• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పూరి జగన్నాథ్, సూర్య కాంబోలో మూవీ?

తమిళ స్టార్ హీరో సూర్య, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో  సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. పూరి మార్క్ మేనరిజమ్స్‌తో సిద్ధం చేసిన కథకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ ఫలితాల తర్వాత పూరి ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారట. విజయ్ సేతుపతితో పూరి చేస్తున్న సినిమా ముగిశాక ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు టాక్.

February 26, 2026 / 04:20 PM IST

స్వర్ణాంధ్ర, పీ4 లక్ష్యాల సాధనకు కలెక్టర్ దిశానిర్దేశం

ATP: స్వర్ణాంధ్ర, జీరో పావర్టీ పీ4 కార్యక్రమాలపై ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్ నుంచి పాల్గొన్న కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు జిల్లాలో కీలక అభివృద్ధి సూచికల్లో పురోగతి సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

February 26, 2026 / 04:19 PM IST

వనపర్తి ఎంసీహెచ్ తనిఖీ

వనపర్తి పట్టణ శివారులోని నరసింగాయపల్లి ఎంసీహెచ్‌ను కలెక్టర్ ఆదర్శ్ సురభి తనిఖీ చేశారు. చిన్నపిల్లల వార్డులో వైద్య సేవలను పరిశీలించారు. అత్యవసర సమయంలో వినియోగించే వెంటిలేటర్ సదుపాయం పనిచేస్తుందో లేదో ఆరా తీశారు. చిన్నపిల్లలకు వెంటిలేటర్ సద్వినియోగం కల్పించాలని ఆదేశించారు.

February 26, 2026 / 04:19 PM IST

యాంకిలో ఘనంగా క్రికెట్ టోర్నీ ప్రారంభం

VKB: దౌల్తాబాద్ మండలంలోని యాంకిలో గురువారం క్రికెట్ టోర్నమెంట్‌ను గ్రామ పెద్దలు వైభవంగా ప్రారంభించారు. సర్పంచ్ ఏ.మాణిక్యప్ప, రవీందర్ రెడ్డి, కోట్ల హన్మంతు, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం టాస్ వేసి మ్యాచ్‌ను ప్రారంభించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి.

February 26, 2026 / 04:18 PM IST

మైదుకూరులో నూతన HPCL పెట్రోల్ బంక్ ప్రారంభం

KDP: మైదుకూరులోని బద్వేల్ రోడ్డుపై నూతన HPCL పెట్రోల్ బంకును ఎమ్మెల్యే సుధాకర్ ప్రారంభించారు. మార్కెట్ యార్డ్ ఛైర్మన్ రవీంద్ర, 7వ వార్డు కౌన్సిలర్ సుమలత దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏపీ వెంకటయ్య ఫిల్లింగ్ స్టేషన్‌ను రిబ్బన్ కట్ చేసి, టెంకాయ కొట్టి ప్రారంభించారు. నూతన వ్యాపారంలో అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.

February 26, 2026 / 04:18 PM IST

‘విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి’

AKP: విద్యార్థులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య ఆరోగ్య సిబ్బంది సూచించారు. గురువారం కోటవురట్ల మండలం కొడవటిపూడి జడ్పీ హైస్కూల్లో రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థులకు ఐరన్ టాబ్లెట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు పరిశుభ్రత పాటించాలన్నారు. బజార్లో దొరికే జింక్ ఫుడ్స్ జోలికి వెళ్ళవద్దన్నారు. ఆకుకూరలు కాయగూరలు తీసుకోవాలన్నారు.

February 26, 2026 / 04:17 PM IST

పెట్రోల్ బంకుకు శంకుస్థాపన చేసిన ఎస్పీ

MDK: పోలీస్ శాఖకు IOC ద్వారా రెండు పెట్రోల్ బంకులు మంజూరు అయినట్లు జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాస రావు తెలిపారు. ఇందులో భాగంగా ఆవుసులపల్లి వద్ద పెట్రోల్ బంకుకు ఎస్పీ గురువారం శంకుస్థాపన చేశారు. ఇప్పటికే శంకరంపేట్ (ఆర్)లో ఒక బంకు నిర్మాణం కొసాగుతుందని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.

