• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తిరుమల ఆలయంలో నేడు సాయంత్రం పంచాంగ శ్రవణం

NZB: నర్సింగ్ పల్లిలోని ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం ఆలయంలో గురువారం సాయంత్రం 6 గంటలకు పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుందని ఆలయ ప్రధాన ధర్మకర్త శ్రీమాన్ నరసింహారెడ్డి తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు రోహిత్ కుమార్ ఆచార్య పంచాంగ శ్రవణం చేయనున్నారు. మన శాస్త్రాల ప్రకారం ఉగాది పర్వదినాన సాయంత్రం ఆలయాల్లో ఉత్తరాభిముఖంగా కూర్చొని పంచాంగ శ్రవణం చేయడం ఆనవాయతీ.

March 19, 2026 / 11:45 AM IST

కాంగ్రెస్‌లోకి రంగాపూర్ సర్పంచ్

RR: ఉగాది పర్వదినాన షాద్‌నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమక్షంలో రంగాపూర్ గ్రామ సర్పంచ్ అంజమ్మ, ఉప సర్పంచ్ బసవయ్యల ఆధ్వర్యంలో పలువురు వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు.

March 19, 2026 / 11:44 AM IST

ఉప్పల్ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఫీడర్ సర్వీస్ పనులు

MDCL: ఉప్పల్, హబ్సిగూడ ప్రాంతాల్లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అధికారులు ఎక్కడికక్కడ ఫీడర్ సర్వీస్ సేవలు కొనసాగిస్తున్నారు. హనుమాన్ టెంపుల్, నాచారంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుల సమస్యల సైతం కొనసాగిస్తున్నట్లు వివరించారు. వేసవికాలంలో విద్యుత్ డిమాండ్ తగ్గట్లుగా, ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా చర్యలు చేపడుతున్నారు.

March 19, 2026 / 11:43 AM IST

‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్ షోలు రద్దు!

బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ నిన్న సాయంత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కానీ, రీజనల్ లాంగ్వేజ్ ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో మేకర్స్ ఈ మూవీ రిలీజ్‌కు బ్రేక్ వేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కావాల్సిన ఈ సినిమా తెలుగు వెర్షన్ షోలు సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయాయి.

March 19, 2026 / 11:43 AM IST

ఈ నెల 31 వరకు ఉచిత వైద్య శిబిరాలు

KMM: జిల్లాలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 31 వరకు 20 స్పెషలిస్ట్ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 9 శిబిరాలు పూర్తికాగా, మిగిలిన చోట్ల స్త్రీ, శిశు, కంటి వైద్య నిపుణులు ఉచిత పరీక్షలు చేసి మందులు అందజేస్తారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ డి. రామారావు కోరారు.

March 19, 2026 / 11:42 AM IST

మ్యారేజి రిజిస్ట్రేషన్లలో మహబూబ్ నగర్‌కు మొదటి స్థానం

MBNR: మ్యారేజి రిజిస్ట్రేషన్‌లలో మహబూబ్ నగర్ మొదటి స్థానంలో నిలిచింది. మహబూబ్ నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయ పరిధిలో 2025 వ సంవత్సరంలో 1330 హిందువులు 35 మంది ఇతరులు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక ప్రస్తుతం 2026వ సంవత్సరంలో 123 మంది హిందువులు ఒకరు ఇతరులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అట్టడుగు స్థానంలో ఉమ్మడి జిల్లాలోని ఆత్మకూరు నిలిచింది.

March 19, 2026 / 11:40 AM IST

హనుమాన్ జయంతి ఏర్పాట్లు ఘనంగా ప్రారంభం

NRML: నర్సాపూర్ జీ మండలంలోని టెంబుర్ని గ్రామంలో రాబోయే హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ శుభ్రపరిచే పనులు, సంప్రదాయ అలంకరణలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో దేవాలయాన్ని తీర్చిదిద్దుతూ ప్రత్యేక పూజల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పండుగను వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు కొనసాగుతుండగా, గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

