SRD: ఖేడ్ పట్టణంలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ ప్రీమియర్ లీగ్ సీజన్ క్రికెట్ టోర్నీలో రేగొడ్ జట్టు విజయం సాధించింది. AIBESS నేతృత్వంలో నిర్వహించిన ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్లో రేగోడ్ ఆధ్యా, ఖేడ్ ర్యామ్ స్పోర్ట్స్ తలపడ్డాయి. రేగోడ్ జట్టు టోర్నీ కప్ సాధించింది. ఈ మేరకు పటాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
KNR: తెలంగాణ జర్నలిస్టు ఫెడరేషన్ డైరీని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టుల పాత్ర గొప్పదని అన్నారు. జర్నలిస్టుల డైరీ తన చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు.
ATP: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పీఎంశ్రీ పథకం ఎంతో దోహదపడుతుందని కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ సచ్చిదానంద ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లో జేసీ విష్ణుచరణ్తో కలిసి పీఎంశ్రీ పాఠశాలల పనితీరుపై ఆయన సమీక్షించారు. అనంతరం ఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు.
WNP: ప్రజల నుంచి వచ్చే అర్జీలు, ఫిర్యాదులకు అధికారులు సరైన సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. వనపర్తి కలెక్టరేట్ నుంచి మంత్రి మాట్లాడుతూ.. ఫిర్యాదులకు అధికారులు సరైన సమాధానం ఇవ్వడంతో పాటు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను సహనంతో విని పరిష్కరించాలన్నారు.
GNTR: పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి నివాసంలో జరిగిన చోరీ కేసును పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. ఐదుగురు నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి, రూ.69.25 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు రాకేష్పై ఇప్పటికే 35 కేసులు ఉన్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సీసీ ఫుటేజ్, వేలిముద్రల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు.
NZB: భీమ్గల్లో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి తెలిపారు. మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఉదయం 8:30 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 9:05 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
NLG: బాలికల రక్షణ, అభివృద్ధి, విద్య ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని MPDO జయరాం పేర్కొన్నారు. నేరేడుగొమ్ము ఎంపీడీవో కార్యాలయంలో ‘బేటీ బచావో బేటీ పడావో’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాల నియంత్రణలో రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రులు హైదరాబాద్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి మొత్తం నాలుగు దశల్లో పూర్తవుతుందన్నారు.
E.G: గత రెండురోజులుగా రాజమండ్రి లాలాచెరువులో పాల కల్తీ వ్యవహారం అందరినీ ఒక్కసారిగా కుదిపేసింది. పాల వ్యాపారి గణేష్ ఫోటోని స్థానికులు సోషల్ మీడియాలో విడుదల చేయడంతో మంగళవారం ఈ ఫోటో చక్కర్లు కొట్టింది. సదరు వ్యక్తి వద్ద ఎవరైనా పాలు కొంటే వెళ్లి టెస్ట్లు చేయించుకోవాలని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మరి మీరు ఈ వ్యక్తి వద్ద పాలు కొన్నారా? కామెంట్ చేయండి.
సత్యసాయి: తాడిమర్రి పీఏసీఎస్ ప్రెసిడెంట్గా శ్రీనివాస్ రెడ్డి, బత్తలపల్లి పీఏసీఎస్ డైరెక్టర్లుగా రవీంద్ర, నాగార్జున రెడ్డి నియమితులైన సందర్భంగా పరిటాల శ్రీరామ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ రైతులకు జవాబుదారీగా పనిచేయాలని శ్రీరామ్ సూచించారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణాలు మంజూరు చేయాలని సూచించారు.
KMR: జుక్కల్ మండల కేంద్రంలోని ఆలయానికి సంబంధించిన 3 పెద్ద ఆవులను, 9 ఆవు దూడలు ఎవరో గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారని జుక్కల్ గ్రామస్తులు ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. జుక్కల్ మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయ ఆవులు అపహరణకు గురయ్యాయని అన్నారు. 9 ఆవుల విలువ దాదాపుగా రూ. 90 వేలు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
PLD: రొంపిచర్ల మండలం వి.రెడ్డిపాలెం ఏపీ మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రిన్సిపాల్ డా.రవినాయక్ ప్రకటన చేశారు. 5వ తరగతి చదువుతున్న వారు దీనికి అర్హులు. ఫీజు ఓసీ, బీసీలకు రూ.200, ఎస్సీ, ఎస్టీలకు రూ.125. దరఖాస్తుకు ఈ నెల 31 ఆఖరు తేదీ. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష ఉంటుంది.
AKP: వీ.మాడుగుల(మం) జాలంపల్లి పంచాయతీలో మంగళవారం గిరిజనులు ఆందోళన చేపట్టారు. జీడి పిక్కలకు కేజీ రూ.200 మద్దతు ధర ప్రకటించి, రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 80 కేజీల బస్తాకు రూ.18,000 ఇవ్వాలని కోరారు. జీడి కార్పొరేషన్ ఏర్పాటు, పంట రుణాలు, భీమా, ప్రాసెసింగ్ యూనిట్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
కోనసీమ: మండపేట మండలం ఇప్పలపాడు గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీ లోకి చేరికలు హాస్యాస్పదంగా ఉన్నాయని జిల్లా వైసీపీ పార్టీ ఉపాధ్యక్షులు పిల్లా వీరబాబు పేర్కొన్నారు. గోరంత దానిని కొండంతగా తెలుగుదేశం పార్టీ నాయకులు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పనపాడు గ్రామంలో వంద మందికి పైగా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు చేస్తున్న ప్రచారం బూటకమన్నారు.
ప్రకాశం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను సచివాలయంలో మంగళవారం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల చర్ల జనార్ధన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఒంగోలు నియోజకవర్గం మరియు ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఆయన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం స్పందిస్తూ, ప్రకాశం జిల్లా అభివృద్ధికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.