• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ఛలో సెక్రటేరియట్‌’కు తరలిన ఆర్టీసీ ఉద్యోగులు

NRML: ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తలపెట్టిన ఛలో సెక్రటేరియట్‌కు భైంసా ఆర్టీసీ ఉద్యోగులు తరలివెళ్లారు. రెండు ప్రత్యేక వాహనాల్లో ఉద్యోగులు HYDకి పయనమయ్యారు. 2021సంవత్సరం ఉద్యోగుల పే స్కేల్‌ను శాశ్వతంగా 30 శాతం అమలుపరచి, మా లక్ష్మి పథకం కింద ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించి సమస్యలు పరిష్కరించాలన్నారు.

February 24, 2026 / 10:37 AM IST

జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ

SKLM: ఉండవల్లిలో రాష్ట్ర మంత్రి లోకేష్ ఏర్పాటు చేసిన ఆత్మీయ విందుకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రాత్రి హాజరయ్యారు. ఈ మేరకు మంత్రి ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి,యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు రవికుమార్, శిరీష, రమణ మూర్తి పాల్గొన్నారు.

February 24, 2026 / 10:36 AM IST

తాడూరులో 18.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

NGKL: జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలోనే తాడూరు మండలంలో 18.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు మంగళవారం ప్రకటించారు. కల్వకుర్తి మండలంలో 11.3, అమ్రాబాద్ లో 7.0, పదరలో 4.3, అయినోల్ లో 3.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.

February 24, 2026 / 10:35 AM IST

సీఎం రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో విద్యార్థిని ప్రతిభ

NZB: వేల్పూర్ మండలం మోతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని కుమారి రూప ఇటీవల జరిగిన సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా తరఫున ఆడి మంచి ప్రతిభ కనపరిచినందుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోతే ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైద్య గణేశ్, ఉపాధ్యాయులు మంచే గణేశ్, మహేందర్ ఉన్నారు.

February 24, 2026 / 10:35 AM IST

బహిరంగ సభను విజయవంతం చేయండి: ఉషశ్రీ చరణ్

SS: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మార్చి 1న కడపలో నిర్వహించే భారీ బహిరంగ సభకు తరలిరావాలని జిల్లా YCP అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పిలుపునిచ్చారు. హిందూపురంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టును ఆపేశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నా చంద్రబాబు స్పందించకపోవడం దారుణమన్నారు.

February 24, 2026 / 10:33 AM IST

రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా అధికారుల నిఘా

NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాలు, గోధుమల్లో అక్రమాలను అరికట్టేందుకు అధికారులు పక్క వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. నిరుపేదల రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా పౌరసరఫరాల శాఖ అధికారులు నిఘాను ముమ్మరం చేసింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 2,081 రేషన్ దుకాణాలపై నిరంతరం పరిరక్షణ ఉంచాలని ఆ శాఖ నిర్ణయించుకుంది.

February 24, 2026 / 10:33 AM IST

డయేరియా కేసులపై సీఎం చంద్రబాబు సమీక్ష

AP: శ్రీకాకుళంలో డయేరియా కేసుల నమోదుపై సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. 32 మంది డయేరియా బారిన పడ్డారని, 10 మంది డిశ్చార్జి అయ్యారని అధికారులు తెలిపారు. 22 మంది పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. శ్రీకాకుళంలో రహదారి మరమ్మతు పనుల వల్ల నీరు కలుషితమైందని ప్రాథమికంగా గుర్తించామని, డయేరియా బాధితుల కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని సీఎంకు అధికారులు వివరించారు.

February 24, 2026 / 10:33 AM IST

‘పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’

KMR: బిచ్కుంద మున్సిపాలిటీ కేంద్రంలో జనసేన పార్టీ నాయకుల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి జనసేన పార్టీ వీర మహిళ నాయకురాలు సరిత మానేకర్ హాజరై మాట్లాడుతూ.. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు ప్రారంభం కాబోతున్నాయని, బిచ్కుంద మండలంలోని ప్రతి గ్రామం నుంచి భారీ సంఖ్యలో క్రియాశీలక సభ్యత్వాలను తీసుకోవాలని పేర్కొన్నారు.

February 24, 2026 / 10:33 AM IST

కాకతీయ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది..?

