• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తాగునీటి ఎద్దడిపై కలెక్టర్ వినోద్ కుమార్ కీలక ఆదేశాలు

BPT: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో బాపట్ల జిల్లాలో ఎండలు పెరుగుతున్నాయని, తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. చేతిపంపులు, బోర్లు సక్రమంగా పనిచేసేలా చూడాలని, ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా తగిన వనరులను సమకూర్చుకోవాలని శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన సూచించారు.

February 28, 2026 / 06:04 AM IST

పాలిటెక్నిక్ కళాశాల శివారులో చిరుత కలకలం

నిజామాబాద్ జిల్లాలోనీ నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక గుట్ట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించినట్లు కళాశాల విద్యార్థులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

February 28, 2026 / 06:04 AM IST

బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి

NGKL: జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన అమానవీయ ఘటనపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం విశారదన్ మహారాజ్ కార్యాలయంలో బాధితులను పరామర్శించి, రెండు నెలల పాప మరణానికి కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి స్పందించాలని కోరారు.

February 28, 2026 / 06:03 AM IST

నేడు కాళోజీ కళాక్షేత్రంలో అంతరిక్ష ప్రయోగాలపై సెమినార్

HNK: అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం (నేడు) మ.2:30 నుంచి 4 వరకు HNK కాళోజీ కళాక్షేత్రంలో సెమినార్ నిర్వహించనున్నారు. అంతరిక్ష ప్రయోగాలపై ప్రముఖ వక్తలు విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. పరిమిత సంఖ్యలోనే ప్రవేశం ఉంటుందని అధికారులు తెలిపారు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

February 28, 2026 / 06:02 AM IST

నేడు ధర్మకర్తల మండలి సమావేశం

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు అధ్యక్షతన జరగనుంది. మొత్తం 87 అంశాలపై చర్చించనున్నారు. నూతన అదనపు అన్నదాన భవనం ఏర్పాటుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చిన అంశం, టీటీడీ విద్యాసంస్థలకు రూ.116 కోట్లు, అలాగే రూ.5700 కోట్ల వార్షిక బడ్జెట్ ప్రతిపాదనపై చర్చించనున్నారు.

February 28, 2026 / 06:02 AM IST

పోలవరం కుడి కాలువ పెండింగ్ పనులు ప్రారంభం

కృష్ణా: పోలవరం కుడి కాలువ పెండింగ్ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. కృష్ణా(D) పరిధిలోని 5వ రీచ్‌లో నూజివీడు(M) పల్లెర్లమూడి నుంచి గన్నవరం మండలం వరకు విస్తరించిన మార్గంలో మిగిలిన నిర్మాణాలు పూర్తి చేయనున్నారు. సీతారాంపురం వద్ద 650మీటర్ల లైనింగ్ పనులను ఇటీవల అధికారులు ప్రారంభించారు. 5వ రీచ్‌తో పాటు 6,7 ప్యాకేజీల్లో నిలిచిన లైనింగ్ పనులు మార్చిలో ప్రారంభిస్తారు.

February 28, 2026 / 06:00 AM IST

జోగి రమేష్ నివాసాన్ని సందర్శించిన లక్ష్మీపార్వతి

NTR: ఇబ్రహీంపట్నంలో టీడీపీ శ్రేణులు పెట్రోల్ బంకులతో దాడి చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని ఏపీ తెలుగు అకాడమీ మాజీ ఛైర్మన్,ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి, జోగు రమేష్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. దాడి చేసిన వాటిని శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

February 28, 2026 / 06:00 AM IST

నేడు జీవీఎంసీ సర్వసభ్య సమావేశం

VSP: జీవీఎంసీ సర్వసభ్య సమావేశాన్ని ఇవాళ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 37 అంశాలతో అజెండా సిద్ధం చేసి సభ్యులకు పంపిణీ చేశారు. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం వచ్చే నెల 17తో ముగియనున్న నేపథ్యంలో ఇదే చివరి సమావేశం కానుంది. ఉద్యోగుల సర్వీస్‌ అంశాలు, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది కొనసాగింపు, ఆమోదం వంటి అంశాలు అజెండాలో పొందుపరిచారు.

