• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

T20 WC: ఆసీస్‌కు పసికూన సవాల్

T20 WCలో ఈరోజు ఆస్ట్రేలియాతో ఒమన్ తలపడనుంది. ఈ నేపథ్యంలో ఒమన్ కెప్టెన్ జతిందర్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఒత్తిడిలో ఉందని, ఆ జట్టును ఓడించడానికి తమకు ఇదే మంచి అవకాశమని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. పసికూన ఒమన్, ఆస్ట్రేలియాను ఓడిస్తామనడం.. ఆ జట్టుకు సవాల్ విసిరినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

February 20, 2026 / 03:23 PM IST

పది పరీక్షలు సజావుగా నిర్వహించాలి: డీఈవో

SRD: జిల్లాలో మార్చి 14 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. అన్ని పరీక్ష కేంద్రాలలో విద్యుత్, తాగు నీరు, ఫర్నిచర్ తదితర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

February 20, 2026 / 03:22 PM IST

బీసీ వెల్ఫేర్ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

BPT: నిజాంపట్నం బాలుర పాఠశాల, జూనియర్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ (MPC, BiPC, CEC) ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ విషయన్ని ప్రిన్సిపల్ నాగమల్లేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ సీట్లను కూడా భర్తీ చేసున్నామని వెల్లడించారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

February 20, 2026 / 03:22 PM IST

అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఐ ఆందోళన

నంద్యాల జిల్లా డోన్ పట్టనంలో డాక్ట‌ర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం సీపీఐ నాయకులు సామాజిక న్యాయం కోసం ఆందోళన నిర్వహించారు. కార్పొరేట్ సంపదను పునర్పంపిణీ చేయాలని, భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ లింగ వివక్షను నివారించాలని, అందరికీ విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సమానంగా కల్పించాలని డిమాండ్ చేశారు.

February 20, 2026 / 03:20 PM IST

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

చిత్తూరు నగరపరిధిలోని పలు వార్డుల్లో రూ. 49.35 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ ప్రారంభించారు. మిట్టూరులో సిమెంటు రోడ్లు, కాలువలు, పంట్రాంపల్లిలో నూతన బోరు, మోటారును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, స్థానిక టీడీపీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 03:18 PM IST

మోదీ ఆకాంక్షను దేశం సాధిస్తుంది: చంద్రబాబు

AP: దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలన్న ఆకాంక్షతో ప్రధాని మోదీ పని చేస్తున్నారని CM చంద్రబాబు తెలిపారు. మోదీ ఆకాంక్షను దేశం సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. AI అద్భుతాలను సాధిస్తుందని విశ్వాసం ఉందన్నారు. పౌరలందరికీ ప్రయోజనం కలిగేలా సావరిన్ AI వినియోగానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. డీప్ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకెళ్లేలా AP దృష్టి సారిస్తోందన్నారు.

February 20, 2026 / 03:18 PM IST

ప్రాథమిక పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం

SDPT: బెజ్జంకి ప్రాథమిక పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు సాధారణ వైద్య పరీక్షలు చేయగా, ఉపాధ్యాయులకు ఈసీజీ, బీపీ, షుగర్, కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేశారు. కొండ్ల విద్యాప్రకాశ్ కుటుంబం విద్యార్థులకు బహుమతులు ఇచ్చింది. మండల విద్యాధికారి మహతి లక్ష్మి, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 03:17 PM IST

ఆయిల్ పామ్ లాభదాయకమైన పంట: తుమ్మల

TG: రైతులు కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, అధిక ఆదాయాన్ని ఇస్తూ లాభసాటిగా ఉండే ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు పాల్వంచలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ డ్రైవ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయిల్‌ పామ్‌ సాగుకు ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సబ్సిడీలు, సాంకేతిక సహకారం అందిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు.

February 20, 2026 / 03:16 PM IST

విక్రమ్ ‘మహాన్‌’కు సీక్వెల్ ప్లాన్!

తమిళ హీరో విక్రమ్, ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ కలిసి నటించిన మూవీ ‘మహాన్’. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమా OTTలో రిలీజై మంచి హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌పై దర్శకుడు కార్తీక్ మాట్లాడుతూ.. ఈ సీక్వెల్ కోసం తన దగ్గర ఐడియా ఉందన్నాడు. కానీ స్క్రిప్ట్ ఇంకా ప్రారంభ దశలో ఉందని, 2027-28 నాటికి ఇది విడుదలయ్యే ఛాన్స్ ఉందని చెప్పాడు.

February 20, 2026 / 03:16 PM IST

యువత కోసం ‘హరీష్ అన్న’ ఉద్యోగ యాప్ లాంచ్

SDPT: సిద్దిపేట యువత కోసం ఎమ్మెల్యే హరీశ్ రావు సొంత ఖర్చుతో ‘హరీష్ అన్న ఉద్యోగ యాప్’ను ప్రారంభించారు. ఇందులో 57 రకాల పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్‌లైన్ క్లాసులు, 400 నమూనా ప్రశ్నాపత్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ యాప్ పోటీ పరీక్షార్థులకు, ఉద్యోగార్థులకు ఉపయోగపడుతుందని హరీశ్ రావు పేర్కొన్నారు.

February 20, 2026 / 03:15 PM IST

మల్లె బోయినపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం

MBNR: జడ్చర్ల మండలం మల్లె బోయినపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత నివాసం కల్పించడానికి ప్రభుత్వం ఒక్కో ఇంటికి ఐదు లక్షల రూపాయలు అందజేస్తుందని ఆయన చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

February 20, 2026 / 03:15 PM IST

ఓపెన్ స్కూల్ పరీక్షల షెడ్యూల్ విడుదల

WNP: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే టెన్త్, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైందని వనపర్తి డీఈవో అబ్దుల్ గని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 20వ తేదీ నుండి 27వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

February 20, 2026 / 03:15 PM IST

పేలిన గ్యాస్ సిలిండర్

MDK: తూప్రాన్ మండలం ఘనాపూర్ గ్రామంలో వంట చేస్తుండగా ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దొడ్ల సతీష్ ఇంట్లో శుక్రవారం వంట చేస్తుండగా గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇంట్లోని వస్తువులు, ఇంటి గోడలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో బాధితకుటుంబం తీవ్ర ఆందోళనలో మునిగి పోయింది.

February 20, 2026 / 03:15 PM IST

విశ్వానికి మొదటి గురువు తల్లి: ఎమ్మెల్యే

KMM: అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో సత్తుపల్లిలో ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి హాజరయ్యారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ మొదటి కార్యక్రమం 200 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే అభినందించారు. విశ్వానికి మొదటి గురువు తల్లి అని ఏమిలే వెల్లడించారు.

February 20, 2026 / 03:14 PM IST

‘రానున్న MPTC, ZPTC ఎన్నికలను బహిష్కరిస్తాం’

KRNL: ఆదోనిని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. శుక్రవారం ప్రత్యేక జిల్లా హోదా ప్రకటించే వరకు తమ ఓటు వేయబోమని పలువురు గ్రామస్తులు హెచ్చరించారు. రానున్న సర్పంచ్, MPTC, ZPTC ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించారు. ఆదోనికి జిల్లా హోదా కల్పించాలని ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

February 20, 2026 / 03:12 PM IST