ATP: విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జరిగిన ప్రపంచ తెలుగు కవుల మహాసభల్లో MLA దగ్గుపాటి ప్రసాద్ కుమార్తె ఆశ్రితకు ‘యూత్ ఐకాన్’ అవార్డు లభించింది. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. పీ-4 కార్యక్రమంలో భాగంగా 25 కుటుంబాలను దత్తత తీసుకున్నందుకు ఆమెకు ఈ గౌరవం వరించింది.
SKLM: సారవకోట మండలం అలుదు ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆనందరావు తెలిపారు. శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. పరిసర ప్రాంతాల ప్రజల ఈ విషయాన్ని గమనించి ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
KNR: స్థానిక బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థులు శనివారం తెలంగాణ గ్రామీణ బ్యాంకును సందర్శించారు. హెచ్ఎం జలీల్, ఉపాధ్యాయులు కుమార్, పుష్పలత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ అనిల్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఖాతాల రకాలు, డిపాజిట్లు, వడ్డీ రేట్లు, రుణాల ప్రక్రియ గురించి వివరించారు.
జనగామ పట్టణంలో నేడు చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. బ్రాయిలర్ చికెన్ కిలో రూ.280–300, దేశీ కోడి కిలో రూ.350–380 వరకు విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. సరఫరా తగ్గడం, డిమాండ్ పెరగడం కారణంగా ధరలు ఎగసినట్లు తెలిపారు. ధరలు పెరగడంతో వినియోగదారులు కొనుగోలు తగ్గింది, తద్వారా మార్కెట్లో రద్దీ తగ్గినట్లు కనిపిస్తోంది.
AKP: నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివారం ఉదయం హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతి ఆదివారం హ్యాపీ సండే పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో అందులో పాల్గొనేందుకు పలువురు పోటీపడ్డారు. డాన్సులు చేస్తూ పెద్దలు, పిల్లలు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ జంపా సురేంద్ర, టౌన్ సిఐ షేక్ గపూర్ పాల్గొన్నారు.
KDP: కమలాపురం మండల MRO కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు శివరాంరెడ్డి తెలిపారు. మండలంలోని గ్రామ ప్రజలు తమ భూ-ఇతర రెవెన్యూ సమస్యలను అర్జీరూపంలో సమర్పించి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి కడప రెవెన్యూ డివిజన్ అధికారి కూడా హాజరవుతారని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు నిర్వహించనున్న గిరిజన గురుకుల పాఠశాలల 5, 6, 7, 8, 9 తరగతుల 2026–27 విద్యా సం,లో ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గిరిజన గురుకులాల జాయింట్ సెక్రటరీ DS వెంకన్న తెలిపారు. RCO కార్యాలయంలో ప్రిన్సిపాల్లతో సమక్షంలో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కోరారు.
NDL: జిల్లా వ్యాప్తంగా ఆదివారం చికెన్ ధరలు సాధారణంగా ఉన్నాయి. నంద్యాల వెలుగోడు జూపాడుబంగ్లా గడివేముల తదితర మండలాల్లో లైవ్ కిలో రూ.195 స్కిన్ రూ. 220 స్కిన్ లెస్ రూ. 240-270 చొప్పున విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ. 800-950 చేపలు రూ.180కి అమ్ముతున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి ఫ్రెండ్ ప్రమోద్ శెట్టి హాట్ కామెంట్ చేశాడు. ‘నాకు రష్మిక పెళ్లికి ఇన్విటేషన్ రాలేదు. వస్తే నేను తప్పకుండా వెళ్తాను. కానీ, నాకు తెలుసు.. ఆమె మమ్మల్ని పిలవదు. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు’ అని చెప్పుకొచ్చాడు.
RR: రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ సమీపంలో దారుణ హత్య వెలుగుచూసింది. టోలి చౌకికి చెందిన అమీర్ అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
SRCL: కెనాల్ నిర్మాణం చేపట్టి ఆదుకోవాలని కోరుతూ రైతులు రోడ్డపై నిరసన చేపట్టారు. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామ సమీపంలో ఎల్ఎమ్ 6కెనాల్ నిర్మాణం చేపట్టాలంటూ రైతులు చేపట్టిన నిరసనదీక్ష శనివారానికి 12వ రోజుకు చేరుకుంది. ఇల్లంతకుంట, తంగళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టడంతో పాటు వంటావార్పు చేపట్టారు.
VKB: పరిగికు చెందిన ఫిట్నెస్ తైక్వాండో అకాడమీ విద్యార్థులు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి బంగారు పతకాలు సాధించారు. సాయి రామ్ (U45), ఆకాశ్ (U59), రజిత తమ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. కోచ్ ఖలీముద్దీన్ మాట్లాడుతూ.. భవిష్యత్లో మరిన్ని పోటీల్లో రాణించేందుకు కృషి కొనసాగిస్తామని తెలిపారు.
KMR: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి MLA KVR సవాల్ విసిరారు. సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ వద్దకు వెళ్దామని, తాను తప్పు చేసినట్లు రుజువైతే షబ్బీర్ అలీ కాళ్లు మొక్కి, శాశ్వతంగా రాజకీయం సన్యాసం తీసుకుంటానని అన్నారు. తాను మాట మీద ఉంటానని తెలిపారు. కాంగ్రెసోళ్లు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆట మొదలు పెట్టారని, రేపటి నుంచి అసలు ఆట తాను చూపిస్తానని హెచ్చరించారు.
VZM: రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని ఉపాధి హామీ పథకంలో బాగంగా మూగజీవులకు దాహార్తి తీర్చేందుకు నీళ్ల కుండీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగా కొత్తవలస మండలంలో ఉన్న పలు గ్రామాల్లో శనివారం నీళ్ల కుండీలను స్థానిక ఉపాధి హామీ పనుల కార్యక్రమ అధికారి జనార్ధనరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వేసవికాలంలో పశువులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
VSP: ఉపాధ్యాయుల హక్కుల సాధనకు ఆదివారం విశాఖలో సాగర సంగ్రామ దీక్ష నిర్వహిస్తున్నట్లు పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వై.శ్రీనివాసరావు, ఎస్.టీ.యూ నాయకుడు భాస్కరరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఎస్ రాయవరం ఎంఈఓ కార్యాలయం వద్ద గోడ పత్రికను ఆవిష్కరించారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు.