• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ తరగతులు

VKB: వార్డు సభ్యుల శిక్షణ తరగతులు ముగిశాయని కుల్కచర్ల ఎంపీడీవో రామకృష్ణ నాయక్ తెలిపారు. గత ఐదు రోజులుగా మండల పరిషత్ కార్యాలయంలో 11 గ్రామాలకు చెందిన వార్డు సభ్యులకు గ్రామ పరిపాలనపై అధికారులు వార్డు సభ్యులకు అవగాహన కల్పించారు. 33 గ్రామ పంచాయతీల గాను మొదటి విడత శిక్షణ తరగతులు ముగిశాయని, మిగతా గ్రామ వార్డు సభ్యులకు త్వరలోనే శిక్షణ ఇస్తామన్నారు.

February 21, 2026 / 07:57 PM IST

అనంతబాబు ఎమ్మెల్సీ పదవికి అనర్హుడు: MLA

GNTR: ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు శనివారం మంగళగిరిలో TDP మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దళిత యువకుడి హత్యకేసులో పాల్పడ్డ అనంతబాబు ఎమ్మెల్సీ పదవికి అనర్హుడు అని, జగన్ పార్టీని వెంటనే సస్పెండ్ చేయాలి అని, దళితుల భద్రత, హక్కుల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా స్పందించాలని డిమాండ్ చేశారు.

February 21, 2026 / 07:56 PM IST

ధన్వాడ వాసికి అవార్డు

NRPT: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పురస్కరించుకొని విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ తెలుగు కవుల మహాసభలో ధన్వాడ యువ రచయిత, రంగస్థలం నటుడు మల్కమల్ల బాలకృష్ణ గౌడ్ పొట్లూరి హరికృష్ణ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆయన తెలుగు భాషకు చేస్తున్న సేవలను గుర్తించి అవార్డు అందజేశారు.

February 21, 2026 / 07:54 PM IST

శిఖర్ ధావన్ పెళ్లి.. ఫొటోలు వైరల్

టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. తన ప్రేయసి సోఫీ షైన్‌తో ఇవాళ ఏడడుగులు వేశాడు. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకకు సహచర క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ధావన్‌కు తన మొదటి భార్యతో ఒక కుమారుడు ఉన్నాడు. ఈ జంట 2021లో విడాకులు తీసుకుంది.

February 21, 2026 / 07:53 PM IST

గద్వాలలో దివ్యాంగుల గ్రీవెన్స్ డే

GDWL: గద్వాల కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన దివ్యాంగుల గ్రీవెన్స్‌లో 37 దరఖాస్తులు అందినట్లు అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని, సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రతి నెల మూడో శనివారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తారని తెలిపారు.

February 21, 2026 / 07:52 PM IST

CMRF చెక్కులను అందజేసిన మంత్రి

GNTR: ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా తెనాలి నియోజకవర్గానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న 61 మందికి రూ. 46,59,619ల విలువైన చెక్కులను శనివారం తెనాలి క్యాంపు కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. వైద్య చికిత్సల ఖర్చులు భారంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ సహాయం అనేక కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తోందని తెలిపారు.

February 21, 2026 / 07:52 PM IST

న్యాయమూర్తులపై మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్

అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. ‘అత్యంత ఆమోదయోగ్యమైన పద్ధతిలో మేం విధించిన టారిఫ్‌లను సుప్రీంకోర్టులో కొందరు వ్యతిరేకించారు. దీనికి వారు సిగ్గుపడాలి. ఇది చాలా హాస్యాస్పదమైన తీర్పు. మేం గతంలో తీసుకున్న దానికంటే మరింత ఎక్కువ వసూలు చేసేందుకు సాధ్యమైన చర్యలన్నీ తీసుకుంటాం’ అని వెల్లడించారు.

February 21, 2026 / 07:50 PM IST

రేపల్లెలో స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

BPT: రేపల్లె పట్టణంలో శనివారం ఆర్డీవో ఎన్ రామలక్ష్మి ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జీరో వెస్ట్–లిట్టర్ ఫ్రీ గవర్నెన్స్ లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ అనగాని శివ ప్రసాద్, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు.