February 26, 2026 / 04:17 PM IST

కారు ఢీ.. ముగ్గురు చిన్నారులకు గాయాలు

KRNL: దేవనకొండ(మం) కప్పట్రాళ్ల స్టేజి సమీపంలో ఇవాళ రెండు కార్లు ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు, ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సీఐ వేణుగోపాల్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహకారంతో క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 26, 2026 / 04:17 PM IST

‘అక్రమంగా మత్తు పదార్థాలు తరలిస్తే చర్యలు తప్పవు’

KMR: పిట్లం మండలంలో అక్రమంగా మత్తు పదార్థాలు తరలించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని బిచ్కుంద ఎక్సెజ్ సీఐ సత్యనారాయణ స్పష్టం చేశారు. నమ్మదగిన విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం బోల్లక్పల్లి సమీపంలో టీవీఎస్ మోటర్‌‌పై మూడు క్యాన్ల అక్రమ కల్లును తరలిస్తున్న వాజిద్ నగర్‌కు చెందిన సుంకరి సాయిగౌడ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

February 26, 2026 / 04:16 PM IST

విద్యార్థులకు ALERT

TG: రాష్ట్రంలో క్రీడా పాఠశాలలో 4వ తరగతి ప్రవేశాల కొరకు మండల స్థాయి ఎంపికలు మార్చి 13 నుంచి 17 వరకు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఇందుకు ఆసక్తి ఉన్నవారు tgss.telangana.gov.in వెబ్ సైట్‌లో ఇవాళ్టి నుంచి మార్చ్ 4 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించిన వారికి క్రీడా పాఠశాలలో సీట్లు కేటాయిస్తారు.

February 26, 2026 / 04:16 PM IST

వైసీపీ.. శవరాజకీయాలు మానుకోవాలి: రామ్మోహన్

AP: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా డయేరియా ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. వైసీపీ హయాంలో పారిశుద్ధ్యాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. కమీషన్ల కోసమే పనులు చేసుకున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు శవరాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.

February 26, 2026 / 04:14 PM IST

రీ సర్వే అవగాహన సమావేశం

ASR: రంపచోడవరం మండలం తామరపల్లి సచివాలయంలో రీ-సర్వే అవగాహన సమావేశం నిర్వహించారు. సర్పంచ్ మిర్తివాడ ఆనంద్ రెడ్డి, ముసురుమిల్లి ఎంపీటీసీ సభ్యులు వంశి కుంజం మాట్లాడుతూ.. గ్రామంలో త్వరలో రీ సర్వే ప్రారంభమవుతుందని తెలిపారు. రైతులు తమ భూముల సరిహద్దులు శుభ్రంగా ఉంచి, అవసరమైన పత్రాల జిరాక్స్ ప్రతులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

February 26, 2026 / 04:14 PM IST

మక్తల్ ఆంజనేయ ఆలయం పరిసరాలు

NRPT: మక్తల్ పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ పడమటి ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో భక్తులకు ఇబ్బంది కలిగించే కట్టడాలు నిర్మించవద్దని వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ నాయకులు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రామ్ లీలా మైదానంలో భక్తుల సౌకర్యార్థం టాయిలెట్లు నిర్మించి ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

February 26, 2026 / 04:13 PM IST

మక్తల్–పాతర్చెడ్ రోడ్డు ప్రమాదం

NRPT: మక్తల్ మండలం మంథనోడ్ నుంచి పాతర్చెడ్‌కు వెళ్లే రహదారి పూర్తిగా గుంతలతో నిండిపోయి ప్రమాదకరంగా మారింది. వర్షాలప్పుడు పరిస్థితి మరింత భయంకరంగా మారుతోందని, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు అధికారులు ప్రజల సమస్యను దృష్టిలో ఉంచి వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

February 26, 2026 / 04:10 PM IST

ఒకే చోట భార్య కలెక్టర్, భర్త ఎస్పీ

TG: రాష్ట్రంలో ఇవాళ జరిగిన IASల బదిలీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మహబూబాబాద్ కలెక్టర్‌గా స్నేహా శబరీష్ బదిలీ కాగా.. అదే జిల్లాకు ఆమె భర్త శబరీష్ ఎస్పీగా పనిచేస్తుండటం విశేషం. ఒకే జిల్లాకు భార్యాభర్తలు కలెక్టర్, ఎస్పీలుగా ఉండటం తెలంగాణలో ఇదే రికార్డ్. స్నేహ గతంలో హన్మకొండ కలెక్టర్‌గా పనిచేశారు.

February 26, 2026 / 04:10 PM IST