• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కాకినాడలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం

కాకినాడ నడిబొడ్డున పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆనందభారతి మైదానం వంటి బహిరంగ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోయి, వాకింగ్ ట్రాక్స్, వ్యాయామ పరికరాలు నిరుపయోగంగా మారాయి. మైదానాలను కేవలం ప్రదర్శనలు, సమావేశాల అద్దెకు మాత్రమే పరిమితం చేస్తున్నారని, కనీస నిర్వహణను విస్మరిస్తున్నారని నగరవాసులు వాపోతున్నారు.

February 28, 2026 / 02:05 PM IST

ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

KNR: సైదాపూర్ మండలం రాయికల్ తండా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలను సర్పంచ్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ.. బంజారా సమాజ ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ దొంత సుధాకర్, ఎంపీడీవో యాదగిరి, ఆస్ఐ వినోద్,మాజీ సర్పంచ్ అక్షయ శ్రీనివాస్ పాల్గొన్నారు.

February 28, 2026 / 02:05 PM IST

అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితి పెంపు

ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు DPRO సంపత్ కుమార్ తెలిపారు. పాత కార్డుల గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో, జర్నలిస్టుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. కొత్త కార్డుల జారీ అయ్యే వరకు పాత కార్డులే చెల్లుబాటులో ఉంటాయన్నారు.

February 28, 2026 / 02:05 PM IST

అర్హులకే ఇళ్లు కేటాయించాలని వినతి

BHPL: మహదేవపూర్ మండలంలో అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ఎంపీడీవో కార్యాలయంలో అధికారులకు CPM మండల నేతలు వినతి పత్రం అందజేశారు. మండల ఇంఛార్జ్ కుమ్మరి రాజు మాట్లాడుతూ.. పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందించాలని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

February 28, 2026 / 02:04 PM IST

ఆవుల మందపై పెద్దపులి దాడి

JGL: పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత వారం మోత్కరావుపేట గ్రామ శివారులోని చెరువు వద్ద పులి నీళ్లు తాగిన ఆనవాళ్లను గుర్తించిన అటవీ శాఖ అధికారులు, వారం రోజుల వ్యవధిలోనే అదే ప్రాంతంలో పులి మళ్లీ సంచరించడాన్ని ధృవీకరించారు. శనివారం తెల్లవారుజామున మోత్కరావుపేట సమీపంలో ఆవుల మందపై పెద్దపులి దాడికి తెగబడింది.ఈ ఘటనలో మూడు ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి.

February 28, 2026 / 02:02 PM IST

లడ్డూ కల్తీ అంశంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

AP: తిరుమల లడ్డూ కల్తీ అంశంపై సీఎం చంద్రబాబు మరోసారి వ్యాఖ్యలు చేశారు. కెమికల్స్ తో లడ్డూ తయారు చేసి నైవేద్యం పెట్టారని ఆరోపించారు. ప్రజలకే కాదు దేవుడికి కూడా ద్రోహం చేయాలనుకున్నారని మండిపడ్డారు. దేవుడిని తాను బజారులోకి లాగాలనుకోలేదని పేర్కొన్నారు. కానీ, జరిగిన తప్పులను ప్రజలకు వివరించానని వెల్లడించారు. 

February 28, 2026 / 02:02 PM IST

టైలర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NZB: జిల్లా మేరు సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘టైలర్స్ డే’ వేడుకల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. సాదాసీదా వస్త్రానికి చక్కని ఆకారాన్ని ఇచ్చి, సమాజంలో మన అందాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడే శిల్పులు టైలర్లు అని కొనియాడారు. వారి వృత్తి నైపుణ్యం అభినందనీయమన్నారు.

February 28, 2026 / 02:02 PM IST

‘పెన్షన్ల పంపిణీ 87 శాతం పూర్తి’

NLR: బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం పరిధిలో ఉదయం నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగింది. నాయకులతో కలిసి సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. నేడు నగదు అందని వారికి సోమవారం అందించనున్నారు. పట్టణ వ్యాప్తంగా నేడు 87 శాతం పింఛన్లు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

February 28, 2026 / 02:02 PM IST

‘ఇంటి వద్దకే భద్రాచలం తలంబ్రాలు’

