ADB: విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఆదిలాబాద్ జిల్లాలోనే ప్రభుత్వ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనీ పలువురు విద్యార్థులు కోరారు. శుక్రవారం నేరడిగొండలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటనలో భాగంగా ఆయనకు వినతి పత్రం అందజేశారు. యూనివర్సిటీని నిర్మల్కు తరలించే ప్రతిపాదనను విరమించుకోవాలన్నారు. అదేవిధంగా జిల్లాలో ST స్టడీ సర్కిల్ ప్రారంభించాలన్నారు.
HNK: 59వ డివిజన్ వికాస్ నగర్ కాలనీలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శుక్రవారం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో MLA నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఆలయ కమిటీ, కాంగ్రెస్ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు.
NLG: చిట్యాల ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ మలుపు వద్ద తెరిచి ఉన్న గేట్ వాల్ వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది. స్కూల్ వెనుక వైపు నివసించే స్థానికులు, వాహనదారులు మలుపు వద్ద తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇవాళ ఇదే వార్డులో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో, అధికారులు స్పందించి వెంటనే డ్రైనేజీపై మూతను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
W.G: పోడూరు మండలం చింతలగరువు స్కూల్లో ఇవాళ HM కొల్లాబత్తుల సూర్య కుమార్ అధ్యక్షతన జాతీయ దంత వైద్యుల దినోత్సవం జరిపారు. MIHP ఎం. అనిత మాట్లాడుతూ.. మన దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నారు. దంతాల పట్ల విద్యార్థులు తీసికోవలసిన జాగ్రత్తలు గురించి వివరించారు. ANM వి.మాలిని, హెల్త్ అసిస్టెంట్ R.రాజేష్, ఆశా వర్కర్ M. నిర్మలాకుమారి పాల్గొన్నారు.
NRPT: జిల్లాలోని ప్రైవేట్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో సూచనలు జారీ చేశారు. SSC ప్రీ ఫైనల్ పరీక్షల ఫలితాలపై సమీక్ష సమావేశాన్ని రేపు శ్రీ కృష్ణ గోకులం హైస్కూల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశం మధ్యాహ్నం 2.00 నుంచి 3.30 గంటల వరకు జరుగుతుందని, సమయానికి అందరూ హాజరు కావాలన్నారు.
NDL: బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలో ఇవాళ ఎంపీడీవో గాయత్రి పర్యటించారు. ఇంటి పన్ను, కులాయి పన్ను సక్రమంగా చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు సూచించారు. పారిశుద్ధ్య పనులు సరిగా జరగడం లేదని, దోమల బెడద అధికమైందని గ్రామస్తులు ఆమె దృష్టికి తెచ్చారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
AP: టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో ఎవరు తప్పు చేసినా బాధ్యత వహించాలని అన్నారు. లేకపోతే వెంకటేశ్వరస్వామే వారిని శిక్షిస్తారని తెలిపారు. ‘కూటమి ప్రభుత్వంలో కల్తీ అని తేలినా.. మరో సంస్థ పేరుతో 4 ట్యాంకర్ల నెయ్యిని తీసుకొచ్చారు. నెయ్యిపై చర్చించాలని కోరితే ప్రభుత్వం తోకముడిచింది’ అని విమర్శించారు.
కృష్ణా: 15వ ఆర్థిక సంఘం నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి తెలిపారు. శుక్రవారం చల్లపల్లి అశోక్ నగరులో గ్రామ పంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 4లక్షలతో నూతన సీసీ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. సర్పంచ్ పూజలు చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో పంచాయతీ ఈఓ పీవీ మాధవేంద్రరావు, వార్డ్ సభ్యులు మీర్ రిజ్వాన్ పాల్గొన్నారు.
MBNR: మిడ్జిల్ మండలం రాణిపేటలో శుక్రవారం ‘డ్రై డే–ఫ్రైడే’ కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి సుదర్శన్ మాట్లాడుతూ.. డెంగీ, చికున్ గున్యా వంటి వ్యాధులు రాకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నిల్వ నీటిని తొలగించి దోమల పెరుగుదలను అరికట్టాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
అన్నమయ్య: మదనపల్లె మార్కెట్లో శుక్రవారం టమాటా ధరలు భారీగా పడిపోయాయి. ఇవాళ మార్కెట్కు సుమారు 70 మెట్రిక్ టన్నుల టమాటాలను రైతులు తీసుకొచ్చారు. వ్యాపారులు మొదటి రకం 10 కిలోల బాక్స్ను రూ.110కు, రెండో రకం బాక్స్ను రూ. 90కు కొనుగోలు చేశారు. పంట దిగుబడి బాగున్నప్పటికీ గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
NGKL: కల్వకుర్తి మండలంలోని గుంటూరు గ్రామానికి చెందిన తుప్పల సత్యనారాయణకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కును స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇవాళ అందజేశారు. బాధితుడు అనారోగ్యంతో బాధపడుతూ.. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందగా ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో రూ. 60 వేల సీఎం సహాయనిధి చెక్కు మంజూరు అయినట్లు తెలిపారు.
BHNG: ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ఘనంగా ప్రారంభమైంది. మున్సిపల్ ఛైర్పర్సన్ బీజనా బాలమణి భాస్కర్ ఆధ్వర్యంలో పట్టణంలో ప్రత్యేక సానిటైజర్ డ్రైవ్ చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వార్డుల్లో నెలకొన్న పారిశుద్ధ్య, ఇతర సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
KRNL: ఆదోనిలోని జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందని శుక్రవారం యార్డు కార్యదర్శి గోవిందు తెలిపారు. 2025-26 సంవత్సరానికి ప్రభుత్వం రూ.18 కోట్ల ఆదాయ లక్ష్యం నిర్దేశించగా, ఇప్పటికే రూ.18.40 కోట్లు వసూలయ్యాయని చెప్పారు. రైతులకు పంటలు బాగా దిగుబడి రావడంతో యార్డులో క్రయవిక్రయాలు ఎక్కువగా జరిగాయని తెలిపారు.
TG: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన 12 విమానాలు రద్దయ్యాయి. అదే సమయంలో గల్ఫ్ నుంచి ఇక్కడికి రావాల్సిన మరో 12 విమానాలు కూడా నిలిచిపోయాయి. ఖతార్, UAE, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా దేశాలకు రాకపోకలు సాగించే విమానాలు ఇందులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు తమ విమాన సమాచారాన్ని ముందే సరిచూసుకోవాలని సూచించారు.
WGL: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యునిగా ఎంపికైన ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని శుక్రవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, పీసీసీ మెంబర్ వరద రాజేశ్వర్రావు మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యసభ సభ్యునిగా ఎంపికైన సందర్బంగా వేం నరేందర్ రెడ్డికి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.