• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మార్చి 3న వైకుంటపురం ఆలయం మూసివేత..!

GNTR: చంద్రగ్రహణం కారణంగా తెనాలిలోని వైకుంటపురం ఆలయాన్ని మార్చి 3వ తేదీన మూసివేస్తున్నట్లు శనివారం ఆలయ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు, మహా నివేదన నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలను మూసివేస్తారు. తిరిగి మార్చి 4వ తేదీ బుధవారం ఉదయం 6 గంటలకు ఆలయ శుద్ధి కార్యక్రమాలు చేపట్టి, ఉదయం 8 గంటల నుంచి ఆలయం తెరవనున్నారు.

February 28, 2026 / 07:13 PM IST

కొండగట్టు ఆలయ ఈవో బదిలీ

JGL: కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ఈవో శ్రీకాంత్ రావును మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి బదిలీ, నియామకం చేస్తునట్లు దేవదాయ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గత సంవత్సరం జనవరి 18న కొండగట్టు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్ రావు ఆలయానికి అందించిన సేవలు, నిర్వహణ అద్భుతమని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

February 28, 2026 / 07:12 PM IST

నార్నూరులో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్

ADB: నార్నూర్ మహాగావ్ శివారులో శనివారం పోలీస్ సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. అనంతరం వాహనదారులకు రోడ్డు భద్రతపై పలు సూచనలు చేశారు. పోలీసుల ట్రాఫిక్ నియమాలను పాటించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసు నమోదు చేయడమే కాకుండా వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని పోలీసులు సూచించారు.

February 28, 2026 / 07:11 PM IST

పరంధోలి, ముకదంగూడా గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరం

ASF: కెరమెరి మండలం పరంధోలి, ముకదంగూడా గ్రామపంచాయతీల్లో NHRC జిల్లా ఛైర్మన్ రాథోడ్ రమేష్ చొరవతో శనివారం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. గ్రామీణ ప్రజలకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు. చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని, ముందస్తు పరీక్షల ద్వారా వ్యాధులను గుర్తించవచ్చన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలు పొందారు.

February 28, 2026 / 07:11 PM IST

ఆకట్టుకున్న గిరిజన విద్యార్థుల సైన్స్ ఎగ్జిబిషన్

ASR: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గుమ్మకోట పంచాయతీ తుమ్మలవలసలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్(బాయ్స్)లో విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. విద్యార్థులు తమ మెదడుకు పదునుపెట్టి పలు వినూత్న ప్రయోగాలు ప్రదర్శించారు. ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సియ్యారి దొన్ను దొర ఈ ప్రదర్శనను వీక్షించి, విద్యార్థులను అభినందించారు.

February 28, 2026 / 07:11 PM IST

జిల్లాలో 25 కరవు మండలాలు

సత్యసాయి: జిల్లాలోని 25 మండలాలను రాష్ట్ర ప్రభుత్వం కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. వర్షపాతం, సాగు విస్తీర్ణం, తేమ తదితర అంశాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కరువు సహాయక చర్యలతో పాటు రైతులకు రుణాల మంజూరుపై దృష్టి సారించాలని కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఆగలి, హిందూపురం, మడకశిర, కదిరి, పుట్టపర్తి సహా పలు మండలాల్లో మధ్యస్థ కరువు ఉన్నట్లు గుర్తించారు.

February 28, 2026 / 07:10 PM IST

శారదాపీఠంపై సర్కార్ కీలక నిర్ణయం

TG: శారదాపీఠం భూములపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోకాపేటలో భూములు పీఠానికే కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జలమండలికి చేసిన భూముల కేటాయింపులను రద్దు చేసింది. పీఠం భూముల్లో నిర్మాణాలపై CM రేవంత్ సమీక్ష నిర్వహించారు. సరైన సమాచారం ఇవ్వలేదని అధికారులపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు కలిసి వివరాలు అందించాలని పీఠం ప్రతినిధులకు సూచించారు.

February 28, 2026 / 07:10 PM IST

‘పంచాయతీలో టాక్స్ కలెక్షన్స్ పూర్తి చేయండి’

ATP: కూడేరు మండల పంచాయతీ కార్యాలయాన్ని DPO T.నాగరాజ నాయుడు ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి రికార్డులను ఆయన పరిశీలించారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో టాక్స్ కలెక్షన్‌లు పూర్తి చేయాలన్నారు. ఇందుకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులతో రివ్యూ చేశారు. ప్రభుత్వ సర్వేలో భాగంగా జరుగుతున్న UFS సర్వేను త్వరగా పూర్తి చేయాలని స్వర్ణ గ్రామ సిబ్బందికి ఆదేశించారు.

