MNCL: చెత్తను మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలని లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని 7వ వార్డు కౌన్సిలర్ రాజు కోరారు. గురువారం ఉదయం ఆ వార్డులోని పలు కాలనీలలో చెత్తతో పేరుకుపోయిన డ్రైనేజీలను మున్సిపల్ కార్మికుల సహాయంతో శుభ్రం చేయించారు. డ్రైనేజీలలో చెత్త వేస్తే మురికి నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి రోడ్డుపై ప్రవహిస్తుందన్నారు. దీంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు.