• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మదనపల్లిలో జరిగిన దారుణం బాధాకరం: మంత్రి

అన్నమయ్య: మదనపల్లిలో జరిగిన దారుణ సంఘటనపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చి, ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.15 లక్షల ఆర్థిక సహాయాన్ని మంత్రి గుర్తు చేశారు. బాధిత కుటుంబానికి అవసరమైన అన్ని విధాల సహాయం అందేలా జిల్లా అధికారులతో సమన్వయం చేస్తామని తెలిపారు.

February 24, 2026 / 08:12 PM IST

‘ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలి’

కృష్ణా: గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో వ్యాపారులతో కమిషనర్ మనోహర్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్‌లను తక్షణమే రెన్యువల్ తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్‌కు కేవలం 4 రోజులు మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. గడువు ముగిసిన తర్వాత ప్రభుత్వం నిబంధనల ప్రకారం 25% పెనాల్టీ విధిస్తామన్నారు.

February 24, 2026 / 08:12 PM IST

గుర్తు తెలియని వ్యక్తి మృతి

ELR: షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌లో హౌరా వెళ్తున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి విజయవాడ సమీపంలో ఒక్కసారిగా స్పృహ తప్పారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఏలూరులో వైద్య పరీక్షలు నిర్వహించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రైల్వే ఎస్సై దానం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.

February 24, 2026 / 08:11 PM IST

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ పట్టివేత

SDPT: బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ మోయతుమ్మెద వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను కోహెడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనిగరం గ్రామ శివారులో తనిఖీల సందర్భంగా TG36-T-2838 నంబరు గల ట్రాక్టర్ పట్టుబడింది. డ్రైవర్ దర్శనం రాజేందర్‌పై కేసు నమోదు చేశారు. కోహెడ ఎస్సై పి. అభిలాష్ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

February 24, 2026 / 08:10 PM IST

రేపు మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన

AP: సీఎం చంద్రబాబు రేపు మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. వెలిగొండ కెనాల్ పనులను చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం మార్కాపురంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు సభా ఏర్పాట్లను మంత్రి గొట్టిపాటి పరిశీలించారు.

February 24, 2026 / 08:10 PM IST

బడుల్లో కులవివక్షను అంతమొందించాలి: రామచందర్ రావు

NGKL. కుమ్మెర ఘటనలో బాధితులపైనే కేసులు నమోదు చేయడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ నేత రామచందర్ రావు మండిపడ్డారు. గుడి, బడి వంటి బహిరంగ ప్రదేశాల్లో కులవివక్షను పూర్తిగా నిర్మూలించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి వెంటనే ఎక్స్రేషియా ప్రకటించి, నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.

February 24, 2026 / 08:08 PM IST

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి: కలెక్టర్

GDWL: జిల్లాలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది జనవరిలో 77 మందిని రక్షించామన్నారు. 2019 నుంచి ఇప్పటివరకు మొత్తం 2,323 మంది పిల్లలను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి చేసి పునరావాసం కల్పించామని వివరించారు.

February 24, 2026 / 08:08 PM IST

28న మల్లికార్జున స్వామి ఆలయ హుండీ లెక్కింపు

SRCL: చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ మోహినికుంట మల్లిఖార్జున స్వామి ఆలయ హుండీని ఈనెల 28న ఉదయం 11 గంటలకు లెక్కించబడునని ఆలయ పూజారి భద్రయ్య ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఆలయ ఆవరణలో జరిగే హుండీల లెక్కింపునకు పర్యవేక్షణకు దేవాదాయ శాఖ, జగిత్యాల డివిజన్ పరిశీలకులు పర్యవేక్షణలో భక్తుల సమక్షంలో హుండీలు లెక్కించబడునని పేర్కొన్నారు.

February 24, 2026 / 08:07 PM IST

కేసుల పరిష్కారంలో సాంకేతికతను వాడాలి: ఎస్పీ

WG: జిల్లాలోని పోలీస్ అధికారులతో ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి మంగళవారం భీమవరం ఆయన కార్యాలయంలో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో నెలవారీ నేర సమీక్ష చేపట్టారు. దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ విధానాన్ని విరివిగా ఉపయోగించాలని ఆయన సూచించారు. నిర్దేశిత కాలపరిమితిలో ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని, మార్చి 14న లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

February 24, 2026 / 08:07 PM IST

‘మత్స్యకారులకు న్యాయం చేయాలి’

BPT: ఈపూరుపాలెం వద్ద ధ్వంసమైన సముద్ర ముఖద్వారాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పరిశీలించారు. పర్యాటక అభివృద్ధి పేరుతో మత్స్యకారుల పొట్టకొట్టడం దారుణమన్నారు. సముద్ర తీరాన్ని ధ్వంసం చేసిన శ్రీ భ్రమర ఇన్‌ఫ్రా యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. దొంగ పట్టాలను రద్దు చేసి, అక్రమ రిసార్టులను కూల్చివేయాలని డిమాండ్ చేశారు.

February 24, 2026 / 08:05 PM IST

‘పరీక్షలకు సంబంధిత అన్ని ఏర్పాట్లు పూర్తి’

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం రేపటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్ష CS వెంకటకేశవులు తెలిపారు. ఫస్టియర్ 200 మంది, సెకండియర్ 187 మంది ఉండగా.. మొత్తం 387 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వెల్లడించారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వాహిష్ఠమని ఆయన పేర్కొన్నారు.

February 24, 2026 / 08:04 PM IST

పాల కేంద్రాల్లో తనిఖీలకు ప్రత్యేక డ్రైవ్

AP: కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాల కేంద్రాల్లో తనిఖీలకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. కల్తీ పాల ఘటనలో ఏడుగురు పరిస్థితి ఆందోళకరంగా ఉన్నట్లు సమాచారం. బాధితుల నివాస ప్రాంతాల్లో పర్యవేక్షిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 24 గంటలు అందుబాటులో ఉండేలా వైద్యులను నియమించనుంది. మరో ఐదు రోజుల్లో ల్యాబ్ రిపోర్ట్స్ వస్తాయని తెలిపింది.

February 24, 2026 / 08:04 PM IST

ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

BDK: భద్రాద్రి జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 37 కేంద్రాల్లో 18,685 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మార్చి 18 వరకు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

February 24, 2026 / 08:04 PM IST

‘నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి’

KMM: డిప్యూటీ సీఎం నివాసాలలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఇవాళ మర్యాపూర్వకంగా కలిశారు. వైరా నియోజకవర్గ సమస్యలను వారికి వివరించి నియోజకవర్గ అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన డిప్యూటీ సీఎం త్వరలో నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

February 24, 2026 / 08:03 PM IST

ఇద్దరు బాలురను తల్లిదండ్రులకు అప్పగింత

CTR: కుప్పం రెసిడెన్షియల్ పాఠశాల నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలురను కుప్పం రూరల్ పోలీసులు 6 గంటల్లోనే గుర్తించి వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ దూడి, పోలీసు బృందం యొక్క వేగవంతమైన, సమర్థవంతమైన ప్రయత్నాలను అభినందించారు. తల్లిదండ్రులు సకాలంలో చర్య తీసుకున్నందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

February 24, 2026 / 08:03 PM IST