NLR: బుచ్చి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వాన్ని స్థానిక ప్రజలు, కార్యకర్తలు నమోదు చేయించారు. ఇప్పటివరకు 200 సభ్యత్వాలు నమోదు చేశామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతంపై కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ప్రసాద్ పాల్గొన్నారు.
W.G: ఆకివీడు తాళ్లకోడు కాలనీలో సమస్యలను పరిశీలించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర ప్రారంభించారు. కాలనీలో రోడ్లు సక్రమంగా లేవని, తాగునీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ లేదని కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కాలనీని ఆకివీడు నగర పంచాయతీలో చేర్చి అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీపీఎం నాయకులు శ్రీనివాస్, బలరాం, సీతారాం తదితరులు పాల్గొన్నారు.
PDPL: ధర్మారంలో ఇవాళ నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం తెలుగు పరీక్షకు 98.32% విద్యార్థులు హాజరయ్యారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, సాధన జూనియర్ కళాశాలలోని కేంద్రాలలో 478 మంది విద్యార్థులకు 470 మంది విద్యార్థులు హాజరయ్యారు. 8 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో పలువురు ప్రభుత్వ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి పద్మజ రాణిని DROగా నియమించింది. జిల్లాలో ఆర్డీవోగా ఉన్న అలివేలు హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ టి.శ్రీనివాస్ రావు జిల్లా రెవెన్యూ అభివృద్ధి శాఖకు బదిలీ అయ్యారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఆల్టైమ్ ఫేవరెట్ హీరో అని టీమిండియా స్టార్ ఆల్రౌండర్ శివమ్ దూబే తెలిపాడు. హిందీ డబ్బింగ్లోనూ తాను తెలుగు సినిమాలు చూస్తానని, ముఖ్యంగా మహేష్ బాబు సినిమాలను అస్సలు మిస్ అవ్వనని పేర్కొన్నాడు. సూపర్ స్టార్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, ఆయనలోని గ్రేస్ తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు.
GNTR: ఆయేషా మీరా అస్థికలను సీబీఐ తల్లిదండ్రులకు అప్పగించనుంది. రేపు తెనాలిలో భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు జరగనున్నాయి. కేసులో దర్యాప్తు విఫలమైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారని ఆశాభావం తెలిపారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి డిసెంబర్ 27ను సంస్మరణ దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
వికారాబాద్ జిల్లాలో నూనె పంటల సాగులో రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఈ గురువారం వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మరియాపూర్ గ్రామంలో భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. వికారాబాద్లో 2,26,000 ఎకరాల్లో కుసుమ నూనె పంటలు సాగుతున్నాయని కలెక్టర్ అన్నారు.
JN: స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో CI ఆధ్వర్యంలో “Arrive Alive” రోడ్డు భద్రతా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా CI జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడిపిన డ్రైవర్లను అభినందిస్తూ వారికి రోజా పువ్వులు అందజేశారు. CI మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని CI అన్నారు.
ADB: నార్నూర్ మండలంలో గురువారం కేంద్ర నీతి ఆయోగ్ బృందం పర్యటించింది. ఆస్పిరేషనల్ బ్లాక్గా నార్నూర్ ఎంపికైన సందర్బంగా జాండ, గుంజాల గ్రామాల్లోని పలు పాఠశాలలను సందర్శించారు. అధ్యాపకుల బోధన విధానాన్ని పరిశీలించి విద్యార్థులు సమస్యలని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బృందం ప్రతినిధి అన్నేక మాఝి, డీఆర్డీవో రవీందర్, ఎంపీడీవో పుల్లారావు పాల్గొన్నారు.
MNCL: చెత్తను మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలని లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని 7వ వార్డు కౌన్సిలర్ రాజు కోరారు. గురువారం ఉదయం ఆ వార్డులోని పలు కాలనీలలో చెత్తతో పేరుకుపోయిన డ్రైనేజీలను మున్సిపల్ కార్మికుల సహాయంతో శుభ్రం చేయించారు. డ్రైనేజీలలో చెత్త వేస్తే మురికి నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి రోడ్డుపై ప్రవహిస్తుందన్నారు. దీంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు.
AP: మాజీమంత్రి బొత్స సత్యానారాయణ వ్యాఖ్యలకు మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల వైసీపీ హయాంలోనే ఆగిందని, తామే ఆపించామని బీఆర్ఎస్ నేతలు తెలంగాణ అసెంబ్లీలో చెప్పారని తెలిపారు. వైసీపీ హయాంలో ఆగినదానికి తాము సమాధానం చెప్పాలా? అని ప్రశ్నించారు.
కోనసీమ: మార్చి 8 వ తేదీన అమలాపురంలోని కామనగరువు డిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆంధ్ర, కోనసీమ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చదరంగ పోటీలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లను జిల్లా విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు, ఏపీసీ మమ్మీ గురువారం ఆవిష్కరించారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన విజేతలకు రూ.లక్ష నగదు బహుమతి, సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు.
BDK: మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్ష కేంద్రాలను డీఎస్పి రవీందర్ రెడ్డి, సిఐ నాగబాబు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పి పరీక్షలు రాసే విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని కళాశాల యాజమాన్యానికి ఆదేశించారు. ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని అన్నారు.
SRD: రాష్ట్రంలోని స్పోర్ట్స్ స్కూల్ లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 4వ తరగతి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాశాఖ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుంచి www.tgss.telangana.gov.in సైట్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు.
NLR: బుచ్చి పట్టణం బేల్దార్ పాళెం లోని పోలేరమ్మ తల్లి ఆలయం పునఃనిర్మాణం జరిగింది. మూడు రోజులు గా మహాకుభాభిషేక కార్యక్రమాలు వైభవంగా జరిపారు. ఇందులో భాగంగా చివరి రోజు 108 కళాశాలతో అమ్మవారికి అభిషేకాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో పోతురాజుస్వామి విగ్రహం ప్రతిష్టించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.