IND vs Ban: బంగ్లాదేశ్, భారత్ మహిళ జట్లు ఐదు టీ20ల సిరీస్లో తలపడున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిల్హెట్ వేదికగా తొలి మ్యాచ్ ఈరోజు జరిగింది. దీనిలో భారత మహిళల జట్టు విజయం సాధించింది. 44 పరుగుల తేడాతో బంగ్లాను ఓడించింది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. షెఫాలీ వర్మ(31), యస్తికా భాటియా (36), హర్మన్ ప్రీత్(30), రిచా ఘోష్(23) అద్భుతమైన ప్రదర్శనతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు సాధించారు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా బ్యాటర్లు భారత బౌలర్లను కట్టడి చేయలేకపోయారు. రేణుకా ఠాకూర్3, పూజా వస్త్రాకర్ 2 వికెట్లు కైవసం చేసుకున్నారు. దీంతో బంగ్లా 8 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. దాంతో భారత జట్టు విజయం సాధించింది. ఇక రెండో టీ20 ఈ నెల 30న జరగనుంది.