విశాఖ వేదికగా శ్రీలంక మహిళా జట్టుతో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు సత్తా చాటారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక.. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కేవలం 121 పరుగులకే పరిమితమైంది. లంక బ్యాటర్లలో విష్మి(39) రాణించగా, మిగిలిన వారు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. క్రాంతి, దీప్తి, శ్రీ చరణి తలో వికెట్ తీసుకున్నారు.