Lokesh Padayatra : టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర దిగ్విజయం గా కొనసాగుతోంది. యువగళం పేరిట ఆయన చేపట్టిన యాత్ర 300 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. దీంతో... తొండమానుపురంర గ్రామంలో లోకేష్ ఈ సందర్భంగా శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.
pattabi:టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గన్నవరం పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షం అయ్యారు. నిన్నటి ఉద్రిక్తత తర్వాత.. పోలీసులు ఆయనను పీఎస్కు తీసుకొచ్చారు. ఆయన ఆచూకీ తెలియడం లేదని.. ఆయన భార్య.. టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు.
గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu) స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఆయన డీజీపీకి (dgp) లేఖ (letter) రాశారు. అధికార వైసీపీ శ్రేణుల తీరును తప్పుపట్టారు. వైసీపీ గూండాలకు పోలీసులు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు కనబడుతుందని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
ys sharmila:బీఆర్ఎస్ నేతల అనుచిత వ్యాఖ్యలపై వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్నారు. అత్యాచారాల్లో తెలంగాణ రాష్ట్రం ముందు ఉందన్నారు. మద్యం అమ్మకాలు, డ్రగ్స్ విచ్చల విడిగా అమ్ముతున్నారని గుర్తుచేశారు.
kanna laxmi narayana:ఏపీ సీఎం వైఎస్ జగన్పై (jagan) సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే అరాచక పాలన ప్రారంభించారని మండిపడ్డారు. ఆయనకు పోలీసులు (police) కూడా తోడయ్యారని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు మాత్రం కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యవహారంలో వాస్తవమే కౌశిక్ రెడ్డి మాట్లాడాడని పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహిళా కమిషన్ తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించదని ప్రశ్నిస్తున్నారు.
Breaking News : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రలో కలకలం రేగింది. హనుమకొండలో యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.
Malladi Vishnu : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకి పిచ్చి పట్టిందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీ ని వీడుతూ సోము పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా... ఆ కామెంట్స్ దెబ్బకు సోము కి పిచ్చి పట్టిందని... ఏం మాట్లాడున్నాడో కూడా తెలియడం లేదంటూ ఆయన విమర్శించడం గమనార్హం.
YS Bharathi : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి... ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా..? వచ్చే ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారా..? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే... అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది.
నితీశ్ పై అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో తనకు గౌరవం లేదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నితీశ్ పై బాహాటంగా విమర్శలు చేశారు. ఒంటరిగా మారడంతో జేడీ(యూ)ను వదిలేసి కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఉపేంద్రకు ఎవరికీ ఇవ్వనంత గౌరవం ఇచ్చామని పేర్కొన్నారు. వివాదం ముదరడంతో జేడీయూలో ఉపేంద్ర ఒంటరిగా మారారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీని వీడి కొత్త పార్టీని స్థాపించారు.
గన్నవరం(gannavaram) టీడీపీ కార్యాలయంపై (Telugudesam) కొందరు దుండగులు చేసిన దాడిని, వాహనాలను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
ఎమ్మెల్యే వల్లభనేని అనుచరులు, వైసీపీ వర్గీయులు రణరంగం సృష్టించారు. సోమవారం సాయంత్రం తెలుగు దేశం పార్టీ కార్యాలయం పైన కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఇష్టారీతిన దాడులు చేయడంతో పలువురు కార్యకర్తలతో పాటు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనలో టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి అరెస్ట్ చేశారు. ఈ అంశం పైన పట్టాభిరామ్ భార్య చందన మీడియా ముందుకు వచ్చారు.
bandla ganesh:నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఇటీవల కాంట్రవర్సీ పోస్టులు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ గురించి ఇష్యూ అయిన సంగతి తెలిసిందే. తారకరత్న చనిపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పక్క పక్కనే కూర్చొన్నారు. ఆ ఫోటోను ట్వీట్ చేసి కామెంట్ చేశారు.
kanna laxmi narayana:కన్నా లక్ష్మీనారాయణ తెలుగు దేశం పార్టీలో చేరబోతున్నారు. ఈ నెల 23వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. అంతకుముందు అనుచరులతో కన్నా లక్ష్మీనారాయణ సుధీర్ఘంగా చర్చలు జరిపారు.