టీమిండియాలో తాము ఎంత విలువైన ప్లేయర్లో ‘రో-కో’ జోడీ మరోసారి నిరూపించింది. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో కోహ్లీ రెండు సెంచరీలతో టాప్ రన్ స్కోరర్గా(257*) నిలిచాడు. రోహిత్ రెండు హాఫ్ సెంచరీలతో(146 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు. ఈ ప్రదర్శనతో.. ‘రో-కో’ జోడీ వయసైపోయింది, రిటైర్మెంట్ ప్రకటించడం మంచిదన్న విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి.