• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం 10:30 గంటలకు జరగనుంది. నగరంపాలెంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ కిస్ట్రినా అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, ఈ సమావేశంలో చర్చకు వచ్చే అంశాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

February 21, 2026 / 07:26 AM IST

సిద్దిపేట ఉపాధ్యాయురాలికి రాష్ట్ర పురస్కారం

SDPT: హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పప్పెట్రీ షోలో సిద్దిపేట జిల్లాకు చెందిన మాధవి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. దుబ్బాక మండలం గంభీర్పూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆమె ప్రదర్శించిన బొమ్మలాట అందరినీ ఆకట్టుకుని రాష్ట్రస్థాయి కన్సోలేషన్ బహుమతిని దక్కించుకుంది. జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, సెక్టోరియల్ అధికారి రమేశ్ ఆమెను అభినందించారు.

February 21, 2026 / 07:25 AM IST

వైసీపీపై MLA ప్రత్తిపాటి పుల్లారావు ఫైర్

PLD: భగవంతుడితో ఆటలాడినందుకే వైసీపీ పతనానికి బాటలు పడ్డాయని శుక్రవారం చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ప్రజాస్వామ్యానికి వైసీపీ ఒక చీడ పురుగు లాంటిదని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారని, తన దిగజారుడు రాజకీయాలకు శాసనమండలిని వేదికగా వాడుకుంటున్నారని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

February 21, 2026 / 07:24 AM IST

బుల్లెట్ల కలకలం.. నిందితుడు అరెస్ట్

AP: తూ.గో జిల్లా దేచర్లలో బుల్లెట్ల కలకలం రేగింది. UP నుంచి వచ్చి ఉంటున్న సమీర్ హుస్సేన్ నుంచి పోలీసులు 9mm పిస్టల్ బుల్లెట్లు 9, 315 రైఫిల్ కోసం ఉపయోగించే 8mm బుల్లెట్లు ఆరింటిని స్వాధీనం చేసుకున్నారు. UP వెళ్లివస్తుండగా పరిచయమైన ఆదిత్యరాజ్ ఇవి ఇచ్చాడని, అతని వద్ద గన్, బుల్లెట్లు ఉన్నాయని సమీర్ పేర్కొన్నాడు. ఆదిత్యపై ఇప్పటికే రాజమండ్రి PSలో పలు కేసులు ఉన్నాయి.

February 21, 2026 / 07:22 AM IST

ఏడుపాయల అమ్మవారి ప్రత్యేక అలంకరణ

MDK: ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని శనివారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను నిర్వహించారు.

February 21, 2026 / 07:22 AM IST

‘రాజ్యాంగం పట్ల అవగాహనతోనే నవసమాజ నిర్మాణం’

GDWL: రాజ్యాంగం పట్ల అవగాహనతోనే భావి భారత పౌరులు ఉత్తమంగా ఎదుగుతారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గద్వాల్‌లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రూపొందించిన ఆడపిల్లల చదువు ఆవశ్యకత పోస్టర్, బాలల కోసం భారత రాజ్యాంగం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. సైన్స్ ప్రచారం మాత్రమే కాకుండా, సామాజిక అంశాలపై జేవీవీ చూపుతున్న చొరవను అభినందించారు.

February 21, 2026 / 07:22 AM IST

వైసీపీ బలోపేతానికి కృషి చేయాలి: మాజీ సీఎం

KDP: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ CM,YS జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు తాడేపల్లిలో ఉపాధ్యాయ MLC,YCP రామచంద్రారెడ్డి జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలు కోసం ఉపాధ్యాయుల తరఫున పోరాటాలు చేస్తున్నామని జగన్ దృష్టికి ఆయన తీసుకెళ్లారు.

