ప్రత్యేక అజెండాతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) సరికొత్త రాజకీయం కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన వర్గం సత్తా చాటేలా రాజకీయ ప్రణాళిక రచిస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఇప్పటికైత...
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు (సోమవారం) హైదరాబాద్లో పాదయాత్ర చేపట్టారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. విద్యుత్ సమస్య గురించి స్థానికులు కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇష్యూను అక్కడికక్కడే పరిష్కరించాలని భావించారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేయగా… వారు అందుబాటులో లేరు. దీంతో ఆయన అధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. సమస్యల గురించి తెలుసుకు...
ఇటీవల.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కందుకూరులో నిర్వహించిన బహిరంగ సభ సమయంలో… తొక్కిసలాట జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా… ఈ ఘటన నేపథ్యంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతోపాటు పంచాయితీ రాజ్ రోడ్లు, మున్సిపల్ రోడ్లపై సభలు, సమావేశాలను నిషేధిస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 1ను రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది. ప్రజలకు ఇబ్బందులు కల్గించకూడదన్న ఉద్దేశంతోన...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన యాత్ర జమ్మూ కశ్మీర్ లో సాగుతోంది. కాగా… ఈ నెలాఖరుకి ఆయన యాత్ర ముగిసే అవకాశం ఉంది. ఆయన యాత్రకు నేతలు, ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది. ఇక, రాహుల్ గాంధీ యాత్రకు అనుభవాలకు సంబంధించి ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో ఎదురైన అనుభవాలను ఆ ఇం...
టీచర్ల డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన టీచర్లను విడుదల చేయాలని కోరారు. కేసీఆర్ సర్కార్ తీరు వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఉందన్నారు. పసిపిల్లలు ఏడుస్తున్నా మనసు కరగడం లేదా? తల్లులను, పిల్లలను వేరుచేసి అరెస్ట్ చేస్తారా? అని ధ్వజమెత్తారు. ఓట్లు, సీట్ల రాజకీయం తప్ప భావోద్వేగాలు పట్టవా? మానవత్వం లేదా అని తీవ్ర...
మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ హాట్ కామెంట్స్ చేశారు. దేశంలో ఉన్న ముస్లింలు బానిసలుగా ఉండాలని అన్ని పార్టీ నేతలు భావిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 70 ఏళ్లుగా ఇదే జరుగుతుందన్నారు. ముస్లింలను మోసం చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ముస్లింలు అంతా ఒక్కటే ఓ నేతను ఎన్నుకోవడం ఆ పార్టీలు/ నేతలకు నచ్చదన్నారు. రాజకీయాల్లో అగ్ర కులాలకే ఇంపార్టెన్స్ అని చెప్పారు. బలహీన వర్గాలకు చెందిన నేతలకు ప్రాధాన్...
సీఎం కేసీఆర్పై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే మోసం చేశారని ధ్వజమెత్తారు. బీజేపీకి మేలు చేసేందుకే డ్రామాలు ఆడుతున్రాని, ఆయనను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి నమ్మబోదన్నారు. కేసీఆర్ అత్యంత ప్రమాదకర వ్యక్తి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్ ప్రవేశించడం రాష్ట...
స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. ఓ ప్రత్యేకమైన వీడయోను కూడా మోడీ విడుదల చేశారు. వీడియోలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేశారు. సుభాష్ చంద్రబోస్ తనకు మార్గదర్శకుడని, యువతకు ఆయన మార్గనిర్దేశకుడని, స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. తన రోల్ మోడల్ సుభాష్ చంద్రబోస్ అని తెలిపారు. On Parakram Diwas: A karmayogi's lifelong devotion to the val...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటన రూమ్ మ్యాప్ విడుదలైంది. మంగళవారం పవన్ కొండగట్టుకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు కొండగట్టుకు చేరుకుని అంజన్న ఆలయంలో ప్రచార రథం వారాహికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. పూజా కార్యక్రమాలు అయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు నాచుపల్లి శివారులోని రిసార్టుకి వెళ్లనున్నారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రాబోవు ...
న్యూజిలాండ్ ప్రధానిగా ఉన్న జెసిండా ఆర్డెన్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ తరుణంలో కొత్త ప్రధానిగా క్రిస్ హిప్ కిన్స్ బాధ్యతలు స్వీకరించనున్నారు. న్యూజిలాండ్ అధికార లేబర్ పార్టీ ప్రతినిధులు ఆదివారం కొత్త ప్రధానిని ఎన్నుకున్నారు. దీంతో ఆ దేశానికి 41 ప్రధానిగా క్రిస్ హిప్ కిన్స్ నిలువనున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ దేశం అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. అంతేకాకుండా నిత్యావసర ధరలు కూడా అధ...
గత లోకసభ ఎన్నికలకు ముందు పసుపు బోర్డుపై నిజామాబాద్ ఎంపీ, బిజెపి నేత ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చారని, ఇప్పుడు ఏమైందో చెప్పాలని మంత్రి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిలదీశారు. గెలిచిన కొద్దీ రోజుల్లోనే తీసుకువస్తానని చెప్పి, నాలుగేళ్లు కావొస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయని తెలిపారు. ఇప్పటికీ అయినా అసంబంద్ధమైన ఆరోపణలు మానుకో...
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ములుగులో గిరిజన యూనివర్సిటీకీ రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చామని తెలిపింది. ములుగు మెడికల్ కాలేజ్ లో వచ్చే ఏడాది అకడమిక్ ఇయర్ క్లాస్ లు ప్రారంభమవుతాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో నాలుగు సార్లు మేడారం జాతరకు రూ.100 కోట్లు ఇచ్చామని వెల్లడించింది. అలాగే తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీని రూ.1800 కోట్లతో ఏర్ప...
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. త్వరలో నోటిఫికేషన్ జారీ చేయడానికి సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ నియామక ప్రక్రియలో భాగంగా నిర్వహించే రాత పరీక్షలను ఆన్...
తెలంగాణలో గవర్నర్, ముఖ్యమంత్రికి మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఇవి రోజురోజుకు తీవ్రమవుతున్నారు. గవర్నర్ల వ్యవస్థపై సీఎం కేసీఆర్ జాతీయవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇక గవర్నర్ పదవికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పర్యటనలకు అధికార యంత్రాంగం సహకరించడం లేదు. దీనిపై తరచూ ఆమె మీడియా ముందు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రస్తావి...
తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో ఇప్పటి నుంచే రాజకీయం రసకందాయంగా మారింది. పార్టీల విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లతో రాజకీయ వాతావరణం వేడివేడిగా ఉంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 21 సీట్లు దాటితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకట...