• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జిల్లా కోర్టు నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

తిరుపతి దామినేడు సమీపంలో జిల్లా కోర్టు నిర్మించనున్న ప్రతిపాదిత స్థలాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. అలాగే మార్చి 1న నిర్మాణానికి సంబంధించి భూమి పూజ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ ముందస్తు ఏర్పాట్ల పరిశీలనలో ఎస్పీ సుబ్బారాయుడు, మూడవ అదనపు జడ్జి ఎం. గురునాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

February 24, 2026 / 08:17 PM IST

‘అర్హులకు వికలాంగుల పెన్షన్ అందించాలి’

KDP: నగరంలోని ఖలీల్ నగర్లో ఇబ్బందులు వికలాంగ చిన్నారులకు పెన్షన్ అందించాలని వైసీపీ సీనియర్ నేత సుభాన్ బాషా కోరారు. తన స్నేహితుల ద్వారా మతిస్థిమితం లేని ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్న కుటుంబాన్ని ఆయన మంగళవారం పరామర్శించ్చారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని కుటుంబానికి బియ్యం, సరుకులు రూ.10 వేల నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు.

February 24, 2026 / 08:17 PM IST

ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య!

MDK: అనారోగ్య కారణాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కొల్చారంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన ఎల్లమ్మ(49) కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతుంది. సోమవారం ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని వచ్చిన ఆమె మంగళవారం ఇంట్లో ఉరివేసుకుంది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 24, 2026 / 08:16 PM IST

బిగ్ బ్రేకింగ్.. పోలీసుల పేరుతో భారీ మోసం

BDK: బూర్గంపాడు మండలంలో ఇద్దరు ఎస్సైలు, వారి తండ్రిపై చీటింగ్ కేసు నమోదైంది. వ్యాపారం పేరుతో అధిక లాభాలు ఇస్తామని నమ్మించి గిరిజన మహిళ నుంచి రూ.1.82 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. డబ్బులు తిరిగి ఇవ్వకుండా, బెదిరింపులకు పాల్పడడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

February 24, 2026 / 08:16 PM IST

టాప్ 20లో రెండు ఇండియన్ యాప్స్

భారత్‌లో రోజువారీ యాక్టివ్ యూజర్లు అత్యధికంగా ఉన్న టాప్ 20 యాప్స్‌లో రెండు భారతీయ యాప్స్‌ చోటు దక్కించుకున్నాయి. ఆ రెండు యాప్స్‌లో డిజిటల్ పేమెంట్స్ యాప్ ‘ఫోన్ పే’, స్ట్రీమింగ్ యాప్ ‘జియో హాట్‌స్టార్’ ఉన్నాయి. వాట్సాప్ 83.5 కోట్ల వినియోగదారులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. గూగుల్, యూట్యూబ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

February 24, 2026 / 08:16 PM IST

APT PCAకు భూమి కేటాయింపునకు వినతి

SKLM: ఏపీ టాక్స్ ప్రాక్టిషనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడలో ఎమ్మెల్యే, PUC ఛైర్మన్ కూన రవికుమార్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ సంఘ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి పత్రం సమర్పించారు. సంఘ కార్యకలాపాలకు కార్యాలయ నిర్మాణం అవసరమని తెలిపారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

February 24, 2026 / 08:15 PM IST

‘ప్రభుత్వ స్థలాలను అక్రమిస్తే ఎమ్మెల్యే దృష్టికి తీసుకురండి’

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్మశాన వాటికలు, ప్రభుత్వ స్థలాలను ఎవరైనా కబ్జా చేస్తే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దృష్టికి తీసుకురావాలని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. ప్రజల ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో జరుగుతున్నాయని చెప్పారు.

February 24, 2026 / 08:15 PM IST

నిధులు మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి

JGL: వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీరామ భక్తాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఆలయ కమిటీ మంత్రిని కోరారు. ఆలయ ఛైర్మన్ మెరుగు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రిని కలిశారు. అన్నదానం, కళ్యాణ కార్యక్రమాల కోసం రెండు షెడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఆలయానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలన్నారు.

