• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేటి మిర్చి ధరలు ఇలా..

WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం మిర్చి ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ తేజ మిర్చి ధర రూ.18400, క్వింటాల్ 341 (కారం కాయ) ధర రూ.21000, క్వింటాల్ ఎల్లో మిర్చి ధర రూ.24000, క్వింటాల్ వండర్ హాట్ మిర్చి ధర రూ.37000, క్వింటాల్ టమాటో మిర్చి ధర రూ.40000గా పలికింది. నేడు మార్కెట్లో క్రియా విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

February 26, 2026 / 09:50 AM IST

స్వల్పంగా తగ్గిన ధరలు

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.210 తగ్గి రూ.1,61,680కు చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గి రూ.1,48,200గా నమోదైంది. అయితే, వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా కిలో రూ.2,95,000 వద్దే స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

February 26, 2026 / 09:47 AM IST

కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన

BDK: చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో స్వయం సహాయక సంఘాల కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు, అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

February 26, 2026 / 09:46 AM IST

షాపల్లి, అమ్మనబోలులో బెల్టు దుకాణాలు బంద్

NLG: నార్కట్‌పల్లి మండలం, షాపల్లి, అమ్మనబోలు గ్రామ పంచాయతీలు గ్రామస్తుల ఆరోగ్య సంరక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకున్నాయి. షాపల్లిలో ఈ నెల 26 నుంచి బెల్టు దుకాణాల నిర్వహణపై కఠిన చర్యలు చేపడతామని పాలకమండలి హెచ్చరించింది. అటు అమ్మనబోలులో మార్చి 1 నుంచి బెల్టు షాపులను నిషేధిస్తూ తీర్మానం చేశారు. ఈ మార్పు ఏ మేరకు సత్ఫలితాలనిస్తాయో వేచి చూడాలి మరి.

February 26, 2026 / 09:46 AM IST

విశాఖకు రూ. 32,373 కోట్ల రుణ లక్ష్యం

VSP: నాబార్డ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 32,373 వేల కోట్ల పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బ్యాంకర్ల సమావేశంలో ఆవిష్కరించారు. ఎంఎస్‌ఎంఈలకు రూ.22,368.75 వేత కోట్లు, వ్యవసాయానికి రూ.4,603.5 కోట్లు, ఇతర రంగాలకు రూ.5,401.1 కోట్లు కేటాయించారు. ప్రాధాన్యతా రంగాలకు రుణాలు విస్తరించాలని బ్యాంకులకు సూచించారు.

February 26, 2026 / 09:45 AM IST

ద్వితీయ సంవత్సర పరీక్షలు.. జమ్మికుంటలో 3 కేంద్రాలు

KNR: ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు నేటి నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జమ్మికుంటలో ఏర్పాటు చేసిన 3 పరీక్ష కేంద్రాల్లో జనరల్ విద్యార్థులు 424, వొకేషనల్ విద్యార్థులు 245 మంది హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

February 26, 2026 / 09:43 AM IST

మంత్రిని కలిసిన నూతన పాలకవర్గం

SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ నూతన పాలకవర్గం సభ్యులు టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మల రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి వెంకటస్వామిని కలిశారు. సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రికి విన్నవించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ వనిత, వైస్ ఛైర్మన్ షఫీ అహ్మద్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్ పాల్గొన్నారు.

February 26, 2026 / 09:43 AM IST

రూ. 1.78 లక్షల రికవరీకి ఆదేశం

CTR: బైరెడ్డిపల్లె మండలంలో 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ పనులకు సంబంధించి ఆడిట్ చేశారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద మీటింగ్ నిర్వహించి ఆ వివరాలు వెల్లడించారు. పనుల్లో సిబ్బంది నిర్లక్ష్యం, రికార్డులు సక్రమంగా లేకపోవడం, దాదాపు రూ. 1.78 లక్షల వరకు అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.

