ప్రో కబడ్డీ సీజన్-12 క్వాలిఫయర్-2లో తెలుగు టైటాన్స్, పుణేరీ పల్టాన్స్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. హాఫ్ టైమ్ ముగిసే సమయానికి తెలుగు టైటాన్స్ 24-20 పాయింట్లతో స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. తెలుగు టైటాన్స్ ప్లేయర్ భరత్ 14 రైడ్ పాయింట్లు సాధించాడు. మరో 20 నిమిషాల ఆట మిగిలి ఉంది. దీని తర్వాత ఫైనల్కు చేరే జట్టు ఏదో తేలనుంది.