BDK: మణుగూరు శివలింగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ సందర్శించారు. ఆశా వర్కర్లతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే వారి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు.
AP: సీఎం చంద్రబాబు ప్రజావేదిక వద్ద దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాళ్లను ఆయన స్వయంగా పరిశీలించి, లబ్ధిదారులతో ముచ్చటించారు. దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
వనపర్తి: దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శనివారం వనపర్తి పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వయం ఉపాధి, విద్య, ఉపాధి అవకాశాల కోసం రవాణా సౌకర్యం చాలా అవసరమని తెలిపారు.
ఢిల్లీ AI సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నేతల తీరును YCP చీఫ్ జగన్ తప్పుబట్టారు.వారి ప్రవర్తన అందరూ తలవంచుకునేలా ఉందని విమర్శించారు. దేశ రాజకీయాలు ఎటు వెళ్తున్నాయో అర్థం కావట్లేదని, ఎన్ని రాజకీయ విబేధాలు ఉన్నా.. ప్రపంచం ముందు అందరూ ఒక్కటిగా ఉండాలని సూచించారు. కాగా నిన్న యూత్ కాంగ్రెస్ నేతలు AI సమ్మిట్లో అర్ధనగ్నంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రకాశం: వై.పాలెం సర్కిల్ కార్యాలయంలో సీఐ ఆధ్వర్యంలో శనివారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ప్రగతిని గురించి సీఐ సమీక్షించారు. ముఖ్యంగా సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఎస్సైలు పాల్గొన్నారు.
TG: HYD ఐటీసీ కాకతీయ హోటల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ లెవెల్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి శివరాజ్ చౌహన్, రాష్ట్ర మంత్రి సీతక్క హాజరయ్యారు. గ్రామీణాభివృద్ధి పథకాల అమలు, కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయంపై ఈ సదస్సులో కీలక చర్చలు జరిపారు. గ్రామీణ ప్రగతికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు సమాలోచనలు చేశారు.
వనపర్తి: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీయడమే సీఎం కప్ క్రీడల ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శనివారం వనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సీఎం కప్ను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
MDK: మున్సిపల్ ఛైర్పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్, వైస్ ఛైర్మన్ దొంతి నరేశ్ గౌడ్లను శనివారం పీఆర్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అధ్యక్షుడు మేడి సతీశ్ రావు నేతృత్వంలో వారిని ఘనంగా సన్మానించి, సంఘం కార్యకలాపాలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు సబ్బాని శ్రీనివాస్, సత్యనారాయణ రెడ్డి, చంద్రశేఖర్ పాల్గొన్నారు
PPM: రాష్ట్రంలో హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోందని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆక్షేపించారు. పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులతో కలసి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకుల వైఖరి పై నిప్పులు చెరిగారు. శుక్రవారం మండలిలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రజలందరూ చీత్కరిస్తున్నారని అన్నారు.
చిన్నారుల్లో ఎనిమిది ఏళ్లలోపే శీఘ్ర రజస్వల లక్షణాలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రొమ్ముల పెరుగుదల, అకస్మాత్తుగా ఎత్తు పెరగడం, ముఖంపై మొటిమలు, శరీర వాసన మారడం వంటివి దీనికి ముఖ్య సంకేతాలు. జంక్ ఫుడ్, జీవనశైలి మార్పులే ఇందుకు ప్రధాన కారణం. పౌష్టికాహారం అందిస్తూ, ఇలాంటి మార్పులు గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
VZM: ఢిల్లీ ఏఐ సమ్మిట్లో చైనా రోబోను స్వదేశీ తయారీగా చూపిస్తూ దేశ ప్రతిష్టను దిగజార్చిన వైనంపై శాంతియుతంగా నిరసన తెలిపిన యువజన కాంగ్రెస్ నాయకులపై, కార్యకర్తలపై బీజేపీ మూకలు దాడులకు దిగారు. ఇది అత్యంత హేయమైన చర్య అని విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ అన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ దాడిని తీవ్రంగా ఖండించారు.
MBNR: పాలమూరు యూనివర్సిటీ ఇంగ్లీష్ విభాగ విద్యార్థి అమ్తుల్ ఫాతిర్ పర్హిన్ పీహెచ్డీ సాధించారు. ప్రొఫెసర్ మనోజ పర్యవేక్షణలో ‘తెలంగాణలోని మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ఇంగ్లీష్ భాష నేర్చుకోవడంలో హై స్కూల్ స్థాయిలో నాన్ ఇంగ్లీష్ మీడియం ముస్లిం మైనారిటీ విద్యార్థుల సమస్యలు’ అనే అంశంపై ఆమె చేసిన పరిశోధనకు గాను పియూ డాక్టరేట్ ప్రదానం చేసింది.
HYD: నగరాన్ని కుదిపేసిన దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్లకు నేటితో 13 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2013 ఫిబ్రవరి 21న జరిగిన ఈ ఘోర ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఘటనాస్థలికి చేరుకుని మృతులకు పుష్పాంజలి ఘటించారు.
TG: హైదరాబాద్లో రాజకీయ సెగలు రేగుతున్నాయి. గాంధీభవన్ ముట్టడికి బీజేవైఎం పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గాంధీభవన్తో పాటు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో నాంపల్లి పరిసరాల్లో హైటెన్షన్ నెలకొంది.
BDK: ఇల్లందు నియోజక వర్గం ముత్యాలంపాడు గ్రామంలో 293 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదవాని సొంతింటి కల ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమని, నిరుపేదలకు సన్నబియ్యం, ఫ్రీ బస్సు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.