March 19, 2026 / 11:40 AM IST

ప్రశాంతి నిలయంలో ఘనంగా ఉగాది వేడుకలు

సత్యసాయి: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం వైభవంగా జరిగాయి. సాయి కుల్వంత్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేద పండితులు శాస్త్రోక్తంగా పంచాంగ శ్రవణం చేశారు. కొత్త ఏడాదిలో వర్షాలు, పంటలు, దేశాభివృద్ధి తదితర అంశాలను భక్తులకు వివరించారు. భక్తి గీతాలాపనతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

March 19, 2026 / 11:39 AM IST

కట్టుపాలెంలో ఘనంగా ఉగాది వేడుకలు

యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో గురువారం కట్టుపాలెం గ్రామంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీతారాముల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీతారామచంద్రల విగ్రహాలను గ్రామంలో ఊరేగించారు. ఈనెల 26న శ్రీరామనవమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పెళ్లి రాట వేశారు. నవమి రోజున సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.

March 19, 2026 / 11:39 AM IST

KGBV ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

KRNL: కోసిగి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి, ఇంటర్మీడియెట్ వొకేషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ షబానా అజ్మీ తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో PSET (Pre School Teacher Training) కోర్సు అందుబాటులో ఉందన్నారు. బాలికలు ఏప్రిల్ 2లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

March 19, 2026 / 11:38 AM IST

సోమందేపల్లి ఎస్సైగా సుధాకర్ యాదవ్ బాధ్యతలు

సత్యసాయి: సోమందేపల్లి మండల నూతన ఎస్సైగా సుధాకర్ యాదవ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనకు పూలు, పండ్లు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్సై పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.

March 19, 2026 / 11:36 AM IST

పోలవరం జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి

AP: కొన్ని రోజులుగా హడలెత్తిస్తున్న పెద్దపులి కాకినాడ జిల్లాను వీడి పోలవరం జిల్లాలోకి ప్రవేశించింది. ప్రత్తిపాడు మండలం బాపన్నదొర కొండల నుంచి పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం ఉర్లాకులపాడుకు చేరిందని అటవీశాఖ సిబ్బంది తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పులి ట్రాకింగ్‌ను DFO శివకుమార్‌ ఆధ్వర్యంలో హనుమాన్‌ బృందాలు పర్యవేక్షిస్తున్నాయి.

March 19, 2026 / 11:35 AM IST

నేటి నుంచి ప్రారంభమైన శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

BDK: భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఇవాళ నుంచి శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 వరకు సాగే ఈ వేడుకల్లో భాగంగా 27న మహోన్నతమైన తిరుకళ్యాణ, 28న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఉగాది పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, రక్షాబంధనం నిర్వహించనున్నారు. సాయంత్రం అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు.

March 19, 2026 / 11:31 AM IST

‘స్తంభాలకు ఎల్ఈడి బల్బులు ఏర్పాటు’

SRD: సిర్గాపూర్ మండలం గైరాన్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని లొంక తండా గ్రామంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడి బల్బులను నేడు అమర్చారు. ఈ పనులను స్థానిక సర్పంచ్ వినోద్ రాథోడ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పంచాయతీ పరిధిలోని మూడు తండాల్లో కూడా వీధి స్తంభాలకు కొత్త బల్బులు అమర్చుతున్నట్లు చెప్పారు.

March 19, 2026 / 11:31 AM IST

ఆకాల వర్షాలకు సజ్జ రైతు విలవిల

KDP: కలసపాడు(M) చెన్నారెడ్డిపల్లెలో అకాల వర్షం రైతుకు తీవ్ర నష్టం మిగిల్చింది. తొండం పేరయ్య సాగుచేసిన సజ్జ పంట చేతికి వచ్చిన సమయంలోనే పూర్తిగా నేలకూలిపోయింది. ఇదే కాకుండా పొలంలో ఉన్న విద్యుత్ స్తంభం, ట్రాన్స్ ఫార్మర్ కూడా దెబ్బతినడంతో పరిస్థితి మరింత విషమించింది. ఈ నష్టంతో రైతు ఆర్థికంగా కుదేలయ్యాడు. ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని వేడుకుంటున్నాడు.

March 19, 2026 / 11:31 AM IST