపర్-8 మ్యాచ్లో ఇంగ్లండ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత పాక్ 164 రన్స్ చేయగా.. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ కెప్టెన్ బ్రూక్ సెంచరీ(100)తో రాణించాడు. దీంతో ఇంగ్లీష్ టీమ్ 19.1 ఓవర్లలో విజయాన్ని కైవసం చేసుకోవడంతో పాటు సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. అటు పాక్ అనధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
టీమిండియా ప్లేయర్ రింకూ సింగ్ టీ20 ప్రపంచకప్ మధ్యలోనే ఇంటికి చేరుకున్నాడు. కుటుంబ అత్యవసర పరిస్థితుల కారణంగా అతడు ఇంటికి వెళ్లినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన టీమిండియా ట్రైనింగ్ సెషన్కు అతడు హాజరు కాలేదు. రింకూ తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. పరిస్థితి విషమంగా ఉండటంతో అతడు వెంటనే వెళ్లాల్సి వచ్చిందని సమాచారం.
అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో మ్యాచ్లో భారత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభిషేక్ స్థానంలో శాంసన్, వాషింగ్టన్ స్థానంలో అక్షర్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే, వన్ డౌన్లో సూర్య, ఆ తర్వాత స్థానంలో తిలక్ బ్యాటింగ్కు రావొచ్చు.
టీమిండియాకు అశ్విన్ కీలక సూచనలు చేశాడు. భారత జట్టు ప్రస్తుతం నెట్ రన్రేట్ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. రాబోయే మ్యాచుల్లో జింబాబ్వే, వెస్టిండీస్ జట్లపై విజయం సాధించడంపైనే పూర్తి దృష్టి పెట్టాలని సూచించాడు. అలాగే, బ్యాటర్లు కూడా పిచ్ పరిస్థితులకు అనుగుణంగా తమ షాట్ల ఎంపికపై శ్రద్ధ వహించాలని అశ్విన్ సూచించాడు.
T20 క్రికెట్లో పాకిస్తాన్పై ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం చలాయిస్తోంది. ఈ రెండు జట్లు 30 మ్యాచ్ల్లో తలపడగా.. ఇంగ్లండ్ 21 సార్లు గెలవగా, పాక్ కేవలం 9 మ్యాచ్ల్లోనే గెలుపొందింది. ఇక T20 WCలో.. ఈ రెండు జట్లు 3 సార్లు తలపడగా, అన్ని సార్లు ఇంగ్లండే విజయం సాధించింది. అదేవిధంగా, ఇరు జట్ల మధ్య జరిగిన చివరి 5 టీ20 మ్యాచ్ల్లోనూ ఇంగ్లీష్ జట్టే గెలవడం గమనార్హం.
సూపర్-8 భాగంగా పల్లెకెలె వేదికగా పాకిస్తాన్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పాక్ తొలి మ్యాచ్ వర్షంతో రద్దు కావడంతో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఓడితే సెమీస్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. మరోవైపు శ్రీలంకపై గెలిచిన ఇంగ్లండ్.. ఈ మ్యాచ్లోనూ గెలిస్తే సెమీస్కు చేరుకుంటుంది.