WNP: ప్రజల నుంచి వచ్చే అర్జీలు, ఫిర్యాదులకు అధికారులు సరైన సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. వనపర్తి కలెక్టరేట్ నుంచి మంత్రి మాట్లాడుతూ.. ఫిర్యాదులకు అధికారులు సరైన సమాధానం ఇవ్వడంతో పాటు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను సహనంతో విని పరిష్కరించాలన్నారు.