NLR: బుచ్చి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వాన్ని స్థానిక ప్రజలు, కార్యకర్తలు నమోదు చేయించారు. ఇప్పటివరకు 200 సభ్యత్వాలు నమోదు చేశామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతంపై కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ప్రసాద్ పాల్గొన్నారు.