BHPL: మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, తరగతి గదుల సౌకర్యాలు, భోజన వసతులు, ఆరోగ్యం, శుభ్రత వంటి అంశాలను సమీక్షించారు. తనిఖీ అనంతరం కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారితో సంభాషించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు.
TG: ఖమ్మం భూదాన్ భూముల్లో కూల్చివేతలు అన్యాయం అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చడమే తప్ప పేదలకు గజం భూమి ఇవ్వలేదన్నారు. మూసీ సుందరీకరణ పేరిట అపార్ట్ మెంట్లు కూల్చొద్దని డిమాండ్ చేశారు.
W.G: తణుకులోని పాల కేంద్రాలతోపాటు డైరీ ఫార్మ్స్పై గురువారం అధికారులు దాడులు నిర్వహించారు. ఇటీవల రాజమహేంద్రవరంలో కల్తీ పాలు కారణంగా ఆరుగురు మృతి చెందటంతో జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీధర్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి శంకర్, తణుకు మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ తనిఖీలు చేసి నమూనాలు సేకరించారు.
JN: పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో సీఎస్ఆర్ నిధులతో కంప్యూటర్లను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఎంపీ కడియం కావ్య పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. విద్యారంగ బలోపేతానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తుందని, విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
AP: ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షం క్రెడిట్ చోరీ చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘గతంలో నీళ్లు రాకుండా రిబ్బన్ కట్ చేశారు. మా కుప్పంకు కూడా నీళ్లు ఇస్తామన్నారు. పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టు దేశంలో మరెక్కడా ఉండదు. పుష్కరాల ముందే పోలవరాన్ని పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్రలో అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. త్వరలో చింతలపూడి ప్రాజెక్టును పూర్తి చేస్తాం’ అని తెలిపారు.
AKP: వరదలు వస్తే పంట పొలాలకు నష్టం కలగకుండా రాంబిల్లి మండలంలో శారదా నది గుట్లును పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ విజ్ఞప్తి చేశారు. గురువారం శాసనసభలో మాట్లాడుతూ.. అల్లూరి జిల్లా, ఒడిస్సాలో ఎక్కడ వర్షం పడినా శారదా నది ఉధృతంగా ప్రవహిస్తూ రాంబిల్లి సముద్రంలో కలుసుకుందన్నారు. దీనివల్ల వరద ముప్పు ఏర్పడుతుందన్నారు.
RR: చంపాపేట్ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న మీటర్ రీడర్లు 30 రోజుల పూర్తి పని కల్పించాలని డిమాండ్ చేశారు. రీడింగ్ అనంతరం పని దినాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు తక్షణం స్పందించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. సమస్యలపై స్పందన రాకపోతే ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
నెల్లూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. వైసీపీని వీడి బీజేపీలో చేరుతారని గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇవాళ నెల్లూరుకు వచ్చిన జగన్ను ఆదాల కలిశారు.
JGL:పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం మాల్యాల ఏసీడీపీవో అరవింద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని స్టాక్ రిజిస్టర్, విద్యార్థుల హాజరును పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లోకి చిన్నారులు ఎక్కువ సంఖ్యలో వచ్చేలా చూడాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సూపర్వైజర్ మహేశ్వరి, టీచర్ శ్రీదేవి ఉన్నారు.
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ఈడీ ఎదుట హాజరయ్యారు. అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ నకు ప్రమేయం ఉన్న రూ.40 వేల కోట్ల బ్యాంకింగ్, కార్పొరేట్ మోసం కేసులో ఈడీ ఆయనను విచారిస్తోంది. కాగా, ఇటీవల ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
MBNR: జిల్లా కలెక్టర్గా ఖుష్బూ గుప్తా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ విజయేంద్ర బోయి రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ కార్యదర్శిగా బదిలీ చేశారు. అలాగే నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పాట్నాయక్ను ఆర్థిక శాఖకు ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేశారు. ప్రదీప్ జైన్ను నారాయణపేట్ కలెక్టర్గా నియమించారు.
నల్గొండ మెడికల్ కళాశాల వార్షికోత్సవంలో మంత్రి కోమటిరెడ్ వెంకటరెడ్డి పాల్గొని, కళాశాలను రాష్ట్రంలోనే ఉత్తమంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. నిర్మాణం ఆగిపోయిన సమయంలో రూ.85 కోట్లు కేటాయించి పూర్తి చేశామని చెప్పారు. విద్యార్థుల రాకపోకల కోసం నెలలోనే రెండు ప్రత్యేక బస్సులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, మున్సిపల్ కార్పొరేషన్ను మోడల్ సిటీగా మారుస్తానని పేర్కొన్నారు.
HYD: మెట్రో ఫేజ్-2 అలైన్మెంట్ అకస్మాత్తుగా మారడం వెనుక సాంకేతిక కారణాల కంటే ఆర్థిక కారణాలే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ప్రతిపాదించిన నాగోల్-చాంద్రాయణగుట్ట-మైలార్ దేవ్ పల్లి రూట్, భవిష్యత్తులో అభివృద్ధి చేయాలనుకుంటున్న ‘ఫార్మా విలేజ్’ కనెక్టివిటీకి అనుసంధానంగా ఉండబోతోంది.
E.G: తాళ్ళపూడి మండలం మలకపల్లిలో నిర్వహించిన ప్రజావేదికలో గ్రామానికి చెందిన సనమండ్ర పోసియ్యకు చెందిన గృహాన్ని నిర్మిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు లబ్ధిదారుడి గృహాన్ని హౌసింగ్ డిపార్ట్మెంట్, MRO గురువారం పరిశీలించారు. లబ్దిదారుడికి హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
KNR: జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్లో భాగంగా కనగర్తి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. బీఆర్సీ ఇంఛార్జ్ మురళీధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మోగి, పచ్చ పురుగులు, తాటి ఆకు తెగుళ్లు తదితర సమస్యల నివారణపై వివరించారు. నీమాస్త్రం, జీవామృతం, పుల్లటి మజ్జిగ ప్రయోజనాలను తెలియజేసి అగ్ని అస్త్రం తయారీని ప్రదర్శించారు.