WGL: ప్రతిష్ఠాత్మక కాకతీయ యూనివర్సిటీలో ఇటీవల కాలంలో విద్యార్థుల మధ్య గొడవలు, ఘర్షణలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు ప్రశాంత వాతావరణం ఉండే క్యాంపస్‌లో ఇప్పుడు అస్థిరత నెలకొంది. నిన్న యూనివర్సిటీలోనే చికెన్ కోసం విద్యార్థులు కర్రలతో కొట్టుకున్న ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పర్యవేక్షణ లేక గొడవలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

February 24, 2026 / 10:30 AM IST

17వ వార్డ్‌లో పారిశుద్ధ్య పనులు పరిశీలించిన కమిషనర్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ 17వ వార్డ్‌లో మంగళవారం ఉదయం పారిశుద్ధ్య పనులను కమిషనర్ సంపత్ రెడ్డి, కౌన్సిలర్ రాగంశెట్టి సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. మురుగు కాలువలలో పేరుకుపోయిన చెత్తను సిబ్బందిచే తీయించారు. వార్డ్‌లలో పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు.

February 24, 2026 / 10:30 AM IST

రామయిపల్లిలో విద్యుత్ శాఖ ప్రజాబాట

MDK: విద్యుత్ సమస్యలు పరిష్కారంలో భాగంగా మనోహరాబాద్ మండలం రామయిపల్లిలో ప్రజాబాట నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ప్రజలు విద్యుత్ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని కాళ్లకల్ ఏఈ రాజ్ కుమార్ తెలిపారు. ఈ ప్రజాబాటలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 10:29 AM IST

కార్వేటినగరం పోలీసులు గ్రేట్..!

చిత్తూరు: కార్వేటినగరం మండలంలో మందుబాబుల అడ్డాలుగా ఉన్న ప్రాంతాలను పోలీసులు రూపు మార్చుతున్నారు. ఎస్పీ తుషార్ డూడీ ధైర్య స్పర్శ అనే ఓ బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎస్ఐ తేజస్విని సిబ్బందితో కలిసి మందుబాబులకు అడ్డాగా ఉన్న అమ్మపల్లి డ్యాం వద్దకు వెళ్లారు. అక్కడి చెత్త తొలగించారు. మందుబాబులు కూర్చోకుండా ప్రదేశాలను నీటిగా రెడీ చేస్తున్నారు.

February 24, 2026 / 10:29 AM IST

టెన్త్ విద్యార్థుల అంతర్గత పరీక్షల మార్కులు పరిశీలన

SRD: సిర్గాపూర్ ఉన్నత పాఠశాలలో టెన్త్ విద్యార్థుల అంతర్గత పరీక్షల మార్కులను GHM వెంకటేశం బృందం నేడు పరిశీలించారు. నిర్మాణాత్మక మూల్యాంకన 4 పరీక్షలకు సంబంధించి మార్కులు, ప్రాజెక్ట్, ప్రయోగ పని, చేతిరాత ఒక్కొక్క అంశానికి 5 చొప్పున 20 మార్కులకు ఆధారాలను చూస్తూ, పరిశీలకులు చెక్ చేసి అప్రూవల్ ఇస్తారు. మొత్తం 103 మంది విద్యార్థుల వివరాలు పరిశీలించారు.

February 24, 2026 / 10:29 AM IST

‘హెల్మెట్లను ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి’

MHBD: వాహనదారులు ప్రమాద సమయంలో తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవడానికి హెల్మెట్లను తప్పకుండా ధరించాలని తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్ అన్నారు. దాతల సహాయంతో పలువురు వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను అందజేశారు. వాహనదారుల ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘అరైవ్-అలైన్’ అమలు చేస్తుందన్నారు.

February 24, 2026 / 10:28 AM IST

జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆకస్మిక వాహన తనిఖీలు

ATP: నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత లక్ష్యంగా జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి జాతీయ రహదారులు, ముఖ్య కూడళ్లలో వాహనాలను ఆపి పత్రాలను పరిశీలించారు. అక్రమ రవాణా, అనుమానాస్పద కదలికలను అరికట్టడమే ఈ ప్రత్యేక డ్రైవ్ ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.

February 24, 2026 / 10:27 AM IST