HNK: నేడు జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్కు 98% విద్యార్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. జనరల్ విద్యార్థులు 17879, ఒకేషనల్ 1017కి 18475 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. జనరల్ విద్యార్థులు 401, ఒకేషనల్ విద్యార్థులు 20 మంది ఆబ్సెంట్ అయ్యారు. విద్యార్థుల హాజరు శాతం 98గా నమోదు అయిందని, ఎలాంటి మాల్ ప్రాక్టీసింగ్ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలిపింది. నిరుపేదలకు ఇబ్బంది లేకుండా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సరిపడా బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని వెంటనే అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మంచు ప్రభావం ఎక్కువగా ఉండనుండటంతో కెప్టెన్ శాంట్నర్ ఛేజింగ్కే మొగ్గుచూపాడు. ఇప్పటివరకు T20 WCల్లో కివీస్తో జరిగిన 5 మ్యాచ్ల్లోనూ సఫారీలే గెలిచారు. అయితే, ICC నాకౌట్ మ్యాచ్ల్లో మాత్రం కివీస్దే పైచేయిగా ఉంది.
అసెంబ్లీ ఆవరణలో మార్చి 8న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విగ్రహ ఏర్పాటుకు కాంక్రీటు పనులను మొదలు పెట్టారు. బేస్ మెంట్ పనులు జరుగుతున్నాయి. అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాల వరుసలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.
BDK: భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలిపారు. బుధవారం పంచాయతీ పరిధిలోని 4, 6, 11వ వార్డుల్లో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సీసీ రోడ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
AP: జగన్ రాష్ట్రంలో అనేక దేవాలయాలను దర్శించారని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. ‘సభలో లేని జగన్ గురించి మాట్లాడారు. తిరుమలకు ఏడుకొండలు ఉండాలని YSR జీవో ఇస్తే చంద్రబాబు రద్దు చేశారు. చంద్రబాబు ఒక్కసారైన తిరుపతిలో తలనీలాలు ఇచ్చారా? లడ్డూపై నిందలు వేసి చర్చకు తెచ్చింది ఎవరు? జగన్కు అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పాలి’ అంటూ డిమాండ్ చేశారు.
NLG: ఎంజీయూ (MGU) కామర్స్ విద్యార్థులకు ‘ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం’ (PMEGP)పై అవగాహన కల్పించారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పథక ఉద్దేశాలు, బ్యాంకు రుణాలు, సబ్సిడీలు, దరఖాస్తు ప్రక్రియపై నిపుణులు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆచార్య శ్రీదేవి, డైరెక్టర్ డా. సురేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి: ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాలు, బహిరంగ మద్యం సేవించడంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. బుధవారం పుట్టపర్తి రూరల్ పరిధిలోని బుగ్గపల్లి అటవీ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ నిర్వహించారు. ఆధునిక సాంకేతికతను వాడుతూ అనుమానాస్పద వ్యక్తుల సంచారం, అక్రమ కార్యకలాపాలను రికార్డు చేశారు.
NDL: సంజామల మండల పరిధిలోని ముదిగేడులో రూ.20 లక్షల నిధులతో బుధవారం నూతన సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సహకారంతో టీడీపీ నేత రాజగోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మీదేవి నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఎస్సీ కాలనీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నూతన రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు.
SRD: జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని కొడకంచి గ్రామంలో ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను అధికారులు పూడ్చారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారి వల్ల వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా స్థానికుల విజ్ఞప్తితో మరమ్మతులు బుధవారం చేపట్టారు. గుంతలు పూడ్చడంతో రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. గ్రామస్తులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
TG: రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై PCC అధ్యక్షుడితో AICC ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. వేం నరేందర్ రెడ్డి, దొమ్మాటి సాంబయ్య పేర్లను అధిష్టానం ప్రస్తావించింది. ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలని నేతల అభిప్రాయం కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీకి ఎవరు పనిచేశారో వాళ్లనే ఎంపిక చేయాలని సూచించారు. రేవంత్ రెడ్డి, రాహుల్, ఖర్గేతో మాట్లాడి తుది నిర్ణయం ప్రకటించనున్నారు.
W.G: భీమవరం కలెక్టరేట్లో బుధవారం రెండు మద్యం బార్లను జనరల్ కేటగిరీలో లాటరీ పద్ధతి జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. తణుకు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఒక మద్యం బార్కు ఎం.దానారావు ఒక్కొరే నాలుగు దరఖాస్తులు వేయడంతో వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
BHPL: గణపురం కోటగుళ్లలో హోలీ పండుగ సందర్భంగా బుధవారం మోదుగు పూలతో స్వామివారిని ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించారు. అలంకరణ కార్యక్రమానికి ముందు మంగళవారం చంద్రగ్రహణం అనంతరం ఆలయ ప్రాంగణంలోని గణపతి, నందీశ్వరుడు నాగదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించి సంప్రోక్షణ పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు నాగరాజు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
KMM: చింతకాని మండలంలో జరిగిన ఇసుక ట్రాక్టర్ ప్రమాద ఘటనలో యజమానిపై కేసు నమోదైంది. ఈ ప్రమాదంలో బోనకల్ మండలం గార్లపాడుకు చెందిన నాగయ్య మృతి చెందారు.మృతుడు తొలుత 19 ఏళ్ల యువకుడిగా భావించినా పదో తరగతి సర్టిఫికెట్స్ ఆధారంగా 16 ఏళ్ల మైనర్ అని తేలింది.నిబంధనలకు విరుద్ధంగా మైనర్కు వాహనం ఇచ్చినందుకు యజమానిపై చర్యలు తీసుకున్నట్లు ఎస్సై వీరేందర్ బుధవారం తెలిపారు.
HNK: ఎర్రగట్టుగుట్ట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను నేడు ఘనంగా నిర్వహించారు. స్వామి వారిని నేడు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎర్రగట్టుగుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, దేవాలయాల అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని ఎమ్మెల్యే అన్నారు.