TG: రాష్ట్రంలో అకాల వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాల నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో పంటల రక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులకు అందుబాటులో ఉంటూ వారికి సహాయం అందించాలన్నారు.