February 26, 2026 / 09:41 AM IST

నెల్లూరులో ఎన్నికలు.. TDP, YCP బలాలు ఇలా.!

NLR: నెల్లూరు మేయర్ ఎన్నిక మరికాసేపట్లో జరగనుంది. కూటమి అభ్యర్థిగా దేవరకొండ సుజాత పేరు ప్రకటించారు. 54 డివిజన్లలో ఓ కార్పొరేటర్ రాజీనామా చేయగా 53మంది ఉన్నారు. 39మంది టీడీపీ కార్పొరేటర్లు కాగా.. వేమిరెడ్డి, కోటంరెడ్డి, నారాయణ ఎక్స్‌అఫీషియో ఓట్లతో కూటమి బలం 42గా ఉంది. వైసీపీలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ఓటు, 14 మంది కార్పొరేటర్లు ఉండటంతో వారి బలం 15గా ఉంది.

February 26, 2026 / 09:40 AM IST

టాలెంట్ టెస్ట్‌లో పల్వంచ విద్యార్థిని టాప్

KMR: పల్వంచ మండలానికి చెందిన జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని విద్యాశ్రీ జిల్లా స్థాయి బయోసైన్స్ టాలెంట్ టెస్ట్‌లో టాపర్‌గా నిలిచింది. కామారెడ్డిలో నిర్వహించిన పరీక్షలో మొత్తం 97 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యాశ్రీని జిల్లా విద్యాధికారి రాజు, మెమెంటోతో సత్కరించినట్లు ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

February 26, 2026 / 09:39 AM IST

నేడు అదిలాబాద్‌లో వాహనాల వేలం పాట

ఆదిలాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలలో వివిధ కేసులు పట్టుబడిన వాహనాలకు గాను గురువారం వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. 15 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో వేలం వేయనన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ప్రభుత్వం నిర్దేశించబడిన ధరావతు సొమ్మును చెల్లించి బహిరంగ వేలం పాటలు పాల్గొనవచ్చు అని వెల్లడించారు.

February 26, 2026 / 09:39 AM IST

ఫ్లాట్‌గా దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 79.59 పాయింట్లు లాభపడి 82355.66 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35.85 పాయింట్ల లాభంతో 25518.35 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.87గా ఉంది.

February 26, 2026 / 09:38 AM IST

వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

NTR: విజయవాడలో AB కన్వీన్షన్ ఫంక్షన్ హాల్‌లో ఈరగాబి రమణారావు కుమార్తె, వివాహ రీసెప్సషన్ కార్యక్రమంలో నందిగామ మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

February 26, 2026 / 09:36 AM IST

వాడపల్లి నిత్యాన్నదాన పథకానికి విరాళం

ASR: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి విజయవాడ ప్రసాదంపాడు వాస్తవ్యులు గంధం రాజేష్ కుమార్ కుటుంబ సభ్యులు రూ.5,00,001 విరాళాన్ని గురువారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు దాత కుటుంబ సభ్యులకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

February 26, 2026 / 09:36 AM IST

శ్రీ భోగేశ్వర స్వామి హుండీ లెక్కింపు ఆదాయం

ATP: పామిడి శ్రీ భోగేశ్వర స్వామి ఆలయంలో భక్తాదులు స్వామి వారికి సమర్పించిన హుండీ కానుకలను బుధవారం లెక్కింపు చేశారు. ఆలయ ఈవో కృష్ణయ్య మాట్లాడుతూ.. గత ఏడాది మార్చి 28 నుండి ఈ ఏడాది ఫిబ్రవరి 25 వరకు భక్తాదులు స్వామి వారికి సమర్పించిన హుండీ కానుకలను లెక్కించగా రూ.1,58,811నగదు,3 గ్రాముల బంగారం, 94 గ్రాముల వెండి వచ్చిందని వారు మీడియాకు తెలిపారు.

February 26, 2026 / 09:36 AM IST