ఐటీ శాఖ ‘ఆదాయ పన్ను ముసాయిదా నిబంధనలు 2026’ను ప్రతిపాదించింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనల ప్రకారం, ఏడాదిలో రూ.10L దాటిన క్రెడిట్ కార్డ్ లావాదేవీల వివరాలు నేరుగా ఐటీ శాఖకు వెళ్తాయి. ఆఫీస్ కార్డులను వ్యక్తిగత అవసరాలకు వాడితే పన్ను పడుతుంది. అయితే, సిసి స్టేట్మెంట్ను అడ్రస్ ప్రూఫ్గా వాడొచ్చు. ఇకపై క్రెడిట్ కార్డు దరఖాస్తుకు పాన్ తప్పనిసరి.
SRPT: కోదాడ పట్టణంలో వ్యాధుల నివారణకు మున్సిపల్ యంత్రాంగం నడుము బిగించింది. పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఆదివారం దోమల మందు పిచికారీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ ప్రారంభించారు. డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా అన్ని వార్డుల్లో ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. పట్టణంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
KMM: సింగరేణిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రముఖ వైద్యుడు, న్యూరో రిహాబ్ ఎడ్యుకేటర్ ఫౌండర్ డాక్టర్ బాదావత్ రవి ఆధ్వర్యంలో ‘మిషన్ వాక్’ స్వచ్ఛంద సంస్థ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని కారేపల్లి, భాగ్యనగర్ తండా సర్పంచ్లు మేదరి వీర ప్రతాప్, బానోత్ హీరాలాల్ కలిసి ప్రారంభించారు.
BDK: మణుగూరు ప్రాంతానికి చెందిన సంతోష్ – రమాదేవి దంపతుల కుమార్తెలు లావణ్య మరియు వెంకట శ్రీల ఓణీల అలంకరణ వేడుకలో నేడు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. బాలికలకు ఆశీస్సులు అందించి, వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. సాంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబించే ఇలాంటి కుటుంబ వేడుకలు సమాజంలో ఆనందాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
ADB: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 24 మంగళవారం జిల్లాకు రానున్నట్లు బోథ్ ఎమ్మెల్యే కార్యవర్గాలు తెలిపాయి. ఇటీవల అరెస్ట్ అయిన ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ను ఆయన పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
GNTR: మంగళగిరి మెయిన్ బజార్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. రద్దీ వేళల్లో భారీ సరుకు రవాణా వాహనాలు తిరగడమే ప్రధాన కారణం. గాలిగోపురం నుంచి మిద్దె సెంటర్ వరకు రోడ్లపై వాహనాలు అడ్డదిడ్డంగా నిలుపుతున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దీ లేని సమయాల్లోనే సరుకు రవాణాకు అనుమతించాలని కోరుతున్నారు.
GNTR: ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు GMC కమిషనర్ కె. మయూర్ అశోక్ వెల్లడించారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. ప్రజలు హాజరై తమ సమస్యలను తెలియజేసి పరిష్కారం పొందాలని సూచించారు.
KNR: కొత్తపల్లి 17వ డివిజన్ కార్పొరేటర్ వేముల కవిత చంద్రశేఖర్ తన ఎన్నికల హామీని నెరవేర్చి నిబద్ధతను చాటుకున్నారు. 17వ డివిజన్కు చెందిన సిరిపురం స్వప్న మురళి కుమార్తె వివాహానికి హాజరైన ఆమె ప్రచార సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రూ. 10,016 నగదును ఆడబిడ్డ కట్నంగా అందజేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన ధ్యేయమని ఈ సందర్భంగా కవిత పేర్కొన్నారు.
WG: మొగల్తూరు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పేరుపాలెం బీచ్కు ఆదివారం పర్యాటకులు భారీగా తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సందర్శకులు కుటుంబ సభ్యులతో కలిసి సముద్ర స్నానాలు చేస్తూ ఇసుక తిన్నెలపై సరదాగా గడిపారు. తీరంలోని ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
HNK: వేలేరు గ్రామంలో “శ్రీవల్లీ జీరాక్స్ & ఆన్లైన్ సర్వీసెస్” నూతన షాప్ను ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గ్రామ ప్రజలకు జీరాక్స్, ప్రింటింగ్, ఆన్లైన్ సేవలు, లామినేషన్, స్పైరల్ బైండింగ్ వంటి సౌకర్యాలు ఒకే చోట అందుబాటులోకి రావడం ఆనందకరమని ఛైర్మన్ రాఘవరెడ్డి తెలిపారు
JGL: సీఎం కప్ సెకండ్ ఎడిషన్లో భాగంగా హన్మకొండలో జరుగుతున్న పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి హ్యాండ్బాల్ స్పోర్ట్స్కు ఎంపికైన క్రీడాకారులు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సెలెక్ట్ అయిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. మొత్తం 62 ఈ వెంట్లలో 1,648 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.
E.G: నల్లజర్ల మండలం పోతవరంలో ఏర్పాటు చేయనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ & వాటర్ ట్యాంకులను గోపాలపురం MLA మద్దిపాటి వెంకటరాజు ఆదివారం శంకుస్థాపన చేశారు. విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా గ్రామ ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలు అందేలా కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. జల జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రజలకు శాశ్వతంగా మంచినీరు అందించనున్నట్లు చెప్పారు.
ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ వాలెంటిన్ హెనాల్ట్ తన పుస్తకం ‘J’avais un rêve indien’ ద్వారా గోరఖ్పూర్ జైలులోని దారుణాలను బయటపెట్టారు. 2023లో అక్కడ జైలు జీవితం గడిపిన ఆయన, ఖైదీలను గాలి కూడా ఆడనంతగా కుక్కేవారని పేర్కొన్నారు. ముస్లింలు, దళితులపై వివక్ష చూపుతూ, అగ్రవర్ణాలకే మెరుగైన సౌకర్యాలు ఇస్తున్నారని, సరైన వైద్యం అందక ఖైదీలు మరణిస్తున్నారని సంచలన విషయాలు వెల్లడించారు.
అన్నమయ్య: మదనపల్లి కలెక్టరేట్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన రావు, నరసింహారెడ్డి జీవితం యువతకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తొలి సాయుధ పోరాట యోధుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు.అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
KRNL: ప్రజల్లో ఆరోగ్యం,ఆనందాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం హ్యాపీ సండే కార్యక్రమాన్ని పునఃప్రారంభించినట్లు కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. ఆదివారం కొండారెడ్డి బురుజు వద్దనున్న పార్కులో తొలి హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా, చెస్, కబడ్డీ, సంగీత, నృత్య ప్రదర్శనలు నిర్వహించి ఉద్యవన సందర్శకుల్లో ఉత్సాహాన్ని నింపారు.