తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నల్గొండలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ మండిపడ్డారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వయసు, జ్ఞాపక శక్తి విషయంలో ఆ దేశంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని వెస్ట్ వర్జీనియా అటార్నీ జనరల్ కోరారు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసే అభ్యర్థుల వయో పరిమితిని పెంచుతూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు ఏమిటంటే...
పాకిస్థాన్ పార్లమెంటరీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. దీంతో పాక్ మాజీ ప్రధాని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా పాములు కదుపుతున్నారు.
అమెరికాలో భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. నీ భర్త ఎక్కడ? అంటూ పరిహాసమాడారు. దీంతో ఆమె దీనిపై ఘాటుగా స్పందించారు.
అల్లురి జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లిలో సభ జరిగింది. ఈ సభలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. నియంత పాలకులను తరిమి కొట్టాలన్నారు.
పొత్తుల విషయంలో ఎవరు విద్వేశాలను రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని జనసేన సైనికులకు సూచించారు అధినేత పవన్ కల్యాణ్. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం టీడీపీతో పొత్తు ఉంటుంది. దీన్ని అందరు దృష్టిలో పెట్టుకోవాలని ఓ ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ని అందిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. అందుకు ప్రస్తుత బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ ఊపు మీదున్నారు. రెండు ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించి దూసుకుపోతున్నారు.
పాకిస్థాన్ ఎన్నికల్లో అనూహ్యంగా ఇమ్రాన్ ఖాన్కు చెందిన తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ విజయాలను దక్కించుకుంటూ ఉంది. దీంతో ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.