February 21, 2026 / 07:20 AM IST

రేలకుంటకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రాక

WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని రేలకుంట గ్రామంలో ఇవాళ SDF నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరు కానున్నారు. ఈ విషయాన్ని మండల పార్టీ అధ్యక్షులు చిట్యాల తిరుపతిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

February 21, 2026 / 07:20 AM IST

ముగ్గురిపై దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

PDPL: గోదావరిఖని మార్కండేయ కాలనీలో శుక్రవారం ఆస్తి వివాదాలతో చిన్నాన్న కుటుంబంపై దాడి చేసిన రామ్ దూత్‌ను అరెస్టు చేసినట్లు ACP మడత రమేష్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొంతకాలం నుంచి రామ్ దూత్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పక్కనే ఉన్న పిన్ని సుమిత్ర పాన్ షాప్ నుండి సిగరేట్ పొగ వస్తుండడంతో గొడవ జరుగుతుండేది. పథకం పన్ని ప్రణయ్, సుమిత్ర, కొమరమ్మపై కత్తితో పొడిచాడన్నారు.

February 21, 2026 / 07:20 AM IST

ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత

NRPT: మరికల్ మండల కేంద్రంలోని జల లింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం భక్తులు శుక్రవారం రూ.50 వేలు వితరణ చేశారు. ఈ నగదును పట్టణ వీర సేవా సంఘం అధ్యక్షుడు శివప్రసాద్‌కు అందజేశారు. దాతల సహకారంతో ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు వీరభద్రప్ప, ప్రకాష్, బుచ్చప్ప తదితరులు పాల్గొని తమ ఉదారతను చాటుకున్నారు.

February 21, 2026 / 07:20 AM IST

నేటి నుంచి నీటి సరఫరాకు అంతరాయం

SKLM: పొందూరు మండలం రెల్లిగడ్డ వద్ద ఉన్న మంచినీటి పైపులు మరమ్మతులకు గురైనట్లు పంచాయతీ ఈవో పొన్నాడ జగదీశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున నేటి నుంచి నాలుగు రోజులు పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని తెలిపారు. మరమ్మతుల అనంతరం యధావిధిగా సరఫరా ఉంటుందన్నారు.

February 21, 2026 / 07:20 AM IST

నేడు అన్ని పాఠశాలల్లో PTA సమావేశం

KMR: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నేడు తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం(PTA) నిర్వహించాలని DEO రాజు ఆదేశించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనాలన్నారు. విద్యార్థుల ప్రగతి, హాజరు శాతంపై టీచర్లు, తలిదండ్రులు చర్చించాలన్నారు. పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల పట్ల ఇంటి వద్ద ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా సూచనలు చేయాలన్నారు.

February 21, 2026 / 07:20 AM IST

నేడు ఎంపీడీవో కార్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక

ATP: గుత్తి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో శనివారం ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్, తెలిపారు. వారు మాట్లాడుతూ.. 2024 ఏప్రిల్, 1వ తేదీ నుంచి 2025 మార్చి, 31వ తేదీ వరకూ మండలంలోని 24 పం చాయతీలలో జరిగిన ఉపాధి పనులకు సంబంధించి సామాజిక తనిఖీలు నిర్వహించారన్నారు.

February 21, 2026 / 07:19 AM IST

‘ఉద్యోగుల గ్రీవెన్స్‌ను ఉద్యోగులు వినియోగించుకోవాలి’

అల్లూరి: ప్రతినెలా 3వ శుక్రవారం నిర్వహించే ఉద్యోగుల గ్రీవెన్స్‌ను ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో లోకేశ్వరరావు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఉద్యోగుల గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ సమస్యలతో వచ్చిన రెవెన్యూ, సచివాలయ శాఖల ఉద్యోగుల నుంచి అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

February 21, 2026 / 07:18 AM IST

మల్లన్న సేవలో కార్మిక శాఖ మంత్రి

NDL: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రికి అధికారులు, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటంతో మంత్రిని ఘనంగా సత్కరించారు.

February 21, 2026 / 07:18 AM IST