దేశవ్యాప్తంగా రేపటి నుంచి BSNL 4 జీ నెట్ వర్క్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా వెల్లడించారు. రూ.37 వేల కోట్లతో స్వదేశీ పరి జ్ఞానంతో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసినట్లు తెలిపారు. 97,500 టవర్ల ద్వారా BSNL 4 జీ సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. రేపు ఈ సేవలను ఒడిశా నుంచి ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.