‘namaste andhra pradesh’:దేశ రాజకీయాలపై బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ (cm kcr) దృష్టిసారించారు. మిగతా చోట్ల తన వాణిని వినిపించేందుకు మీడియా హౌస్ (media house) ప్రారంభించే యోచనలో ఉన్నారు. ఏపీలో నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరుతో పత్రిక నెలకొల్పాలని అనుకుంటున్నారని తెలిసింది.
అమిత్ రతన్ మొదటి నుంచి వివాదాలకు కేంద్రంగా ఉన్నాడు. గతంలోనే లంచం వ్యవహారంలో ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అయితే అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఇన్నాళ్లు అతడిపై పోలీసులు, విచారణ సంస్థలు చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేశాయి.
తెలంగాణ గవర్నర్ (Telangana governor) తమిళసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) వ్యాఖ్యలపై తమిళనాడులో (Tamil Nadu) కాంగ్రెస్ (Congress), డీఎంకే (DMK) పార్టీలు తీవ్ర విమర్శలు చేయగా, తమిళనాట భారతీయ జనతా పార్టీ (BJP) అధ్యక్షులు అన్నామలై (Annamalai) వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister of Telangana), భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) పైన ప్రజా శాంతి పార్టీ (praja shanti party) అధ్యక్షులు కేఏ పాల్ ( K. A. Paul) నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి తనను ఎదుర్కోలేక తన సోదరుడి హత్యను తిరగదోడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
పత్రిక, టీవీ వ్యవహారాలు దగ్గరుండి విజయ సాయిరెడ్డి చూసుకున్నారు. వైఎస్సార్ మరణం జరిగిన పరిణామాల నేపథ్యంలో జగన్ పార్టీ పెట్టాడు. అప్పటి నుంచి పార్టీలో కీలక నాయకుడిగా విజయ సాయిరెడ్డి మారాడు. అప్పటి వరకు తెర వెనుక ఉన్న ఆయన అనంతరం తెర ముందుకు వచ్చాడు.
పార్టీలో నా ప్రయాణం సాహసోపేతంగా సాగింది. రెండు దశాబ్దాలుగా నిస్వార్థంగా పని చేశా. కానీ ప్రస్తుతం పార్టీలో విలువలు లేవు. నాకు గౌరవం కూడా లేదు. ఈ క్రమంలోనే రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొనలేదు. ఇప్పుడు కొత్త మార్గాన్ని అన్వేషించుకోవాలని భావిస్తున్నా.
నీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఆక్రమించుకున్న భూములు, సింగరేణి నిధుల దోపిడీ, అక్రమ కాంట్రాక్టుల మీద విచారణకు ఆదేశించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ కు సవాల్ చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించిన క్రమంలో రేవంత్ రెడ్డి ఈ విధంగా పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ప్రజావ్యతిరేక పాలన పోవాలని ప్రజలను సూచించారు.
జగన్ (YS Jagan) ప్రభుత్వం తన పాదయాత్రను (Padayatra) అడ్డుకోవడంపై దృష్టి సారించడానికి బదులు, ప్రజా సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుందని తెలుగు దేశం పార్టీ (Telugu Desam) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) బుధవారం అన్నారు.
రెండు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేక గాలులు వస్తున్నాయి. ఆ పార్టీ గట్టెక్కడం కష్టంగా ఉందని సమాచారం. ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న యడియూరప్పకు మళ్లీ అవకాశం దక్కడం అసాధ్యమే. ఆ పదవి ఇవ్వకుంటే ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే తనకు గౌరవం ఉండదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యాడు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కేసీఆర్ రూ.1000 కోట్లు ఆఫర్ చేశారనే ఆరోపణలను ఆంధ్ర ప్రదేశ్ బీఆర్ఎస్ అధినేత తోట చంద్రశేఖర్ ఖండించారు. పవన్ కళ్యాన్ కు (Pawan Kalyan) తమ పార్టీ అధినేత (KCR) 1000 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదని, అసలు అలా చెబుతున్న వారి దిగజారుడుతనానికి ఇది అద్దం పడుతుందన్నారు.
తమకు అన్నీ తెలుసునని భావించే బీజేపీ ఎవరినీ గౌరవించని ‘క్లాస్ రౌడీ’ లాంటిదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు. మరోవైపు మేఘాలయ షిల్లాంగ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న క్రమంలో రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అయితే బీజేపీని గెలిపించేందుకే టీఎంసీ పోటీ చేస్తుందని ఎద్దేవా చేశారు.
Pawar on EC decision:శివసేన రాజకీయ పార్టీ, గుర్తులకు సంబంధించి ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం అతి పెద్ద దాడి అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ (sharad Pawar) అన్నారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే కుమారుడు ఉద్దవ్ థాకరే.. పార్టీ, గుర్తు తనకే కావాలని అంటున్నారు. ఈసీ మాత్రం ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో గల కూటమికి అప్పగించింది.