BDK: కార్పోరేషన్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నూతన మేయర్ మూడ్ గణేష్ ఇవాళ స్పష్టం చేశారు. తనకు ఇచ్చిన ఈ పదవి ఒక బాధ్యతయుతంగా పనిచేసేందుకు ఉపయోగిస్తానని ఎక్కడ అవినీతికి తావులేకుండా పనిచేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు ఆశీర్వదించి నమ్మకంతో గెలిపించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయనని స్పష్టం చేశారు.
AP: సూపర్ సిక్స్ పథకాల అమలులో గ్రామీణ డాక్ సేవక్ల సేవలు గొప్పవని CM చంద్రబాబు కొనియాడారు. గ్రామీణ డాక్ సేవక్ల గౌరవం పెంచేందుకు సింధియా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మరో ఏడాదిలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారతామని వెల్లడించారు. వికసిత్ భారత్ సాధనలో గ్రామీణ డాక్ సేవక్లు ముందుండాలని సూచించారు. తపాలాశాఖలో చేరిన యువతకు అభినందనలు తెలిపారు.
కాకినాడ తీర ప్రాంతాన్ని రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి ఎప్పుడూ కొనసాగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. శనివారం కాకినాడ స్థానిక బీచ్లో ఎస్కేర్ గోకార్టింగ్ ఆధ్వర్యంలో బీచ్ సందర్శకుల కోసం ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు.
BPT: బాపట్లలో పేరం గరుడాచలం నాయుడు సేవలను ప్రముఖులు కొనియాడారు. ఆదివారం తూర్పు సత్రం వద్ద ఆయనకు నివాళులర్పించారు. పేదల కోసం ఆస్తినంతా దానం చేసిన ఆయన జీవితం ఆదర్శనీయమన్నారు. చీలు రోడ్ సెంటర్లో ఆయన విగ్రహం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే నరేంద్ర వర్మను, తులసి రామచంద్ర ప్రభు, ఉగ్గిరాల సీతారామయ్య అభినందించారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని నోడల్ అధికారి వెంకటరమణ తెలిపారు. 15,173 విద్యార్థులు 34 కేంద్రాల్లో పరీక్షలకు హాజరవుతారు. 300 ఇన్విజిలేటర్లు, CC కెమెరాలు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు, 34 చీఫ్ సూపరింటెండెంట్స్, 6 కస్టోడియన్స్ 34 మెడికల్ ANMలు ఏర్పాటు చేశారు. హాల్ టికెట్ల QR కోడ్ ద్వారా కేంద్ర వివరాలు తెలుసుకోవచ్చు.
NLR: సమర్థవంతంగా పని చేస్తూ జిల్లాను ప్రగతి పథంలో నిలపాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న 26 మందికి వివిధ హోదాలలో పదోన్నతులు కల్పిస్తూ ప్రొసీడింగ్ను కలెక్టర్ అందించారు. సీనియర్ అసిస్టెంట్ నుంచి ఆర్ఎస్ఐలుగా 8మంది, గ్రేడ్-1 గ్రామ రెవెన్యూ అధికారుల నుంచి సీనియర్ అసిస్టెంట్ హోదా కల్పిస్తూ 18 మందికి ఉత్తర్వులు జారీ చేశారు.
E.G: నిడదవోలు బాలికల ఉన్నత పాఠశాలలో నెస్లే సంస్థ CSR నిధులతో నిర్మించిన శానిటేషన్ బ్లాక్ను మంత్రి కందుల ప్రారంభించారు. విద్యార్థినుల ఆరోగ్యం, పరిశుభ్రత, భద్రతకు మౌలిక వసతులు కీలకమని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెబుతూ.. నెస్లే సంస్థ సామాజిక బాధ్యతను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
MLG: గోదావరి జలాలకు సంబంధించిన వివాదం గత కొంతకాలంగా రాజకీయ రంగంలో చర్చనీయాంశంగా మారిందని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం కన్నయ్యగూడెం మండల కేంద్రంలోని దేవాదుల ప్రాజెక్టు వద్ద నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 10 ఏళ్లు పాలించిన ప్రభుత్వం ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి ఉంటే రైతులకు ఇబ్బందులు రాకుండా ఉండేదని CM విమర్శించారు.
SKLM: గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు నియంత్రించాలని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు మండల పరిషత్ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఆదివారం పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం పలువురు మద్యం దుకాణాల్లో సిండికేట్లు ఇష్టారాజ్యముగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశానికి ఎక్సైజ్ అధికారులు ఎవరూ హాజరు కాకపోవడంతో సభ్యులు అసహనం వ్యక్తపరిచారు.
AP: తానెప్పుడూ టెక్నాలజీని ప్రమోట్ చేస్తానని CM చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు ఆర్థిక లావాదేవీలు, దరఖాస్తులు తపాలాశాఖ ద్వారానే జరిగేవన్నారు. కాలక్రమంలో టెలికాం రంగంలో అనేక సంస్కరణలు వచ్చాయని తెలిపారు. ఎంత సాంకేతికత వచ్చినా గ్రామీణ డాక్ సేవక్ల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని చెప్పారు. దేశంలో 3 లక్షల మంది గ్రామీణ డాక్ సేవక్లు ఉన్నారని పేర్కొన్నారు.
BPT: వైసీపీ అబద్ధాల పునాదుల మీద పుట్టిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. గత పాలకుడు రాష్ట్రాన్ని అంధకారం చేశారని మండిపడ్డారు. అందుకే ప్రజలు జగన్కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. దేవుడిని సైతం రాజకీయాలకు వాడుకోవడం దారుణమన్నారు. కౌన్సిల్ హాల్లోకి చెప్పులు, దేవుడి ఫోటోలతో వచ్చి వైసీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.
PLD: చిలకలూరిపేట మండలం రాజాపేటలో ఆదివారం జరిగిన మహా కూటములకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. దేవుని వాక్యంతో ప్రజల కష్టాలు తొలగి, రక్షణ లభిస్తుందని ఆయన అన్నారు. తమ కూటమి ప్రభుత్వం అన్ని మతాలను, వర్గాలను సమానంగా గౌరవిస్తుందని స్పష్టం చేశారు. అనంతరం పేదల ఆరోగ్యం, సంతోషం కోసం ప్రార్థనలు నిర్వహించారు.
కోనసీమ: రామచంద్రపురం పట్టణంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు దునే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం మోడ్రన్ విద్యాసంస్థల అధినేత జీవీ రావుని కలిసి విద్యార్థులకు ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మన్ కీ బాత్ ప్రతి ఒక్కరూ వీక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువమోర్చా అధ్యక్షులు గానాల కళ్యాణ్ పాల్గొన్నారు.
అనంతపురం నగరంలో ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఘనంగా నిర్వహించారు. లలిత కళాపరిషత్ నుంచి విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు గంగలకుంట నరేష్ కుమార్ రెడ్డి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ కన్వీనర్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
AP: తాము చదువుకునేటప్పుడు తపాలాశాఖ అందించిన సేవలు మరిచిపోలేమని CM చంద్రబాబు అన్నారు. తమ చిన్నప్పుడు అన్నింటికీ పోస్ట్మ్యాన్పైనే ఆధారపడే వాళ్లమని తెలిపారు. జ్యోతిరాదిత్య.. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్లో చదువుకున్నారని చెప్పారు. వాజ్పేయీ హయాంలో గ్వాలియర్ రాజమాతతో కలిసి పనిచేశామన్నారు. మాధవరావు సింధియాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తు చేశారు.