SGR: మున్సిపాలిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్లను సోమవారం మాజీ మంత్రి హరీష్ రావు సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం కౌన్సిల్లో రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
AKP: రాంబిల్లి మండలం సీతంపాలెంలో ఈనెల 28వ తేదీన బ్లూ జెట్ పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వస్తున్నట్లు ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం అచ్యుతాపురంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. మంత్రి లోకేష్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
ASR: డుంబ్రిగుడలో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, మినీ వర్కర్లు రెండు రోజుల రిలే నిరాహార దీక్ష ఇవాళ చేపట్టనున్నారు. ఈ దీక్షకు గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ మద్దతు తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
MBNR: గత ఏడు దశాబ్దాలుగా భారత రాజ్యాంగం దేశానికి దిశానిర్దేశం చేస్తూ మౌలిక అంశాలను స్పష్టం చేస్తున్నదని సామాజిక విశ్లేషకుడు, పాలమూరు యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు డా. నాగం కుమారస్వామి తెలిపారు. రాజ్యాంగం పాలకులకోసం మాత్రమే కాదు, పీడిత ప్రజల విముక్తికి రూపొందించబడిన పవిత్ర గ్రంథమని, దాన్ని కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యతని పేర్కొన్నారు.
ELR: DCMS ఏలూరు నిత్యవసర సూపర్ మార్కెట్లో వేరుశనగ నూనె కిలో 300 పప్పునూనె (నువ్వులు) కిలో 370లకు లైవ్లో అందుబాటులో ఉందని డీసీఎంఎస్ ఛైర్మన్ చాగంటి మురళీకృష్ణ తెలిపారు. కావున ప్రజలందరూ నిత్యవసర సరుకులు, నూనెలు తక్కువ ధరకు లభించునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుణ్ణంపల్లి సొసైటీ ఛైర్ పర్సన్ అక్కి శెట్టి సాయి సుధాకర్ పాల్గొన్నారు.
ADB: గుడిహత్నూర్ మండలంలోని పీఆర్ రోడ్డు నుంచి సోమార్పేట్ గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 2.44 కోట్లతో భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని, భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గిరిజన గ్రామాలకు అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసే బాధ్యత నాది అని అన్నారు.
SKLM అంగన్వాడీల వేతనాల పెంపు, ఐసీడీఎస్కు బడ్జెట్ పెంపు కోరుతూ మార్చి 2న జరిగే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. సోమవారం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వర రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగడంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. దేశంలో బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో లేవని వెల్లడించారు. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లతోనే బంగారానికి రెక్కలు వచ్చినట్లు చెప్పారు. ఈ పరిణామాలను RBI ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు నిర్మలమ్మ పేర్కొన్నారు.
MDK: చేగుంట మండలం రుక్మాపూర్లో ఏజెన్సీ కంపెనీ ద్వారా వరి సాగు చేసి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి రైతులకు పరిహారం చెక్కులు అందజేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, సర్పంచ్ నవీన్, pacs ఛైర్మెన్ పరమేశ్, ఎఎంసి డైరెక్టర్ స్టాలిన్ నర్సింలు పాల్గొన్నారు.
హనుమకొండ జిల్లా స్థాయి ఛీఫ్ మినిస్టర్స్ కప్ ముగింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన అభ్యర్థులకు స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి బహుమతులను అందించారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడం లక్ష్యంగా సీఎం కప్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
BHNG: మోత్కూరు మున్సిపాలిటీని అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సామేలు అన్నారు. సోమవారం మోత్కూర్ మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్పర్సన్ మరియు వైస్ ఛైర్మన్లు పదవి బాధ్యతల స్వీకరణ తదుపరి మొదటి సాధారణ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజా సమస్యలు పరిష్కారానికి అందరూ భాగస్వాములు కావాలన్నారు.
BDK: చర్ల సత్యనారాయణపురం గ్రామం సర్పంచ్ గౌతమి ప్రభుత్వ మీసేవలో విధులు నిర్వహిస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్గా గెలిచి ప్రభుత్వ మీసేవ దగ్గర విధులు నిర్వహిస్తున్నారని ఇది పంచాయతీరాజ్ చట్టానికి వ్యతిరేకమని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కారం నరేష్ ఇవాళ స్పష్టం చేశారు. తనపై చర్యలు తీసుకోవాలని ఎండీవోకు వినతిపత్రం అందజేశారు.
SRPT: సూర్యాపేట మున్సిపాలిటీని సుందరీకరణకు కృషి చేస్తామని ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేటలోని 46, 47వ వార్డుల్లో రూ.50 లక్షలతో నాలా కల్వర్టు, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మున్సిపల్ ఛైర్పర్సన్ నివేదితతో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. వారం రోజుల్లో సీఎంని కలిసి ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కోరనున్నట్లు పేర్కొన్నారు.
KRNL: ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో ఇటీవల విధుల్లో చేరిన 12 మంది పారిశుద్ధ్య కార్మికుల పేర్లను మూడు నెలలు గడిచినా ఆప్కాస్లో ఆన్లైన్ చేయలేదని AITUC నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కార్మికులతో కలిసి జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. తక్షణమే పేర్లు ఆన్ లైన్ చేసి, మూడు నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు.
HYD: ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 18 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇవి జరుగుతాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. మొత్తం 9,97,075 మంది విద్యార్థులు హాజరవుతుండగా, 1,495 కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్షల పర్యవేక్షణకు 28,500 మంది ఇన్విజిలేటర్లు నియమించారు.