AP: అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 3 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలకు ఆయన శ్రీకారం చుట్టారు. దేవగుడిపల్లిలో హేమలత, షేక్ ముంతాజ్బేగం ఇళ్ల గృహప్రవేశాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన ఇళ్లను ఆయన వర్చువల్గా ప్రారంభించారు.