February 21, 2026 / 07:50 PM IST

ఎమ్మెల్యే ఇంటిపై దాడి ఖండన

MBNR: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నివాసంపై జరిగిన దాడిని జిల్లా ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ప్రజా ప్రతినిధి ఇంటిపై దాడి యత్నం అధికార కాంగ్రెస్ అహంకారానికి నిదర్శనమని అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలని మండిపడ్డారు. ఎమ్మెల్యే సవాలును ఎదుర్కోలేక రౌడీలను పురమాయించడం ప్రతీకార రాజకీయమని విమర్శించారు.

February 21, 2026 / 07:50 PM IST

కబడ్డీ సీనియర్ నేషనల్స్‌కు తేజ ఎంపిక

VSP: 72వ సీనియర్ నేషనల్ కబడ్డీ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ గంగవరం ప్రాంతానికి చెందిన నోళ్లు తేజ ఎంపికయ్యాడు. ఈ పోటీలు ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు గుజరాత్‌లోని వడోదరలో జరగనున్నాయి. గంగవరం గ్రామానికి చెందిన కనకరావు కుమారుడు తేజ ప్రస్తుతం అదానీ ఫౌండేషన్‌లో స్పోర్ట్స్ కోచ్‌గా పనిచేస్తున్నాడు.

February 21, 2026 / 07:49 PM IST

రంజాన్ ఏర్పాట్లపై మున్సిపల్ ఛైర్మన్ కు వినతి

RR: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా షాద్ నగర్ పట్టణంలో తగిన ఏర్పాట్లు చేయాలని మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బాబర్ అలీ ఖాన్ మున్సిపల్ ఛైర్మన్ బస్వంను కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో వారిని కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. మసీదుల వద్ద వీధి దీపాల ఏర్పాటు, మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు.

February 21, 2026 / 07:48 PM IST

HYD గచ్చిబౌలి స్టేడియంలో హాకీ వరల్డ్ కప్

HYD: హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో మార్చి 8 నుంచి 14 వరకు జరిగే FIH హాకీ వరల్డ్ కప్ 2026 క్వాలిఫైయర్స్ కోసం భారత మహిళల సీనియర్ హాకీ జట్టు కీలక పోరాటానికి సిద్ధమైంది. ఈ టోర్నీలో విజయం సాధిస్తేనే వరల్డ్ కప్‌కు అర్హత లభిస్తుంది. వేగవంతమైన దాడులు, కట్టుదిట్టమైన రక్షణ, పెనాల్టీ కార్నర్ మార్పిడి జట్టు విజయానికి ప్రధానంగా మారనున్నాయి.

February 21, 2026 / 07:48 PM IST

‘దోపిడీకి వ్యతిరేకంగా శ్రామికులంతా ఐక్యంగా పోరాడాలి’

ప్రకాశం: కార్మికుల, కష్టజీవుల దోపిడీకి వ్యతిరేకంగా శ్రామికులంతా ఐకమత్యంతో పోరాడాలని సీపీఎం నాయకులు ఊసా వెంకటేశ్వర్లు అన్నారు. చంద్రశేఖరపురం సీపీఎం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన రెడ్ బుక్స్ డే కారుక్రమంలో భాగంగా చదువుదాం సమాజాన్ని మార్చుదాం అనే అంశం గురించి చర్చించారు. ఆయన మాట్లాడుతూ.. కార్మికులు, కష్ట జీవులను దోచుకోవడం నేటికీ కొనసాగుతుందన్నారు.

February 21, 2026 / 07:48 PM IST

‘దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి’

BDK: కొత్తగూడెం కార్పొరేషన్ రామవరంలోని షాపుల యజమానులు తమ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని 2 టౌన్ సీఐ డి. ప్రతాప్ ఇవాళ సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాల నియంత్రణకు తోడ్పాటు అందుతుందని, ఏదైనా ఘటన జరిగినప్పుడు నిందితులను త్వరగా గుర్తించేందుకు ఆధారాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.

February 21, 2026 / 07:47 PM IST

ఆర్బీఎస్‌కే సిబ్బందికి సీపీఆర్‌పై శిక్షణ

SRPT: అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారి ప్రాణాలను కాపాడడంలో సీపీఆర్ (CPR) కీలకమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. శనివారం ఐడీఓసీలో తొమ్మిది ఆర్బీఎస్‌కే బృందాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిమిషానికి 100-120 సార్లు ఛాతీపై ఒత్తిడి కలిగించడం ద్వారా రక్త ప్రసరణను పునరుద్ధరించవచ్చని ఆయన వివరించారు.

February 21, 2026 / 07:47 PM IST