NLG: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ముత్యాల తలంబ్రాలను ఇంటి వద్దకే అందించేందుకు ఆర్టీసీ ప్రత్యేక సేవలను తెచ్చినట్లు దేవరకొండ డిపో మేనేజర్ విజయకుమారి శనివారం తెలిపారు. ఈ మేరకు పోస్టర్ విడుదల చేశారు. భక్తులు రూ. 151 చెల్లిస్తే ఇంటి వద్దకు అందించడమే లక్ష్యమని తెలిపారు. బుకింగ్ కోసం ఆర్టీసీ కార్గోలో సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 28, 2026 / 02:02 PM IST

జన్నారంలో జాతీయ సైన్స్ దినోత్సవం

MNCL: జన్నారం మండలంలోని పలు గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ సివి.రామన్ ఆవిష్కరణ రామన్ ఎఫెక్ట్ ప్రపంచానికి పరిచయం చేసిన రోజు సందర్భంగా శనివారం జన్నారం మండలంలోని అక్కపెల్లిగూడా, తదితర గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు.

February 28, 2026 / 02:01 PM IST

‘పారిశ్రామికాభివృద్ధిపై దృష్టి సారించాలి’

విశాఖ జిల్లాలో పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేసేందుకు మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆటోనగర్, మధురవాడ ఐటీ పార్కులకు కార్మికుల రాకపోకల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని సూచించారు.

February 28, 2026 / 02:00 PM IST

విద్యార్థుల్లో పరిశోధనా జిజ్ఞాస పెంచాలి:జేసీ

SKLM: విద్యార్థుల్లో పరిశోధనా జిజ్ఞాసను పెంపొందించేలా పాఠశాల యాజమాన్యాలు కృషి చేయాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. శనివారం ఓ ప్రైవేట్ స్కూల్‌లో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 500 మంది విద్యార్థులు రూపొందించిన 175 వినూత్న ప్రాజెక్టులను ఆయన పరిశీలించి, విద్యార్థుల మేధోసంపత్తిని అభినందించారు.

February 28, 2026 / 02:00 PM IST

బెస్తవారిపేటలో మీడియా సమావేశం నిర్వహించిన కేపీ

ప్రకాశం: బేస్తవారిపేటలో శనివారం కుందూరు నాగార్జున రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేసినట్లు మాజీ సీఎం జగన్ ఎప్పుడు చెప్పలేదని రెండు టన్నెల్స్ పూర్తయితే వాటిని జాతికి అంకితం చేశామన్నారు. అలానే మార్కాపురం జిల్లాని ప్రకటించినప్పుడు దర్శి నియోజకవర్గాన్ని జిల్లాలో కలుపుకోకపోవడంపై ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశ్నించలేదని కేపీ విమర్శించారు.

February 28, 2026 / 02:00 PM IST

ఎమ్మెల్యే నివాసంలో 3వ తేదీ హోలీ సంబరాలు

ATP: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి నివాసంలో మార్చి 3న హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు నేతలు తెలిపారు. ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు జరిగే ఈ వేడుకల్లో పట్టణ ప్రజలు, యువతి, యువకులు పాల్గొనవచ్చు. రంగులు తెచ్చుకునే వారు ఎటువంటి రసాయనాలు లేని ప్రకృతి సిద్ధమైన రంగులనే వాడాలని సూచించారు. హానికరమైన గంధం, శుద్ధ పొడి వాడొద్దని ఆయన కోరినట్లు సమాచారం.

February 28, 2026 / 01:59 PM IST

గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా?

గ్యాస్ స్ట్రబుల్ ఎక్కువగా వచ్చే వాళ్లు వేగంగా తినడం మానేయాలి. ఆహారాన్ని బాగా నమిలి మెల్లగా తినాలి. భారీగా ఒకేసారి తినడం కంటే రోజులో చిన్న చిన్న మోతాదులో తీసుకోవడం మంచిది. రాత్రి భోజనం తిన్న వెంటనే పడుకోకుండా కనీసం కొద్దిసేపు నడవాలి. టీ, కాఫీ ఎక్కువగా తాగడం తగ్గించాలి. బంగాళాదుంప, క్యాబేజీ, బీన్స్ లాంటి గ్యాస్ పెంచే పదార్థాలు పరిమితిలోనే తీసుకుంటే కడుపు ప్రశాంతంగా ఉంటుంది.

February 28, 2026 / 01:55 PM IST