నంద్యాల: జిల్లా నందికొట్కూరు మండలం కొణిదెలలో మంగళవారం విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన లక్ష్మీ దేవమ్మ అనే మహిళ మట్టి మిద్దె కూలి మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న నందికొట్కూరు ఎస్సై చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
JGL: రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు, పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. క్రమశిక్షణ, సమయపాలన పాటించి కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని, హాల్ టికెట్ వెంట తీసుకెళ్లాలని తెలిపారు.
KNR: అనుమతి లేకుండా మానేరు వాగు నుంచి ఇసుకను తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను మగ్దుంపూర్ వద్ద విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాతో పాటు, పునరావృతమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
AP: రాజమండ్రిలో పాల కల్తీ, శ్రీకాకుళంలో డయేరియా ఘటనలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీలో బుధవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఒక్కో అంశంపై లఘు చర్చ చేపడదామని, దీనికి సంబంధించి అంశాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
KRNL: గూడూరు మండలం నాగులాపురం పీహెచ్సీ పరిధిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ రఘు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. “జన్మనిచ్చిన తల్లి, జన్మించిన శిశువు ఎవరూ మరణించకూడదు” అనే లక్ష్యంతో సేవలు అందించాలని సూచించారు. గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం చేసుకునేలా ప్రోత్సహించాలని, పోషకాహారం, రక్తహీనతపై అవగాహన కల్పించాలన్నారు.
KRNL: పెద్దకడబూరు మండలంలో దళితులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో దళితులకు రక్షణ కల్పించాలని ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు ఆశీర్వాదం, సుమల రాజేష్ డిమాండ్ చేశారు. మంగళవారం పెద్దకడబూరు పోలీసు స్టేషన్లో ఎస్సై నిరంజన్ రెడ్డికు వినతి అందజేశారు. ఇటీవల చోటుచేసుకున్న ఘటనలను ఖండిస్తూ, ప్రాణహాని ముప్పు ఉన్న నాయకులకు తగిన రక్షణ కల్పించాలని కోరారు.
VZM: సీఎం నారా చంద్రబాబు నాయుడుని మంగళవారం అమరావతిలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన కలిశారు. ఈ సందర్భంగా బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానంగా, బొబ్బిలి దాడితల్లి అమ్మవారు ఉత్సవాన్ని పురస్కరించుకుని బొబ్బిలిలో రోడ్లు అభివృద్ధి కోసం రూ2.0 కోట్లు మంజూరు చేయాలని కోరారు.
WNP: రేవల్లి మండల తలుపునూరు గ్రామానికి చెందిన కౌసల్య అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆమెకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సహకారంతో CMRF మంజూరికి దరఖాస్తు చేసుకోగా రూ. 32 వేలు మంజూరయ్యాయి. మంజూరైన చెక్కును మంగళవారం ఎమ్మెల్యే వనపర్తిలోని తన నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు.
NTR: చందర్లపాడు మండలం చింతలపాడులో ట్రాక్టర్ ప్రమాదంలో కుమారున్ని కోల్పోయిన షేక్ షాకీర్ కుటుంబానికి పట్టణ వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని ఆర్థిక సహాయం అందించారు. వారి కుటుంబ సభ్యులకు దుస్తులు, 10వేల రూపాయల నగదును అందించి ఆయన దాత్రుత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మైనారిటీ విభాగం జిల్లా కార్యదర్శి షేక్ యాకుబ్, తదితరులు పాల్గొన్నారు.
RR: పల్లె ప్రగతిలో సర్పంచుల పాత్ర కీలకమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ముచ్చింతల్ గ్రామ పరిధిలో ఉన్న స్వర్ణభారత్ ట్రస్టులో నిర్వహిస్తున్న రంగారెడ్డి జిల్లా సర్పంచుల శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామస్తులకు సేవ చేస్తే మంచి పేరు వస్తుందని తెలిపారు.
HNK: జిల్లా కేంద్రంలోని అశోక థియేటర్ చౌరస్తాలో ఆటోమేటిక్ సిసి కెమెరాలను ఆర్టీసీ వరంగల్ టు డిపో అధికారులు మంగళవారం ప్రారంభించారు. అశోకా థియేటర్ చౌరస్తా మీదుగా వాహన రాకపోకలు సాగించేవారు. నిబంధనలను అతిక్రమిస్తే కెమెరాలు పసిగట్టి ఈ చాలాన్ ఇంటికి పంపించడం చేస్తాయి. వాహనదారులు నిబంధనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు.
అన్నమయ్య: 2026-27 సంవత్సరానికి గాను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఛైర్మన్ నిశాంత్ కుమార్ మంగళవారం అక్రిడిటేషన్ కార్డులను పంపిణీ చేశారు. మొదటి సమావేశంలో ఆమోదం పొందిన 267 మంది పాత్రికేయులకు కార్డులు జారీ కాగా, మిగిలిన దరఖాస్తులను తదుపరి సమావేశంలో పరిశీలించనున్నట్లు తెలిపారు.
PPM: డీవార్మింగ్ డీవార్మింగ్ మాప్-అప్ డే కార్యక్రమాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు జోగింపేట, కెజిబివి పాఠశాలలో మంగళవారం ఆర్.బి.ఎస్.కె అధికారి డా టి. జగన్ మోహనరావుతో కలిసి పర్యవేక్షణ చేశారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం రోజున ఏవైనా కారణాలచే ఆల్బెండజోల్ మాత్రలు వేయబడని విద్యార్థులు ఎంత మంది ఉన్నారు, అందుకు గల కారణాలు తెలుసుకున్నారు.
TG: మాజీమంత్రి KTRకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘చట్టాల గురించి CM రేవంత్, DGP శివధర్ రెడ్డికి.. KTR చెప్పాల్సిన అవసరం లేదు. రెడ్ బుక్, పింక్ బుక్, ఖాకీ బుక్ గురించి KTR మాట్లాడాల్సిన అవసరం లేదు. ఖాకీ బుక్ ఎప్పటికీ ఉంటుంది. BRS హయాంలో పోలీసులను ఏ విధంగా వాడుకున్నారో మీ చెల్లి చెప్పారు. ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారు’ అని పేర్కొన్నారు.
VKB: ఆలంపల్లికి చెందిన ప్రణీత్ అనే 9వ తరగతి విద్యార్థి మంగళవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు. స్కూల్కు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరిన ప్రణీత్, పాఠశాలకు చేరుకోలేదు. బంధువులు, స్నేహితుల వద్ద విచారించినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎక్కడైనా కనిపిస్తే వెంటనే 98485 99876 నంబర్కు సమాచారం అందించాలని కోరారు.