ఆస్ట్రేలియాతో ఈ నెల 6 నుంచి జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్కు భారత స్టార్ బౌలర్ రేణుకా సింగ్ దూరమైంది. గత కొంతకాలంగా వరుసగా మ్యాచ్లాడుతున్న ఆమెకు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయించింది. ఈ మేరకు ఆమె స్థానంలో యువ పేసర్ కశ్వీ గౌతమ్ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్ పెర్త్ వేదికగా భారత కాలమానం ప్రకారం ఉ.10-50 గంటలకు ప్రారంభమవుతుంది.