February 28, 2026 / 07:10 PM IST

మంత్రిపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ మంత్రి

GNTR: మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లపై శనివారం గుంటూరులోని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన నివాసంపై జరిగిన దాడి వెనుక వీరిద్దరి ప్రమేయం ఉందన్న ఆయన, భవిష్యత్తులో ఈ దాడికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. లోకేశ్‌కు బాధ్యతలు అప్పగిస్తే రాష్ట్రాన్ని ఒక చిన్న పిల్లవాడిలా ఆడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

February 28, 2026 / 07:09 PM IST

‘నల్గొండను స్మార్ట్ సిటీగా రూపుదిద్దుదాం’

నల్గొండ నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపుదిద్దేందుకు రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పని చేద్దామని నల్ల‌గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నల్ల‌గొండ కార్పొరేషన్ తొలి సమావేశం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. న‌ల్ల‌గొండ పట్టణాన్ని రాబోయే కాలంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతామన్నారు.

February 28, 2026 / 07:08 PM IST

కాకినాడ వెళ్లనున్న పవన్ కళ్యాణ్

AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా ప్రమాద బాధితులను పరామర్శించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ రాత్రికి కాకినాడ వెళ్లనున్నారు. కాకినాడ GGHలో చికిత్స పొందుతున్న బాధితులను పవన్ స్వయంగా వెళ్లి పరామర్శించనున్నారు. కాగా, ఈ ఘటనలో 23 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

February 28, 2026 / 07:08 PM IST

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: ఎమ్మెల్యే

కృష్ణా: విద్యార్థులు పరిశోధనల పట్ల ఆసక్తితో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం కోడూరు మండలం బడేవారిపాలెంకు చెందిన సమగ్ర శిక్ష సెక్టోరియల్ ఆఫీసర్ బడే కిషోర్ బాబు రూ. 7లక్షలు వ్యయంతో బడేవారిపాలెం జడ్పీ హైస్కూల్, ఉల్లిపాలెం జడ్పీ హైస్కూళ్లలో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్లను ప్రారంభించారు.

February 28, 2026 / 07:06 PM IST

కాంట్రాక్ట్ బస్తీ సమస్యలు పరిష్కరించాలని కమిషనర్‌కు వినతి

MNCL: బెల్లంపల్లి పట్టణంలోని 105 ఏళ్ల చరిత్ర కలిగిన కాంట్రాక్ట్ బస్తీ సమస్యల వలయంలో చిక్కుకుందని, తక్షణమే అభివృద్ధి పనులు చేపట్టాలని కాంగ్రెస్ నాయకుడు కొలిపాక శ్రీనివాస్ కోరారు. శనివారం 18వ వార్డు ప్రజల తరపున మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నిధుల ద్వారా అభివృద్ధి చేయాలని కమిషనర్‌ను విన్నవించారు.

February 28, 2026 / 07:05 PM IST

మియాపూర్‌లో మహిళల పోటీల జోరు!

RR: అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో మియాపూర్ 240 డివిజన్‌ పరిధిలోని ప్రగతినగర్, న్యూప్రశాంత్ నగర్‌లలో మహిళలకు శనివారం ఉత్సాహంగా ఆటల పోటీలు నిర్వహించారు. ​ఈ పోటీల బహుమతుల ప్రదానోత్సవం మార్చి 7 లేదా 8 తేదీల్లో ప్రగతినగర్ కమ్యూనిటీ హాల్‌లో ముఖ్య అతిథుల సమక్షంలో వైభవంగా జరగనుంది.

February 28, 2026 / 07:04 PM IST

నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం: మంత్రి శ్రీధర్ బాబు

PDPL: నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంథనిలో ఇవాళ ఆయన కలెక్టర్ శ్రీ హర్షతో ఇన్నోవేషన్ ఎక్స్పో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన ఆవిష్కరణలు పట్టణాలకే కాకుండా గ్రామాలకు సైతం విస్తరించడం జరుగుతుందన్నారు. 2034 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తయారు చేస్తామని పేర్కొన్నారు.

February 28, 2026 / 07:04 PM IST