జాతిపిత మహాత్మాగాంధీ మనవడు అరుణ్ గాంధీ(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఆయన ప్రాణాలు వదిలినట్లు కుటుంబసభ్యులు చెప్పారు.
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తే.. వైసీపీ ఓడిపోవడం ఖాయమని ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ గెలిచిన ఆయన ప్రస్తుతం ఆ పార్టీకే రెబల్ గా మారారు.
సభను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఎందుకంటే తన లోక్ సభ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే సభకు భారీ ఎత్తున నిరుద్యోగులు, ప్రజలను తరలించాలని రేవంత్ వర్గం భావిస్తున్నది. ఈ సభతో బల ప్రదర్శన చేయాలని రేవంత్ వర్గీయులు నిర్ణయించినట్లు సమాచారం.
కార్మికుడు మరణిస్తే అంత్యక్రియలకు ఇచ్చే రూ.20 వేల సహాయం ఆపేయడం దుర్మార్గం. కార్మిక ప్రయోజనాలకు సీఎం జగన్ మంగళం పాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ నాయకుడి స్థలంలో వైసీపీ నాయకులు వెంచర్లు వేస్తుంటే ఆదివారం బీటెక్ రవి అడ్డుకున్నారు. తన అనుచరులతో వెళ్లి అక్కడి స్థలాన్ని పరిశీలించారు. వైసీపీ నాయకుల దౌర్జన్యంపై నిలదీశారు. ఆ స్థలం తమదేనంటూ వైసీపీ నాయకులు అబద్ధాలకు తెరలేపారు.
బిజెపి నేత విజయశాంతి మరోసారి సిఎం కెసిఆర్ పై విమర్శలు గుప్పించారు. కొత్త సచివాలయంలోకి ఎవరినీ అనుమతించకపోవడంపై ఆమె మండిపడ్డారు.
అశ్వినిదత్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ(Posani Krishna murali) ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడో ఛార్జిషీట్లో ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ పేరును ఈడీ చేర్చింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జెండా ఎగరేయాలని అన్ని పార్టీలు కసి మీద ఉన్నాయి. ఆ మేరకు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ సందర్బంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లపై వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఓటర్లకు అమలు చేయాల్సిన పనుల మేనిఫెస్టోపై ఫోకస్ చేస్తున్నాయి
దేశంలో బీజేపీ పాలకులు ఉన్మాద రాజకీయాలను అవలంభిస్తోందని, ఫాసిస్ట్ భావజాలానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటాలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
సచివాలయానికి వెళ్తుండగా టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని తెలంగాణ పోలీసులు టెలిఫోన్ భవన్ వద్ద అడ్డుకున్నారు.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కమిషన్ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్ను ఈడీ విచారిస్తోంది.
థాయ్లాండ్లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తోన్న చికోటీ ప్రవీణ్ కుమార్ సహా 90 మందిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొనసాగుతున్న ప్రజా వ్యతిరేక పాలనపై తెలంగాణ (Telangana) మంత్రుల విమర్శల పరంపర కొనసాగుతోంది. గతంలో హరీశ్ రావు (Harish Rao), కేటీఆర్ (KT Rama Rao) తదితర మంత్రులు విమర్శలు చేయగా.. తాజాగా మరోసారి మల్లారెడ్డి (Malla Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో నత్తనడకన సాగుతున్న పోలవరం ప్రాజెక్టును (Polavaram Project) తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) పూర్తి చేస్తారని ప్రకటించారు. వి...