HYD: ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.10 లక్షలు కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. బంజారాహిల్కు చెందిన ఓ వైద్యురాలు ఆన్లైన్ ట్రేడింగ్ ప్రకటన చూశారు. అనంతరం వాట్సాప్లలో సైబర్ నేరగాళ్లు ఆమెను సంప్రదించారు. మొదటగా రూ.10,000 పెట్టిన బాధితురాలు లాభాలు రావడంతో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టింది. దీంతో నేరగాళ్లు అదును చూసి జండా ఎత్తేశారు.
VKB: కొండాపూర్ పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ప్రధానోపాధ్యా యుడు గోబ్ర్యా నాయక్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. సహచర ఉపాధ్యాయుల కృషితో పాఠశాలకు స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్లో జిల్లా స్థాయి అవార్డు వచ్చిందని తెలిపారు.
TG: గల్ఫ్ దేశాల్లోని తెలంగాణ వాసుల పట్ల వారి కుటుంబసభ్యులు ఆందోళన పడవద్దని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నాయని చెప్పారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారి సమస్యలను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.
MHBD: గంగారం మండలం తిరుమలగండి గ్రామం నుంచి జాతీయస్థాయి క్రికెట్ ఎంపికైన కృష్ణవేణిని సోమవారం MPDO వైష్ణవి, సర్పంచ్ కృష్ణారావు, కార్యదర్శి గోపీచంద్, HM ఆనందరావు సన్మానించారు. ఈ సందర్భంగా వారు కృష్ణవేణికి ఆర్థిక ప్రోత్సాహకంగా రూ. 7,000 అందజేశారు. ఈ కార్యక్రమంలో సెహగల్ కమ్యూనిటీ మొబైల్ (SM) కవిత, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
NLG: రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని చిట్యాల మండలం చిన్నకాపర్తిలో ఇంటింటికీ సాగర్ నీరు అందించడమే లక్ష్యంగా సర్పంచ్ ఆవుల సుందర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. పంచాయతీ పరిధిలోని పైప్లైన్లకు మరమ్మతులు చేయించి, కొత్తగా 5 గేట్ వాల్స్ను ఏర్పాటు చేశామని తెలిపారు. వార్డుల్లో ప్రధాన పైప్లైన్లను సరిచేసి ఇవాళ నీటి సరఫరాను ప్రారంభించారు.
MBNR: జిల్లాలో హోలీ పండుగను సహజ రంగులతో ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ డి.జానకి సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, బలవంతంగా రంగులు చల్లడం, ర్యాష్ డ్రైవింగ్ వంటి చర్యలు చేయరాదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర సమయంలో డయల్-100 లేదా 8712659360ను సంప్రదించాలని సూచించారు.
RR: కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఈరోజు రాత్రి 8 గంటలకు కామ దహన కార్యక్రమం జరుగుతుందని మున్సిపల్ ఛైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ తెలిపారు. కామ దహన కార్యక్రమంలో వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా 4వ తేదీన హోలీ పండుగ జరుపుకోవాలని తెలిపారు.
KDP: బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామ సమీపంలో సోమవారం బొలెరో జీప్, ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన వారిని 108 వాహనం ద్వారా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ASF: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరిస్తారని కలెక్టర్ హరిత అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డేవిడ్తో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్జీ దారుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.
KRNL: నందవరం గ్రామ పంచాయతీ ఆవరణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ ప్రజలు, యువకులు సోమవారం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డిని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో యువతకు స్ఫూర్తినిచ్చేలా శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
KMR: ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలను సోమవారం ఇంటర్ బోర్డు అధికారులు తనిఖీ చేశారు. రాష్ట్ర పరిశీలకులు రమేశ్, అబ్దుల్ నబీ ఆకస్మికంగా సందర్శించి పరీక్షలు నిర్వహణ, గదుల ఏర్పాటు, విద్యార్థులు కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రశ్నపత్రాల భద్రతపై ఆరా తీశారు. అనంతరం సీసీ కెమెరాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న మూవీ ‘పెద్ది’. ఇప్పటికే ‘చికిరి’ పాట రిలీజై సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘రాయ్ రాయ్ రారా’ అంటూ సాగే లిరికల్ వీడియోను ఈరోజు రాత్రి 7:02 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ మూవీ ఏప్రిల్ 30, 2026న విడుదలవుతుంది.
WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో ఆదివారం రాత్రి ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన ఐషర్ 380 ట్రాక్టర్ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ ఘటనపై బాధితుడు సయ్యద్ కరీం సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ట్రాక్టర్ను వెతికేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.
ELR: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల వద్ద ఎస్పీ ప్రతాప్ కిషోర్ 45 ఫిర్యాదులను స్వీకరించారు. ఎక్కువగా మోసపూరిత లావాదేవీలు, భూ తగాదాలు వచ్చినట్లు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయవలసిందిగా అధికారులకు సూచించారు.
BDK: అశ్వాపురం మండల పరిధిలో గల అతి పెద్ద గుట్ట అయిన తుమ్మల చెరువు, కుర్వపల్లి కొత్తూరు గుట్ట పట్టపగలే అగ్నికి ఆహుతి అవుతున్నట్లు స్థానికులు వెల్లడించారు. సంబధిత శాఖ అధికారులు రక్షణ చర్యలు తీసుకుని పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించాలని సోమవారం మండల ప్రజలు కోరారు. మూగ జీవాలు ఈ ప్రమాదాల వల్ల నష్టపోయే అవకాశ ఉందని తెలిపారు.