February 24, 2026 / 08:15 PM IST

‘ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై విజయం సాధించాలి’

MDCL: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అన్ని విధాలుగా సిద్ధమై ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై విజయం సాధించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి సూచించారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించి తమ శ్రమకు తగిన ఫలితం అందుకోవాలని ఆకాంక్షించారు. ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు.

February 24, 2026 / 08:15 PM IST

ఉరుకుంద దేవస్థానం డైరెక్టర్‌గా జిలకర సావిత్రి

KRNL: కౌతాళం మండలంలోని ఉరుకుందలో వెలసిన శ్రీ నరసింహ ఈరన్నస్వామి దేవస్థానం డైరెక్టర్‌గా పెద్దకడబూరుకు చెందిన చెందిన జిలకర సావిత్రి నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. పెద్దకడబూరు మండల జనసేన పార్టీ నాయకులు జిలకర గణేష్ తల్లి జిలకర సావిత్రి జనసేన పార్టీ తరుపున ఉరుకుంద ట్రస్ట్ డైరెక్టర్ గా నియమిలయ్యారు.

February 24, 2026 / 08:14 PM IST

‘గ్రామస్థాయి పరిపాలనలో జీపీవోల పాత్ర కీలకం’

MNCL: ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ గ్రామస్థాయి పరిపాలనలో జీపీవోల పాత్ర కీలకమైనదని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ధ్రువపత్రాల జారీ, లబ్ధిదారుల ఎంపిక జీపీవోల ద్వారా చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని సూచించారు.

February 24, 2026 / 08:14 PM IST

హాస్పిటల్‌కు దివంగత డా. కిషన్ రావు పేరు: MLA

SRD: పటాన్ చెరువు పట్టణంలో భారీ CSR నిధులతో నిర్మాణంలో ఉన్న “సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్”కు దివంగత డా. కిషన్ రావు పేరు పెట్టేందుకు తాను తీవ్రంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. CM రేవంత్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్లతో మాట్లాడి, నూతన ఆసుపత్రికి కిషన్ రావు పేరు పెట్టించే దిశగా చర్యలు తీసుకుంటానని కస్బా బృంద సభ్యులతో ఆయన పేర్కొన్నారు.

February 24, 2026 / 08:13 PM IST

రన్‌రేట్ కంటే గెలుపే ముఖ్యం: అశ్విన్

టీమిండియాకు అశ్విన్ కీలక సూచనలు చేశాడు. భారత జట్టు ప్రస్తుతం నెట్ రన్‌రేట్‌ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. రాబోయే మ్యాచుల్లో జింబాబ్వే, వెస్టిండీస్ జట్లపై విజయం సాధించడంపైనే పూర్తి దృష్టి పెట్టాలని సూచించాడు. అలాగే, బ్యాటర్లు కూడా పిచ్ పరిస్థితులకు అనుగుణంగా తమ షాట్ల ఎంపికపై శ్రద్ధ వహించాలని అశ్విన్ సూచించాడు.

February 24, 2026 / 08:13 PM IST

మదనపల్లిలో జరిగిన దారుణం బాధాకరం: మంత్రి

అన్నమయ్య: మదనపల్లిలో జరిగిన దారుణ సంఘటనపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చి, ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.15 లక్షల ఆర్థిక సహాయాన్ని మంత్రి గుర్తు చేశారు. బాధిత కుటుంబానికి అవసరమైన అన్ని విధాల సహాయం అందేలా జిల్లా అధికారులతో సమన్వయం చేస్తామని తెలిపారు.

February 24, 2026 / 08:12 PM IST

‘ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలి’

కృష్ణా: గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో వ్యాపారులతో కమిషనర్ మనోహర్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్‌లను తక్షణమే రెన్యువల్ తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్‌కు కేవలం 4 రోజులు మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. గడువు ముగిసిన తర్వాత ప్రభుత్వం నిబంధనల ప్రకారం 25% పెనాల్టీ విధిస్తామన్నారు.

February 24, 2026 / 08:12 PM IST