February 28, 2026 / 06:00 AM IST

బంగారు దొంగతనం.. ఏడాది పాటు జైలు శిక్ష

NLR: వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసులో నెల్లూరు జడ్జి సోమశేఖర్ ముద్దాయికి ఏడాది పాటు జైలుశిక్ష విధించారు. 2017 అక్టోబర్ 25వ తేదీన బీవీ నగర్‌కు చెందిన వ్యక్తికి నిందితుడు ఆహార పదార్ధాలలో మత్తు పదార్థం కలిపి రూ. 3.50 లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు.

February 28, 2026 / 06:00 AM IST

జిల్లా యువతకు జాబ్ మేళా: సీఎండీ

ATP: జిల్లా యువతకు మార్చి 4న తిరుపతిలోని APSPDCL కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రైవేట్ కంపెనీలు అభ్యర్థులను ఎంపిక చేస్తాయని సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. పదో తరగతి నుంచి ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

February 28, 2026 / 06:00 AM IST

విశిష్ట గుర్తింపు నమోదుకు నేడే చివరి తేదీ

AKP: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే రైతు సంక్షేమ పథకాలు వర్తించాలంటే విశిష్ట గుర్తింపు నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి విజ్ఞప్తి చేశారు. విశిష్ట గుర్తింపు నమోదుకు శనివారం సాయంత్రం వరకు గడువు ఉందన్నారు. ఫోన్ నెంబర్, ఆధార్, పట్టాదారు పాసుబుక్ జిరాక్స్ తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

February 28, 2026 / 06:00 AM IST

నేడు పెనుకొండలో మంత్రి సవిత పర్యటన

సత్యసాయి: మంత్రి సవిత ఇవాళ పెనుకొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం కోడిగినహల్లిలో పెన్షన్ల పంపిణీ, రూ.1.80 కోట్లతో బీసీ హాస్టల్ భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, విట్టాపల్లి రోడ్డు పనుల పరిశీలన చేయనున్నారు. మధ్యాహ్నం పెనుకొండ పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.

February 28, 2026 / 06:00 AM IST

ALERT: నోటిఫికేషన్ వచ్చేసింది

DEiEd, DPSE కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన DEECET 2026 నోటిఫికేషన్ వచ్చేసింది. ఆసక్తి గలవారు మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. మే 21, 22 తేదీల్లో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మార్చి 5 నుంచి వెబ్‌సైట్‌లో ఉంటాయని కన్వీనర్ రమేష్ తెలిపారు. పరీక్ష ఫీజు రూ.500. SC/ST/PwDలకు రూ.450.

February 28, 2026 / 06:00 AM IST

నేడు వెంకన్న స్వామి రెండో శనివారం ఉత్సవాలు

PLD: రాజుపాలెం మండలం దేవరంపాడులోని ప్రసిద్ధ నేతి వెంకన్న స్వామి వారి రెండో శనివారం వేడుకలు నేడు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకల కోసం దేవాదాయ శాఖ కమిటీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రేపు ఆలయ ప్రాంగణంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడంతో పాటు, భక్తులందరికీ భారీగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

February 28, 2026 / 06:00 AM IST

జిల్లాను ముందంజలో నిలపాలి: జేసీ

కోనసీమ: రెవెన్యూ, పౌరసరఫరాల విభాగాల్లో సిబ్బంది అంకిత భావంతో పనిచేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జేసీ నిశాంతి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, రెవెన్యూ క్లినిక్ నిర్వహణ, స్పందన అర్జీల పరిష్కారంపై దిశానిర్దేశం చేశారు.

February 28, 2026 / 05:51 AM IST