Revanth reddy:అంబర్ పేటలో చిన్నారి ప్రదీప్ను వీధి కుక్కల దాడి చేసి చంపేసిన సంగతి తెలిసిందే. ఇదీ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) స్పందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆదుకోవాలి.. మంత్రి కేటీఆర్ (ktr) మాత్రం వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తామనడం ఏంటీ అని అడిగారు.
Rayapati Sambasivarao:ఏపీ సీఎం జగన్పై (jagan) సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు (Rayapati Sambasivarao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం టీడీపీ నేత బాలకోటిరెడ్డి (Balakotireddy) కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని రాయపాటి విమర్శించారు. శాంతిభద్రతలు క్షీణించాయని పేర్కొన్నారు.
గత ఏడాది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధికంగా విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ మూడు విఫల ప్రయత్నాల తర్వాత ఈరోజు తన మేయర్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్ 34 ఓట్ల తేడాతో గెలుపొందారు. మేయర్ ఎన్నికలో నామినేటెడ్ సభ్యులకు ఓటు వేయాలనే నిర్ణయంపై ఆప్, బీజేపీ సభ్యులు వాగ్వాదానికి దిగడంతో గతంలో మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశాలు వాయిదా పడ్డాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి ప్రకటించారు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన రామస్వామి ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను కూడా బరిలోకి దిగనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నిక్కీ హేలీ బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు.
ys sharmila:యూత్ కాంగ్రెస్ వరంగల్ అధ్యక్షుడు పవన్ను (pawan) వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (ys sharmila) పరామర్శించారు. ఇటీవల BRS కార్యకర్తల దాడిలో గాయపడ్డ సంగతి తెలిసిందే. వైద్యులతో మాట్లాడి పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి షర్మిల (ys sharmila) తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన (president rule) విధించాల్సిన అవసరం ఉందని షర్మిల అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)... పోలీసులు (police) అరెస్ట్ చేసిన పట్టాభి (Pattabhi) కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లి భార్య చందన (Chandana), పిల్లలతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే, 30 సంవత్సరాలు ప్రజా సేవలో ఉన్న వ్యక్తిని గౌరవించుకోలేని దౌర్భాగ్యం పట్టిందని సాయన్న అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ దళితులపై చిన్నచూపు చూస్తున్నాడని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. దళిత సీఎం మాట తప్పినప్పటి నుంచే దళితులపై కేసీఆర్ కు ప్రేమ లేదని రుజువైందని చెప్పారు. రాజకీయాలు పక్కనపెడితే సాయన్న వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందరిలో అసంతృప్త...
తాను విశాఖ లోకసభ స్థానం (vishaka lok sabha) నుండి తాను స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానని సీబీఐ (CBI) మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ (VV Lakshminarayana) మరోసారి స్పష్టం చేశారు.
భారత్ జోడో యాత్ర పేరిట రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సుదీర్ఘ యాత్ర చేపట్టాడు. నిస్తేజంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపాడు. సోనియా గాంధీ ఇటలీ దేశస్తురాలు. సోనియా తల్లి పావ్ లామాయినో ఇంకా జీవించి ఉన్నారు. అందుకే అప్పుడప్పుడు రాహుల్ ఇటలీకి వెళ్తుంటాడు.
గన్నవరంలో తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడి, తదనంతర పరిణామాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి, పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగం ఆరోపణలు ప్రతిపక్ష పార్టీకి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. పోలీసులు ఎట్టకేలకు పట్టాభిని మంగళవారం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు ఆరోపించారు పట్టాభి.
hijras on ys sharmila:వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిలపై (sharmila) హిజ్రాలు (hijra) ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ (shankar naik) గురించి కామెంట్స్ చేసే సమయంలో తమ పేరును ప్రస్తావించడాన్ని తప్పుపట్టారు. వెంటనే క్షమాపణ చెప్పాలని అమీర్ పేటలో (ameerpet) హిజ్రాలు ధర్నా చేపట్టారు.
kesineni chinni:గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్పై (vallabhaneni vamsi mohan) టీడీపీ నేత కేశినేని చిన్ని (kesineni chinni) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలవననే భయం పట్టుకుందన్నారు. ఓటమి భయంతోనే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని ఆరోపించారు.
pattabi show his hand:తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (pattabi)ని పోలీసులు గన్నవరం (Gannavaram) కోర్టుకు తీసుకువచ్చారు. కోర్టు వద్ద పట్టాభి (pattabi) తన వాచిన చేయిని మీడియాకు చూపించారు. చేతులు కమిలిపోయాయని చూపిస్తూ కోర్టు లోపలికి వెళ్లారు.
Raja singh:అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ళ బాలుడు (child) చనిపోయిన ఘటనపై గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja singh) స్పందించారు. వీధి కుక్కల సమస్యపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించాలని కోరారు. నాలుగేళ్ళ బాలుడు ప్రదీప్ (pradeep) కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు.