NGKL: అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ఒక వరమని సర్పంచ్ భీమయ్య అన్నారు. కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామానికి చెందిన కంఠం బాల్ చెన్నయ్య కు మంజూరైన రూ. 27000 విలువైన చెక్కును సర్పంచ్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారు ప్రభుత్వం అందించే ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ATP: రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ, ఉపాధి హామీ అధికారులతో ఎమ్మెల్యే పరిటాల సునీత సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న సీసీ రోడ్లు, డ్రైన్ల పనుల పురోగతిని ఆమె అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
E.G: ప్రభుత్వం CPSను రద్దు చేసి, ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత కల్పించాలని గోపాలపురం ASO జోడాల వెంకట్ కోరారు. CPS రద్దుకై విశాఖలో ఆదివారం జరుగుతున్న దీక్షకు గోపాలపురం నుంచి CPS ఎంప్లాయిస్ రాష్ట్ర సంఘ సెక్రటరీ రొయ్యల నాగ దుర్గారావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు శాంతి, తదితరులు వెళ్లారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు.
SKLM: శ్రీకాకుళంలోని సింహద్వారం వద్ద ఉన్న స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాల్ రావు 34వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదివారం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజగోపాల్ రావు రాజకీయాల్లో ఒక మహోన్నత వ్యక్తి త్వమని కొనియాడారు. వరుసగా ఆరు పర్యాయాలు శ్రీకాకుళం ఎంపీగా సేవలందించారని.
VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వారి స్వర్ణ పుష్పార్చన ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు 108 బంగారు పుష్పాలతో కన్నుల పండుగగా ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజ స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ కల్యాణ మండపంలో వేద మంత్రాల నడుమ స్వామివారి స్వర్ణపుష్పార్చన జరిగింది.
సూపర్ ఫామ్లో ఉన్న టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు మరో గుడ్ న్యూస్ అందింది. 2026 జనవరి నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. పురుషుల విభాగంలో స్కైతో పాటు న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్, ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ కూడా నామినేట్ అయ్యారు.
MHBD: కేసముద్రం మున్సిపాలిటీ నూతన వైస్ ఛైర్పర్సన్గా ఎన్నికైన అల్లం రమ-నాగేశ్వరరావును ఆదివారం ఉదయం 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన వైస్ ఛైర్మన్ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కళ్ళెం శ్రీనివాస్ రెడ్డి, 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కుమారస్వామి ఉన్నారు.
CTR: నింద్ర మండలం కొప్పేడు గ్రామంలో రూ. 36 లక్షల వ్యయంతో నిర్మాణం జరగనున్న విలేజ్ హెల్త్ సెంటర్ (V.H.C)కు భూమి పూజ కార్యక్రమంలో ఆదివారం నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భవిష్యత్లో గ్రామస్తులకు ఆధునిక వైద్య సౌకర్యాలు అందించడానికి ఈ కేంద్రం ముఖ్య పాత్ర వహిస్తుందని పేర్కొన్నారు.
ATP: తాడిపత్రి మండలంలోని హుస్సేనాపురం గ్రామ ఎస్సీ కాలనీలో శ్రీ సీతారాముల ఆలయ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకుడు కాకర్ల రంగనాథ్ ఈ కార్యక్రమానికి హాజరై శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతన పెరగాలని, ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం ఉంటుందని పేర్కొన్నారు.
ASF: కాగజ్ నగర్ పట్టణంలోని బాలాజీనగర్ 11వ వార్డులో ఆదివారం మన్నె యాదగిరికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి MLA హరీష్ బాబు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా MLA మాట్లాడుతూ.. నిర్ణిత గడువులోగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని తెలిపారు. అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని పేర్కొన్నారు.
RR: లక్ష్మీ దేవునిపల్లి గ్రామంలో జరుగుతున్న గణపతి, అభయ ఆంజనేయ, శివాలయ, ధ్వజస్తంభ, నాభి శిల బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి షాద్నగర్ మూడవ వార్డు కౌన్సిలర్ అశోక్ రూ.1,30,000 విరాళంగా అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణం, ప్రతిష్ట మహోత్సవ ఏర్పాట్లు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈ విరాళం ఎంతో తోడ్పాటుగా నిలుస్తుందని తెలిపారు.
TG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఇంటి దగ్గర ఉద్రక్తత వాతావరణం చోటుచేసుకుంది. రామచందర్ రావు కామారెడ్డి వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఆంక్షలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. రామచందర్ రావుతో పాటు పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
NZB: NAC ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనార్టీ యువత కోసం ల్యాండ్ సర్వేలో 3 నెలల ఉచిత శిక్షణ ఇస్తామని జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ లింబాద్రి తెలిపారు. ఈ శిక్షణ ఈ నెల 27 నుంచి ప్రారంభమవుతుందన్నారు. 18-35 సంవత్సరాలలోపు ఉండాలన్నారు. ఇంటర్మీడియట్, లేదా ITI సివిల్ చదివినవారు అర్హులన్నారు. వీరికి స్టేషనరీ, యూనిఫామ్ ఉచితం అని, గ్యారెంటీ ప్లేస్మెంట్ కల్పిస్తామని పేర్కొన్నారు.
MDK: ఉమ్మడి మెదక్ జిల్లాలోని పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 10 నుంచి 20 వరకు సమ్మేటివ్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు సమగ్రంగా సన్నద్ధం కావాలన్నారు.
VZM: బొబ్బిలి తారక రామ కాలనీను ఆదివారం పోలీసులు చుట్టుముట్టారు. డీఎస్పీ భవ్య రెడ్డి ఆదేశాలు మేరకు టిఆర్ కాలనీలో పట్టణ, రూరల్ సీఐలు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అపరిచితులను గుర్తించేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు. నేరాలను నివారించేందుకు అనుమానిత గుర్తు తెలియని వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.