MDCL: పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో మల్కాజ్గిరి, గౌతంనగర్, ఇందిరానగర్, మౌలాలి, నేరెడ్మెట్ ప్రాంతాల్లోని మసీదులు విద్యుత్ దీపాలతో ముస్తాబయ్యాయి. ఉదయం సేహరీతో ప్రారంభమయ్యే దీక్షలు సాయంత్రం ఇఫ్తార్తో ముగుస్తాయి. రాత్రివేళ తరావీహ్ నమాజ్లకు భక్తులు భారీగా హాజరవుతున్నారు. జకాత్, ఫిత్రా ద్వారా అవసరమైన వారికి సహాయం అందిస్తున్నారు.
NTR: నందిగామలో డ్రగ్స్ పై అవగాహన సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సినీ హీరో సుమన్ హాజరై డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో 30వ రోజుకు చేరిన ఈ ర్యాలీ జాతరను తలపించింది. డీజే సౌండ్స్తో సాగిన ర్యాలీలో పోలీస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
SRCL: జిల్లాలో ప్రణాళిక ప్రకారం రోడ్డు భద్రతా చర్యలు అమలుచేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. ముందుగా గత నెలలో నిర్వహించిన రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం సందర్భంగా చర్చించిన అంశాలపై సమీక్ష చేశారు. రవాణా, ఆర్అండ్బీ, NH, పోలీస్ శాఖ సంయుక్తంగా చేసిన సర్వే వివరాలపై ఆరా తీశారు. అన్ని పెట్రోల్ బంక్లలో కచ్చితంగా నో హెల్మెట్ .. నో పెట్రోల్ అమలు చేయాలన్నారు.
VKB: పరిగిలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర బుధవారం 1.50 కేజీల గంజాయిని పట్టుకుని ఇద్దరు నిందితులు నితీశ్ రఝాక్(22), సూరజ్ కుమార్ (22)ను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్ నుంచి గంజాయిని పరిగికి తీసుకువచ్చి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న లేబర్లకు విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.
AP: మార్కాపురంలో ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు రక్షిత మంచినీరు అందిస్తాం. మార్కాపురం జిల్లాను ఒక సవాలుగా తీసుకుంటా. అన్ని పనులు చేస్తా, ప్రతి ఒక్కరి జీవితంలో మార్పులు తెస్తా. నదుల అనుసంధానం కోసం మా ప్రభుత్వం పనిచేస్తుంది. గోదావరి నుంచి 6 వేల TMCలు సముద్రంలోకి వెళ్లాయి. వెలిగొండకు కాల్సింది 53 TMCలే’ అని పేర్కొన్నారు.
NLG: జిల్లాలో పైలెట్ పద్ధతిన ఎంపిక చేసిన గ్రామాలలో గృహ జ్యోతి లబ్ధిదారులకు అమలు చేస్తున్న ‘రూఫ్ టాప్ సోలార్ సిస్టం’ ఏర్పాటు పనులను మార్చి మొదటి వారంలోపు పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. కనగల్లో టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో గృహజ్యోతి లబ్ధిదారులకు అమలు చేస్తున్న ‘రూఫ్ టాప్ సోలార్ సిస్టం’ పనులను బుధవారం కలెక్టర్ పరిశీలించారు.
AKP: వేతనాలు పెంచాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. బుధవారం ఎలమంచిలి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. మే నెలలో వేసవి సెలవులు ఇవ్వాలన్నారు.
NZB : జక్రాన్పల్లి మండలం పడకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న చందన జాతీయ స్థాయి 46వ సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు గడ్డం శ్రీనివాస్ తెలిపారు. వెస్ట్ బెంగాల్ పోల్బనగర్లో ఈనెల 25 నుంచి మార్చి 1 వరకు జరిగే పోటీల్లో పాల్గొంటుందని చెప్పారు.
SKLM: రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో కోటబొమ్మాళి వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనం ఆధునికీకరణకు నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలానే చీపుర్లుపాడు వద్ద మార్కెట్ యార్డు ,సంబంధిత మౌలిక వసతుల అభివృద్ధికి మంజూరు చేశారు. మొత్తం 3 కోట్ల 20 లక్షల రూపాయలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
KNR: కరీంనగర్ ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నెరవేర్చి చింతకుంటలోని 14వ డివిజన్ ప్రజల మన్ననలు పొందారు కార్పొరేటర్ గడ్డి ప్రదీప్. దీర్ఘకాలికంగా ఉన్న తాగునీటి సమస్యపై స్పందించిన ఆయన, ఎన్నికల ప్రచారంలో భాగంగా సొంత ఖర్చుతో బోరు వేయిస్తానని మాట ఇచ్చారు. గెలిచిన వెంటనే స్పందించి, బోరు నిర్మాణం పూర్తి చేసి నీటి సౌకర్యం కల్పించారు.
ADB: జాతీయ సేవా పథకం శిబిరాల ద్వారా ప్రజలకు సేవలు అందించాలని ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ అన్నారు. బుధవారం ఉట్నూర్లోని ఐటీడీఎ కార్యాలయంలో ఉప సంచాలకులు జాదవ్ అంబాజీ, జాతీయ సేవా పథక నిర్వాహకురాలు కొరిమి ప్రత్యూషలతో కలిసి టీ షర్టులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సంబధిత అధికారులు ఉన్నారు.
SRPT: నడిగూడెం మండల కేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యుడు జీ.శ్రీనివాస్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ, విద్యార్థులకు కల్పించిన వసతులను ఆయన పరిశీలించారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్కు తావులేకుండా నిబంధనల ప్రకారం పరీక్షలు సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
కామారెడ్డి జిల్లాలోనీ సదాశివనగర్ మండల కేంద్రంలో బుధవారం కళ్యాణ లక్ష్మీ పథకం కింద మంజూరైన చెక్కులు బుధవారం పంపిణీ చేశారు. జాయింట్ కలెక్టర్ విక్టర్ హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో సహాయపడుతోందన్నారు. ఈ సందర్భంగా బాధితులు ధన్యవాదాలు తెలిపారు.
విజయనగరంలోని నందివీధిలో వెలసిన శ్రీ పైడితల్లమ్మ వారి (గద్ది) 12వ వార్షిక మహోత్సవాలు ఇవాళ అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఈ మహోత్సవాల్లో నెల్లిమర్ల నియోజవర్గ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు ప్రదీప్ నాయుడు పాల్గొన్నారు..అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన చేతులు మీదగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.
MNCL : జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలో గాజుల సత్తయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న చత్రపతి శివాజీ యూత్ సభ్యులు రూ. 5000, 25 కేజీల రైస్ బ్యాగ్ బుధవారం అందజేసి, మంచి మనసును చాటుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపాడుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చత్రపతి శివాజీ యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.